బంగారు పర్వదినం
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు.
శుభ ముహూర్తంగా అక్షయ తృతీయ
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్టుడే: అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. పురాణ ఇతిహాసాల్లో అక్షయ తృతీయ ప్రాధాన్యంపై వివిధ అంశాలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. అక్షయ తృతీయ నాడు చేసే కార్యాలు అనంత ఫలితాలనిస్తాయని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఉత్తరాదిన నిర్వహించే ఈ పర్వదినం ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వేడుకగా జరుపుకొంటున్నారు. భిన్న సంస్కృతుల సమ్మేళనంగా పేరొందిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మార్వాడీ కుటుంబాలతో పాటు తెలుగు కుటుంబాలు అక్షయ తృతీయను ఆనందంగా జరుపుకొంటున్నారు.
శుభముహూర్తంగా భావిస్తూ..
అక్షయ తృతీయను మార్వాడీ కుటుంబాలు వివాహాలకు శుభ ముహూర్తంగా భావిస్తాయి. ఈ రోజున కల్యాణం చేసుకునే వధూవరులు అష్టైశ్వర్యాలుతో అన్యోన్యంగా జీవిస్తారని వారి నమ్మకం. సంవత్సరంలో శుభకార్యాలు చేయడానికి తిథి, వార, నక్షత్రాలకు పండితుడిని సంప్రదించినప్పటికీ అక్షయ తృతీయకు అవేమీ వర్తించవని ఈ రోజే విశిష్ఠమైందని మార్వాడీ పెద్దలు ‘న్యూస్టుడే’కు తెలిపారు. కొత్తగా వృత్తి, వ్యాపారాలను ఈ రోజున ప్రారంభిస్తే అభివృద్ధి, విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. వేసవికాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు కొంతమంది చలివేంద్రాలు ప్రారంభిస్తారు. ఎండ నుంచి రక్షణకు ఉపయోగపడే పాదరక్షలు, గొడుగు, విసనకర్రలు, నీటితో ఉన్న కుండలను పేదలు, బ్రాహ్మణులకు దానాలుగా ఇస్తారు.
బంగారం,
వస్త్రాల కొనుగోళ్లు..
అక్షయ తృతీయ నాడు బంగారం, వస్త్రాలు కొనుగోలు చేస్తే ఎప్పటికీ కొంటూనే ఉంటామని నమ్మకం ఏడాదికేడాది ప్రజల్లో పెరుగుతోంది. ఈ క్రమంలోనే పలు వ్యాపార సంస్థలు పక్షం రోజుల ముందునుంచే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. మహిళలు ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా బంగారం కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఖమ్మం, కొత్తగూడెం నగరాలతోపాటు పలు పట్టణాల్లోని బంగారం దుకాణాల్లో సందడి నెలకొంది. గృహాల్లో లక్ష్మీపూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో నూతన వస్త్రాలు, బంగారం నివేదిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్