భాజపాను సాగనంపాలి: మాణిక్రావ్ ఠాక్రే
ప్రధాని మోదీ అరాచకాలను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు, పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే అన్నారు.
కేసీఆర్కు వీఆర్ఎస్ ఇవ్వాల్సిందే: రేణుక
వైరా, న్యూస్టుడే: ప్రధాని మోదీ అరాచకాలను అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు, పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే అన్నారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఆదివారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీకి ప్రజల ఆదరణ, మద్దతు పెరుగుతుండటంతో మోదీకి, భాజపాకు భయం పట్టుకుందన్నారు. తప్పుడు కేసులు బనాయించి రాహుల్కు శిక్షలు వేయించిన మోదీ మరీ దిగజారుతున్నారన్నారు. రాహుల్కు మద్దతుగా పార్టీ ఎంపీలు రాజీనామా చేసి అండగా నిలవాలన్నారు. అదానీ రూ.వేల కోట్లు దోచుకుని కార్పొరేటు శక్తిగా మారి భాజపాకు నిధులు సమకూర్చుతున్న విషయం ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న మోదీకి అడ్డుకట్ట వేయకుంటే దేశానికి ఎంతో ప్రమాదమన్నారు. దోచుకునే వారిని వెతికిమరీ రూ.వేల కోట్లు కట్టబెడుతున్న భాజపా సర్కారును సాగనంపాలన్నారు. విపక్ష పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రాహుల్కు మద్దతు పలికారని, అన్ని రాష్ట్రాల నుంచి పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందన్నారు.
మంత్రి అజయ్ అరాచకాలకు అడ్డులేకుండా పోతోంది: ప్రజల కోసం రాహుల్ గాంధీ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నారని, మోదీ పిచ్చి చేష్టలకు ఏ కాంగ్రెస్ కార్యకర్త బెదిరే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపాకు చిరునామా లేదని, భారాస చిరునామా మారిపోతుందన్నారు. కేసీఆర్ పాలనలో సర్పంచులు అప్పులపాలయ్యారని ఆయనకు వీఆర్ఎస్ ఇవ్వాల్సిందేనన్నారు. దుయ్యబట్టారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చేసే అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుందని, కొండలను కరగదీసి భూములు లాక్కుంటున్నారన్నారు. ఆడబిడ్డగా జిల్లా కాంగ్రెస్ను బతికించే బాధ్యత తనదేనన్నారు. ప్రజలు సైతం నిజాయితీగా ఓట్లు వేయాలని నోటుకు అమ్ముడుపోతే ఎంతో వెనక్కిపోతామన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ను ఆదరించారని, ఈసారీ ఎంపీతోపాటు అన్ని స్థానాలు కాంగ్రెస్కే దక్కడం ఖాయమన్నారు. టీపీసీసీ సభ్యుడు ధరావత్ రామ్మూర్తినాయక్ ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్చౌదరి, పీసీసీ ప్రొటోకాల్ ప్రధాన కార్యదర్శి వేణు, సుష్మా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు యడవల్లి కృష్ణ, మానుకొండ రాధాకిషోర్, మానవతారాయ్, రాంరెడ్డి గోపాల్రెడ్డి, సూరంపల్లి రామారావు, మాధవరెడ్డి, అఫ్జల్, పగడాల మంజుల, కట్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా యాత్ర: సభకు ముందు పట్టణంలో జోడో యాత్ర ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప క్షేత్రం నుంచి పాత బస్టాండ్, క్రాస్రోడ్డు మీదుగా తల్లాడ రోడ్డు సభావేదిక వద్దకు ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి స్వయంగా ట్రాక్టర్ నడపగా ఠాక్రే వాహనంపై ఎక్కి సందడి చేశారు. దారి పొడవునా కార్యకర్తలు పూలు చల్లుతూ ఉత్సాహంగా ముందుకు సాగారు. రేణుక ట్రాక్టర్ నడుపుతుండగా స్వల్ప ప్రమాదం జరిగింది. క్రాస్రోడ్డులో జిల్లా కేంద్రానికి చెందిన పార్టీ నాయకుడు ముస్తఫా కాలిపై ట్రాక్టర్ టైరు ఎక్కింది. అతడి పాదానికి గాయం కావటంతో ఖమ్మంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుణ్ని రేణుక పరామర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్