logo

దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!

‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు..

Updated : 10 May 2024 06:07 IST

ఓ కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చూపుతున్న గ్రామస్థులు

‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌కు దూరంగా ఉంటాం’ అని చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడు పంచాయతీ వాసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు   అధికారులను కదిలించాయి. గ్రామాన్ని ఆర్డీఓ మధు, డీఎస్పీ అబ్దుల్‌ రెహ్మాన్‌ గురువారం  సందర్శించారు. స్థానికులతో సమస్యలపై మాట్లాడారు. సమస్యలుంటే అధికారులను కలిసి విన్నవించుకోవాలని.. ఓటేయబోమని తీర్మానించడం సరికాదని నచ్చజెప్పారు. ఓటుహక్కు వినియోగించుకుంటామని గ్రామస్థులు చెప్పడంతో అధికారులు    వెనుదిరిగి వెళ్లారు. తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో చంద్రశేఖర్‌రావు, ఎంపీవో సత్యనారాయయణ పాల్గొన్నారు.

చుంచుపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని