తొమ్మిదేళ్లలో పారిశ్రామిక ప్రగతి అద్భుతం: అజయ్
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పారిశ్రామిక రంగం అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
సభలో ప్రసంగిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పారిశ్రామిక రంగం అద్భుత ప్రగతి సాధిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం ఐటీ హబ్లో మంగళవారం నిర్వహించిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మాట్లాడారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తెలంగాణలో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. తొమ్మిదేళ్లలో 23వేల కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయని, తద్వారా 2,90,000 మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా టీఎస్-ఐపాస్ సింగిల్ విండో సిస్టంను తీసుకొచ్చి 21 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. గతంలో పరిశ్రమల అనుమతుల కోసం అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ఈ పద్ధతి పూర్తిగా తొలిగిపోయిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ చొరవతో కేరళకు చెందిన కీటెక్ కంపెనీ రూ.2వేల కోట్లతో హైదరాబాద్లో, ఐ-ఫోన్ విడి భాగాలను తయారుచేసే ఫాక్స్ కాన్ కంపెనీ కొంగర కలాన్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. తద్వారా ఏకకాలంలో లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయని వెల్లడించారు.
కొనియాడే స్థితికి చేరుకొన్నాం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్యుత్తు కోతలతో పరిశ్రమలు తరలివెళ్లిపోతాయనే స్థాయి నుంచి ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ హైదరాబాద్లో పర్యటించి కొనియాడే స్థితికి చేరుకున్నామని పేర్కొన్నారు. నీరు, విద్యుత్తు లేక పరిశ్రమలు మూసేసిన రోజుల నుంచి అన్ని రంగాల్లో సామాన్యులు సైతం పరిశ్రమలు నెలకొల్పి విజయవంతమయ్యారని చెప్పారు. ప్రస్తుతం అన్ని రకాల పరిశ్రమలకు 24 విద్యుత్తు సరఫరాతో పాటు నీటి సౌకర్యం అందిస్తున్నామన్నారు. గ్రానైట్ పరిశ్రమను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని, ఖమ్మం జిల్లాకు తలమానికంగా ఉన్న గ్రానైట్ పరిశ్రమల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులకు క్రేజ్ పెరుగుతుందని, గత ఏడాది రూ.1.4 లక్షల కోట్లు పెట్టుబడి వస్తే ఈ ఏడాది రూ.2.6 లక్షలు పెట్టుబడి రావడం ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
రెండో ఐటీ హబ్ ద్వారా 2వేల మందికి ఉపాధి
ఖమ్మం జిల్లా కేంద్రంలో అతి తక్కువ కాలంలోనే ఐటీ హబ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ అనుమతిచ్చారని తెలిపారు. అద్భుతంగా నిర్మించి ఆయా కంపెనీల్లో రెండు షిఫ్టుల్లో 1,000 మంది యువత ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. రెండో ఐటీ హబ్కు సైతం శంకుస్థాపన చేశామని, రూ.35 కోట్ల నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, త్వరలోనే 30 కంపెనీలు కార్యకలాపాలు కొనసాగించేలా అందంగా తీర్చిదిద్ది 2,000 మందికి ఉద్యోగాలు అందిస్తామని వెల్లడించారు. రఘునాథపాలెంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్కు 150 ఎకరాల స్థలం కేటాయించామని, త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. జిల్లాలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఉత్తమ పారిశ్రామికవేత్తలకు ప్రశంస పత్రాలు, జ్ఞాపికలను అందజేసి సత్కరించారు. ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ తేజో మూర్తులు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహ్రా, డీసీసీబీ, సుడా ఛైర్మన్లు కూరాకుల నాగభూషయ్య, బచ్చు విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, పరిశ్రమలశాఖాధికారి కె.అజయ్కుమార్, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం ఏఎంసీ మాజీ ఛైర్మన్ గుండాల కృష్ణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
* ద్విచక్రవాహన ప్రదర్శన.. అంతకుముందు వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయం నుంచి ద్విచక్ర వాహన ప్రదర్శన ద్వారా ఐటీ హబ్కు మంత్రి, తదితరులు చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖమ్మం లోక్సభ స్థానంలో 16,31,039 మంది ఓటర్లు
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓటర్ల లెక్క తేలింది. తుది ఓటర్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ శుక్రవారం ప్రకటించారు. -
తేలింది లెక్క.. హోరాహోరీ పక్కా!
[ 27-04-2024]
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా సాగనుంది. -
41 మంది నామపత్రాలు ఆమోదం: కలెక్టర్
[ 27-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 41 మంది నామపత్రాలు ఆమోదం పొందాయని, నాలుగు తిరస్కరణకు గురైనట్లు ఆర్ఓ, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ఇండియా కూటమిదే అధికారం: మంత్రి తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సూట్కేసులు సర్దుకొని వచ్చే వారిని నమ్మొద్దు: నామా
[ 27-04-2024]
సూట్కేసులు సర్దుకుని హైదరాబాద్ నుంచి వచ్చి ఎన్నికలు ముగిసిన తర్వాత వలస వెళ్లే వారి మాటలు నమ్మిమోసపోవద్దని భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాను గెలిపిస్తే యువతకు ఉద్యోగావకాశాలు: తాండ్ర
[ 27-04-2024]
జిల్లాకు కొత్త పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపర్చాలంటే భాజపాకు ఓటేయాలని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. -
అగ్రనేతల ఆగమనం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలను తమవైపు తిప్పుకొనేలా ప్రధాన పార్టీల అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభలు, రోడ్షోలు, కార్నర్ మీటింగ్లకు పూనుకుంటున్నారు. -
ఓటమిని విశ్లేషించు.. గెలుపు మార్గం అన్వేషించు
[ 27-04-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ఓ విద్యార్థిని అనుత్తీర్ణత చెంది ప్రాణాలు తీసుకుంది. పరీక్షల్లో విఫలమయ్యామనే బాధతో మానసికంగా కుంగిపోయిన పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం బాధాకరం. -
సార్వత్రిక సమరంలో.. పోటాకోటీ
[ 27-04-2024]
ఏ స్థాయి ఎన్నికలైనా నేడు పార్టీలు, అభ్యర్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నోటిఫికేషన్ రాకముందే రాజకీయ వర్గాల్లో హడావుడి మొదలవుతుంది. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే ప్రగతి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనస్సును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగల్లాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తిగాంచిన భద్రాచలం రాములోరి ఆలయం ఇలాంటి సుందర, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాలు మానుకోట గిరిజన లోక్సభ స్థానం సొంతం. -
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
ఉమ్మడి నల్గొండ - ఖమ్మం - వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవటంతో ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. -
ఘనంగా రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం
[ 27-04-2024]
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీసీతారాముల విగ్రహాలు, ధ్వజస్తంభం, నాభిశిల, ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం శుక్రవారం నిర్వహించారు. -
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు: తుమ్మల
[ 27-04-2024]
భారాస అధినేత కేసీఆర్ మతి భ్రమించి సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
66 నామినేషన్లు ఆమోదం.. తొమ్మిది తిరస్కరణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పర్వంలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో 66 నామినేషన్లను అధికారులు ఆమోదించగా తొమ్మిదింటిని తిరస్కరించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్