logo

అబుదాబిలో రోడ్డు ప్రమాదం: బాలుడి మృతి

ఉద్యోగరీత్యా యూఏఈలోని అబుదాబిలో ఉంటున్న వైరాకు చెందిన యువ దంపతుల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు

Published : 02 Feb 2023 04:32 IST

చంద్రహాస్‌

వైరా, న్యూస్‌టుడే: ఉద్యోగరీత్యా యూఏఈలోని అబుదాబిలో ఉంటున్న వైరాకు చెందిన యువ దంపతుల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వైరా పట్టణానికి చెందిన సింగు నాగేశ్వరరావు టైలరింగ్‌ చేస్తూ జీవిస్తుంటారు. ఈయన కుమారుడు రాజేశ్‌ అబుదాబిలో ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాజేశ్‌-ఇందిర దంపతుల ఏడేళ్ల కుమారుడు చంద్రహాస్‌ గత నెల 29న (ఆదివారం ఉదయం) ఇంటి సమీపంలో తోటి చిన్నారులతో కలిసి సైకిల్‌ తొక్కుతున్న సమయంలో ఓ కారు ఢీకొట్టడంతో మృతి చెందాడు. బాలుడి మృతదేహాన్ని స్వగ్రామం వైరాకు తీసుకొచ్చి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతితో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని