పాలేరు మళ్లీ పోటెత్తాలి..
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది.
కూసుమంచి, న్యూస్టుడే: సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. తమ ఓటును వినియోగించుకోవడంలో ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు సెగ్మెంట్ ఎప్పుడూ తన ప్రత్యేకత చాటుకుంటోంది. రాష్ట్రంలోనే అతి ఎక్కువ శాతం పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. వచ్చే సార్వత్రిక పోలింగ్లోనూ సత్తా చాటేందుకు నియోజకవర్గ వాసులు సమాయత్తమవుతున్నారు.
పెరిగిన ఓటర్లు.. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2,36,287 ఓట్లు ఉండగా, 2,14,810 మంది ఓటు వేశారు. ప్రస్తుత ఓటర్లు 2,40,806 మంది. వీరిలో 1,15,717 పురుషులు కాగా, 1,25,081 మంది మహిళలు.. ఎనిమిదిమంది ఇతరులున్నారు. ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పోలింగ్ కేంద్రాల సంఖ్య పెంచింది. 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఎందుకిలా?
- నియోజకవర్గంలో 90 శాతం గ్రామీణ ప్రాంతమే. ఖమ్మం నగర శివారులో ఉండే ఖమ్మం గ్రామీణం మండలంలోని కొన్ని కాలనీలు మినహా ఓటర్లంతా గ్రామీణులే. పల్లెవాసుల్లో ఓటు చైతన్యం ఎక్కువగా ఉంటోంది.
- ఓటు హక్కు వినియోగంలో అలసత్వానికి తావీయకుండా ప్రతి ఎన్నికల సమయంలో క్రమశిక్షణగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు. గంటలపాటు క్యూలో నిల్చోవాల్సి వచ్చినా ఓపికగా వేచిఉంటున్నారు.
- రాజకీయ చైతన్యం కూడా గణనీయ ఓటింగ్కు మరో కారణం.
- ప్రభుత్వ యంత్రాంగం ప్రచారం, రాజకీయ పార్టీల నాయకత్వం చూపించే చొరవ సైతం భారీ ఓటింగ్కు కారణమవుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలా..
2014: 89.22 2019: 82.87 (జిల్లాలో మొదటి స్థానం)
శాసనసభ ఎన్నికల్లో
2018: 90.99 (రాష్ట్రంలో ద్వితీయ స్థానం)
2023: 90.91 శాతం (జిల్లాలో ప్రథమ).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే