విద్యుదాఘాతంతో కార్మికుడి మృత్యువాత
విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంతో అన్మ్యాన్డ్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురైన సంఘటన ఖమ్మం నగరంలోని ఐటీ హబ్ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది.
యాకూబ్పాషా
ఖమ్మం రోటరీనగర్, న్యూస్టుడే: విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంతో అన్మ్యాన్డ్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురైన సంఘటన ఖమ్మం నగరంలోని ఐటీ హబ్ ప్రాంగణంలో శుక్రవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడిపోయిన కార్మికుడికి అందరూ సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపేందుకు ప్రయత్నించినా కోలుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషాదకర ఘటన పూర్తి వివరాలు ఇవి... ఐటీ హబ్లో విద్యుత్తు సమస్య తలెత్తిందంటూ ఇల్లెందు క్రాస్రోడ్డు ఉప కేంద్రానికి సమాచారం అందింది. లైన్మెన్ విజయ్, జూనియర్ లైన్మెన్ శరత్, అన్మ్యాన్డ్ కార్మికుడు షేక్ యాకూబ్పాషా(42) మరమ్మతు చేసేందుకు అక్కడికి వెళ్లారు. రెండు ఏబీ స్విచ్చుల్లో ఒకటి ఆఫ్ చేసి చేసిన లైన్మెన్, 11 కేవీ తీగల వద్ద మరమ్మతు చేసేందుకు యాకూబ్పాషాని ఎక్కించారు. ఈ క్రమంలో తీవ్ర విద్యుదాఘాతానికి గురైన పాషా అక్కడి నుంచి పడిపోయారు. కాలిన గాయాలతో అతను అపస్మారక స్థితికి చేరారు. దీంతో అక్కడే ఉన్న లైన్మెన్ విజయ్, మరికొందరు కలిసి అతనికి కృత్రిమ శ్వాస అందించేందుకు ప్రయత్నించారు. గుండెను పంపు చేస్తూ, నోటితో గాలి ఊదుతూ, కాళ్లూ చేతులు రుద్దుతూ తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు కోలుకున్న అతన్ని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే అతనికి తిరిగి శ్వాస సమస్య తలెత్తడంతో మెరుగైన వైద్యం కోసం మమత ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పాషా మృతి చెందినట్లు ఏడీఈ రమేశ్ తెలిపారు. ఖానాపురంలో నివసించే పాషాకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.
సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా...
విద్యుదాఘాతంతో అపస్మారక స్థితికి చేరిన పాషాకు సీపీఆర్ చేస్తున్న లైన్మెన్ విజయ్ (కళ్లజోడు వ్యక్తి), నోటితో గాలి అందిస్తున్న మరో వ్యక్తి
ఐటీ హబ్లో అంతర్గతంగా విద్యుత్తు సమస్యలు తలెత్తాయి. వీటిని గుర్తించలేని ఐటీ హబ్ ఎలక్ట్రీషియన్లు విద్యుత్తు సమస్య అంటూ సంస్థ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మరమ్మతుల సమయంలో రెండు ఏబీ స్విచ్చులను ఆఫ్ చేయాల్సి ఉన్నా లైన్మెన్, జేఎల్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఒక్కదాన్నే ఆపేయడంతో విద్యుదాఘాతం ఏర్పడింది. నిబంధనల ప్రకారం మరమ్మతు కూడా లైన్మెన్లే చేయాల్సి ఉంది. అలాగే పని ప్రదేశంలో ఉపయోగించాల్సిన ఎర్త్ రాడ్ను ఉపయోగించలేదు. వీరి నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైందని అన్మ్యాన్డ్ కార్మికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంస్థపరంగా విచారణ జరుపుతామని ఏడీఈ రమేశ్ తెలిపారు.
వరుస ఘటనలు...
ఐటీ హబ్లో వరుసగా రెండు సంఘటనలు జరగడం చర్చనీయాంశమైంది. హబ్లో వాచ్మెన్గా పని చేసే బాసిపొంగు ప్రభాకర్(44) బుధవారం(మే 31న) విధుల్లో ఉండగా రక్తపు వాంతులతో పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండో రోజే విద్యుదాఘాతంతో మరొకరు మృతి చెందడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్