పరీక్ష ఆలస్యం.. ఆరోగ్యం విషమం
ఖమ్మం గ్రామీణం మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ రొమ్ముపై గడ్డలు ఏర్పడటంతో మూణ్నెల్ల క్రితం జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది.
జిల్లా ఆసుపత్రుల్లో ‘క్యాన్సర్’ నిర్ధారణ ఏర్పాట్లు అవసరం
కొత్తగూడెం వైద్యవిభాగం, ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే
* ఖమ్మం గ్రామీణం మండలానికి చెందిన 40 ఏళ్ల మహిళ రొమ్ముపై గడ్డలు ఏర్పడటంతో మూణ్నెల్ల క్రితం జిల్లా జనరల్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించింది. శస్త్రచికిత్స వైద్య నిపుణులు స్క్రీనింగ్ అనంతరం పరీక్ష (ఎఫ్ఎన్ఏసీ) చేయించగా క్యాన్సర్ ప్రాథమిక దశగా నిర్ధారణైంది. చికిత్స కోసం హైదరాబాద్ ఎంఎన్జే ఆసుపత్రికి సిఫార్సు చేశారు.
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 42 ఏళ్ల మహిళ రొమ్ము భాగంలో కణతులు ఏర్పడటంతో ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించారు. మందులు వాడినా తగ్గకపోవడంతో వైద్యులు నమూనా సేకరించి బయాప్సీకి పంపారు. నివేదికలో క్యాన్సర్గా తేలడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె చికిత్స చేయించుకుంటున్నారు.
* కొత్తగూడెంకు చెందిన మహిళ (29) గొంతు నొప్పి సమస్యతో సింగరేణి ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. అనుమానం వచ్చిన వైద్యులు ఖమ్మంలోని ప్రైవేటు వైద్య కళాశాలకు పంపగా.. అక్కడి ప్రాథమిక పరీక్షల్లో థైరాయిడ్ క్యాన్సర్గా తేలింది. నమూనా సేకరించి హైదరాబాద్కు పంపారు. ఆమె రాజధానిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఉభయ జిల్లాల్లో వివిధ రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వ్యాధి కచ్చిత నిర్ధారణకు పరీక్షలు నిర్వహించే అవకాశం ఏ ఆసుపత్రిలో లేదు. ఖమ్మంలోని జిల్లా ఆసుపత్రిలో స్క్రీనింగ్ సదుపాయం ఉంది. కానీ ల్యాబ్లో బయాప్సీ అవకాశం లేదు. కొత్తగూడెంలోని జిల్లా సర్వజన ఆసుపత్రి, సింగరేణి ఆసుపత్రుల్లో కనీసం స్క్రీనింగ్ పరీక్షలకూ ఏర్పాట్లు లేవు. దీంతో హైదరాబాద్కు సిఫార్సు చేయకతప్పడం లేదు. రోగులు వ్యయప్రయాసలు కోర్చి అంతదూరం వెళ్లిరాక తప్పని పరిస్థితి. సర్వజన ఆసుపత్రిలో బయాప్సీ నమూనాల సేకరణ, పరీక్ష ఫలితాలు వెల్లడించే ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
ప్రమాద ఘంటికలు..
* శరీరంపై ఏర్పడే గడ్డల్లో క్యాన్సర్ లక్షణాలు గుర్తించేందుకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గత ఏడాది ‘సైటాలజీ’ ల్యాబ్ ఏర్పాటైంది. ఇక్కడ గడ్డల్లోని నీటి నమూనాలు సేకరించి సూది పరీక్షలు చేస్తారు. గత నవంబరు నుంచి ఇప్పటివరకు 230 కేసులను పరీక్షించగా 15 మందిలో క్యాన్సర్ లక్షణాలు నిర్ధారణయ్యాయి.
* 2022-23లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మంలో ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా జరిపిన పరీక్షల్లో 103 నోటి, 121 రొమ్ము, 76 మందికి సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలున్నట్లు గుర్తించారు.
‘పాలియేటివ్ కేర్’లో ఉపశమనం
జిల్లా ఆసుపత్రుల్లోని పాలియేటివ్ కేంద్రాల్లో క్యాన్సర్ బాధితులకు హోం కేర్ సేవలందిస్తున్నారు. మొత్తం 15 పడకల చొప్పున ఏర్పాటు చేశారు. రోగులకు ఇన్పేషంట్గా సేవలు కొనసాగిస్తున్నారు. ‘ఆలన’ వాహనం ద్వారా కేంద్రానికి తరలిస్తూ ఊరట కలిగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేంద్రాల్లో 16 వేల మంది చికిత్స పొందారు. పడకలు మరిన్ని పెంచాలని రోగుల కుటుంబాలు కోరుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?