logo

ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర

లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు.

Updated : 10 May 2024 06:03 IST

కారేపల్లి: రోడ్‌షోలో పాల్గొన్న భాజపా అభ్యర్థి వినోద్‌రావు

కారేపల్లి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని, తాను రైతుబిడ్డననే అని గుర్తుచేశారు. ఇన్నాళ్లు ఇక్కడ గెలిచిన నాయకులకు చిత్తశుద్ధి లేకపోవటంతో ఏ రంగంలోనూ ఖమ్మం జిల్లా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. కాంగ్రెస్‌ నాయకులు తమ కుటుంబ, బంధువర్గాలకు పదవులు ఇప్పించుకోవటానికి ఆరాటపడతారే తప్ప ప్రజలకు మేలు చేయబోరని విమర్శించారు. కాకతీయ వంశస్థుడు, బస్తర్‌ మహారాజ్‌ కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌, శ్యాంరాథోడ్‌, నెల్లూరి కోటేశ్వరరావు, అరుణ, మండలాధ్యక్షుడు శ్రీను, తురక నారాయణ, అజ్మీర వీరన్న, కల్తి రాంప్రసాద్‌, సుజాత, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని