మా కార్యకర్తలూ శక్తిమంతులే..
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులు చైతన్యవంతులు
గత మూడు శాసనసభ ఎన్నికల్లో భారాసకు దక్కింది ఒక్కో సీటే
కొత్తగూడెం జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు డిజిటల్, కొత్తగూడెం
సింగరేణి కార్మికుల హెల్మెట్ ధరించిన సీఎం
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించారు. భాజపా, భారాసపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉమ్మడి జిల్లా ప్రజలు చైతన్యవంతులు అని, అందుకే గత మూడు పర్యాయాల్లో భారాసను ఒక్కో శాసనసభ స్థానానికే పరిమితం చేశారని కొనియాడారు. ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముఖ్యమంత్రి మాదిరి శక్తిమంతులేనని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుతో పాటు ఏపీలో విలీనమైన అయిదు గ్రామాలను తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రామసహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాంనాయక్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు తుమ్మల, పొంగులేటి, కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి
హస్తం శ్రేణుల్లో కదనోత్సాహం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్రెడ్డి మొదటిసారి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి రావటంతో ఆపార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని వివిధ శాసనసభ నియోజకవర్గాల నుంచి జనజాతర సభకు పెద్దఎత్తున జనం తరలిరావటంతో నేతలు హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్నాయక్, మట్టా రాగమయి, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, పిడమర్తి రవి, సీపీఐ నాయకుడు సాబీర్పాషా, వక్కలగడ్డ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ సభకు హాజరైన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు
మోసానికి చిరునామా కేసీఆర్
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
రాష్ట్ర రాజకీయాల్లో మోసానికి చిరునామా కేసీఆర్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలను నమ్మించి కేసీఆర్ మోసగించారని విమర్శించారు. సింగరేణి సంపదను కేసీఆర్తో పాటు ఆయన హయాంలో పనిచేసిన అధికారులు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీలో విలీనమైన అయిదు గ్రామాలను తిరిగి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలపటంతో పాటు మణుగూరు- రామగుండం రైల్వేలైన్, మైనింగ్ విశ్వవిద్యాలయం, పాల్వంచ- కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
గెలుపు తథ్యం.. తేలాల్సింది ఆధిక్యమే..
రేణుకాచౌదరి, రాజ్యసభ సభ్యురాలు
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి గెలుపు తథ్యమని, తేలాల్సిందే ఆధిక్యమేనని ఎంపీ రేణుకాచౌదరి ధీమా వ్యక్తం చేశారు. కరవు కాలంలోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సీఎం రేవంత్రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
రఘురాంరెడ్డి, ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఐదు గ్యారంటీలు అమలుచేసిన ఘనత కాంగ్రెస్దేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆదరించి గెలిపిస్తే ఖమ్మం లోక్సభ స్థానాన్ని ప్రగతి పథంలో ముందుంచుతానని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రకటన.. నియంత్రణ నటన
[ 18-05-2024]
వర్షాకాలం ఈదురుగాలుల సమయంలో హోర్డింగులు, ఫ్లెక్సీల నిర్మాణాలు ఎక్కడ కూలి మీద పడతాయోనన్న భయం పట్టణ, నగరప్రాంత ప్రజలను వెంటాడుతోంది. ఇటీవల ముంబయిలో అక్రమంగా ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. -
బీమాతోనే రైతుకు ధీమా
[ 18-05-2024]
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు చేతికందే సమయంలో అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. అన్నదాతలకు తీవ్ర నష్టాలను మిగుల్చుతున్నాయి. నష్ట వివరాలపై వ్యవసాయ అధికారులు నివేదిస్తున్నా పరిహారం అందని బాధితులెందరో. -
ఉద్యోగుల పిల్లల ఉన్నత విద్యకు.. సంగరేణి సహకారం
[ 18-05-2024]
ఉద్యోగుల పిల్లల ఉన్నత చదువులకు సింగరేణి ఊతమిస్తోంది. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రోత్సాహాన్ని అందించాలని యాజమాన్యం 2017లో నిర్ణయం తీసుకొంది. 2017-18 నుంచి 2022-23 విద్యాసంవత్సరం 40 మందికి రూ.76,06,760 సాయాన్ని విడుదల చేశారు. -
తాలిపేరుకు సాంకేతిక సొబగులు
[ 18-05-2024]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు ప్రత్యేక సాంకేతికను అందిపుచ్చుకోనుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) కింద స్కడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజేషన్) సిస్టంతో అనుసంధానించనున్నారు. -
ఉచిత వసతి.. కార్పొరేట్ విద్య
[ 18-05-2024]
ఉచిత వసతి.. కార్పొరేట్ బోధన.. వ్యవసాయ నేపథ్యం, వెనకబడిన తరగతుల వారికి ప్రవేశాల్లో ప్రాధాన్యం.. వెరసి ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్’ పథకానికి ఏటా ఆదరణ లభిస్తోంది. ఒకటో తరగతి నుంచే ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. -
పచ్చడి మామిడి మరింత ప్రియం
[ 18-05-2024]
ఆవకాయ పచ్చడి ముందు పేద, ధనిక వర్గాలనే తేడా ఉండదు. ప్రతి సీజన్లో తమ కుటుంబాలకు తగిన మోతాదులో ఇంటి వద్ద తయారు చేసుకుంటారు. అత్యధిక ఇళ్లల్లో సంవత్సరం పొడవునా సిద్ధంగా ఉంటుంది. ఇలా అందరూ ఇష్టపడే పచ్చడి ప్రియం అవుతోంది. -
మౌలిక వసతుల కల్పనలో పురోగతి: కలెక్టర్
[ 18-05-2024]
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు పురోగతిలో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మ ఆదర్శ కమిటీల అభివృద్ధి పనులపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ను శుక్రవారం నిర్వహించారు. -
ఒక్క అవకాశమిస్తే ప్రజల పక్షాన నిలబడతా: గుజ్జుల
[ 18-05-2024]
ప్రాధాన్య క్రమంలో మొదటి ఓటు వేసి తనను గెలిపించాలని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 27 జరిగే ఉప ఎన్నిక పోలింగ్లో భాజపాకు ఓటేయాలని కోరారు. -
అవినీతి ఘటనపై సీఎండీ ఆగ్రహం
[ 18-05-2024]
రైతు పంటపొలానికి విద్యుత్తు లైను, నియంత్రిక ఏర్పాటుకు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు ఏఈ పట్టుబడిన నేపథ్యంలో టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలి
[ 18-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటరు చిట్టీలను వంద శాతం పంపిణీ చేయాలని కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్డీఓలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరుకు బీఎల్వోల ద్వారా ఓటరు చిట్టీలు అందించాలన్నారు. -
అధికారి తీరుపై గుర్రు!
[ 18-05-2024]
ప్రజాసంబంధాలు, పౌర సేవలను పల్లెల వరకు విస్తరించాల్సిన శాఖకు ఆయన జిల్లా స్థాయి అధికారి. తన పరిధిలో వందల సంఖ్యలో ఉద్యోగులుంటారు. గ్రామస్థాయి కార్యాలయాల ద్వారా నిరంతర సేవలు కొనసాగుతుంటాయి. -
రాములోరి వెండి లెక్కలపై గందరగోళం వీడేనా?
[ 18-05-2024]
భద్రాచలం రామాలయంలో స్వామివారికి ఉన్న ఆభరణలలో వెండి లెక్కపై గందరగోళం వీడడం లేదు. సుమారు 68కిలోల బంగారం, 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం