ప్రవేశాల పెంపుపైౖ దృష్టి
ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఈనెల 1న పునః ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పుడిప్పుడే కళాశాలల బాట పడుతున్నారు.
ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు చేస్తున్న అధ్యాపకులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే : ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఈనెల 1న పునః ప్రారంభమయ్యాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇప్పుడిప్పుడే కళాశాలల బాట పడుతున్నారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు మొదలైనప్పటికీ మందకొడిగా సాగుతున్నాయి. ప్రవేశాల సంఖ్య చాలా తక్కువ ఉంది. ఇంత వరకు ఊపందుకోలేదు. ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ అనుబంధ యాజమాన్యాల పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఆదర్శ కళాశాలలు, కేజీబీవీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గ్రామీణ విద్యార్థులు వసతిగృహం అవకాశం ఉన్న కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు. శనివారం వరకు గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు అవకాశం ఉంది. తర్వాత అక్కడ ప్రవేశం లభించని విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరే అవకాశం ఉంది.
ఖమ్మం జిల్లాలో..
పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు ప్రవేశాల సంఖ్య పెంచేందుకు పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించి విద్యార్థుల పేర్లు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విషయం గురించి ప్రచారం చేస్తున్నారు. ఉచిత విద్య, పాఠ్య పుస్తకాలు, ఉపకార వేతనాలు, ఎంసెట్ శిక్షణ, ప్రత్యేక తరగతుల నిర్వహణ, విశాలమైన క్రీడా మైదానాలు, తరగతి గదులు, ల్యాబ్లు తదితర వాటి గురించి అవగాహన కల్పించటం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించుకునేందుకు యత్నిస్తున్నారు.
ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణతో జోష్
ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో పనిచేసే ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించడంతో దాని ప్రభావం ఈసారి ప్రవేశాలపై పడేలా ఉంది. సర్వీసును క్రమబద్ధీకరించుకున్న అధ్యాపకులు ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 132 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 118 మంది అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించిన విషయం తెలిసిందే.
అకాడమీలకు అనుమతి లేదు
జిల్లాలో అకాడమీలకు, ట్యూషన్ పాయింట్లకు ఇంటర్మీడియట్ బోర్డు అనుమతి లేదు. ఇలాంటి సంస్థల్లో తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్పించి నష్టపోవద్దు. అఫిలియేషన్ ఉన్న కళాశాలల్లో మాత్రమే విద్యార్థులను చేర్పించాలి.
కె.రవిబాబు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం