1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం.
ములకలపల్లి మండలం జగన్నాథపురంలో పనులను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రియాంక అల, అధికారులు
పాల్వంచ, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. ఏఏపీసీలు పూర్వ పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల స్థానాన్ని భర్తీ చేస్తాయి. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త కమిటీలకు ఇటీవల ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. ప్రతిపాదిత పనులను విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నతాధికారులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో ఆయా పనులు కొనసాగుతున్నాయి.
ఎంపిక చేసిన పాఠశాలల్లో..
తాగునీరు, విద్యుత్తు సదుపాయం, బాలికల మరుగుదొడ్ల నిర్మాణం, ఇతర మరమ్మతులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 753 పాఠశాలలను ఎంపికచేశారు. ఆయాచోట్ల చేసిన ప్రతిపాదనలకు రూ.21.18 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు జరిగిన పనులకు రూ.5.18 కోట్లు విడుదలయ్యాయి. సుమారు 448 పాఠశాలల్లో ఈనెల 13న జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్కు కేంద్రాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో 642 పాఠశాలల్లో అభివృద్ధి పనులకు రూ.20.30 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు రూ.5 కోట్లు ఖర్చుచేశారు. 249 పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. బూత్లు ఏర్పాటు చేసినచోట తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన వంటివి వెంటనే పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. మిగతా చోట్ల తరగతులు పునః ప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తిచేసేలా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, గుత్తేదారులు, కమిటీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండల స్థాయి నోడల్ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటే ‘మన ఊరు-మన బడి’ పనులు పూర్తిచేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకంలో భాగంగా ఎంపికైన బడుల్లో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలింగ్ బూత్లు ఉన్నచోట్ల యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుత్తు వసతులు కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. మన ఊరు-మన బడి పనులు కూడా పూర్తి చేశాం. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా మౌలిక వసతులు కల్పించేలా చూస్తాం.
వెంకటేశ్వరాచారి, డీఈఓ, భద్రాద్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్
[ 20-05-2024]
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
దోపిడీ, సామాజిక వివక్షపై ఉద్యమించాలి: తమ్మినేని
[ 20-05-2024]
సుందరయ్య స్ఫూర్తితో సామాజిక వివక్ష, దోపిడీ నిర్మూలనపై ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుజాతనగర్ సీపీఎం పార్టీ కార్యాలయం సత్యం భవన్లో సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. -
ఒక ఉపకేంద్రం 20 నియంత్రికల ధ్వంసం
[ 20-05-2024]
కొందరు దొంగలు సొత్తు కోసం వ్యవసాయ పొలాల్లోని విద్యుత్తు నియంత్రికలనూ వదలడం లదు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 20-05-2024]
ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందిన సంఘటనపై రఘునాథపాలెం పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. -
లాభాల లహరి
[ 20-05-2024]
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందిస్తూనే సంస్థ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ప్రైవేటుతో పోటీపడుతూ అధునాతన సదుపాయాలను తీసుకొస్తోంది. -
భూసార పరీక్షలు కొందరికే
[ 20-05-2024]
ఇష్టారీతి రసాయనిక ఎరువుల వినియోగంతో సాగు భూమి సారం కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. పంట భూమిలో నత్రజని, భాస్వరం, సేంద్రియ కర్బనాల్లాంటి పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షల ద్వారా తెలుసుకుని -
ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాల పెంపుపై దృష్టి
[ 20-05-2024]
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రవేశాల సంఖ్య పెంపుపై జిల్లా అధికారులు దృష్టిపెట్టారు. -
బతుకుజీవుడా..
[ 20-05-2024]
జాతీయ, రాష్ట్రీయ రహదారులపై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. ప్రధాన మార్గాల్లో రాత్రివేళల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో వేసవిలో రోడ్లపై కొనసాగుతున్న పశు సంచారం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. -
పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటా: మంత్రి పొంగులేటి
[ 20-05-2024]
ప్రతి పేదింటి కష్టసుఖాలను పంచుకుంటానని, అభివృద్ధిని చేతల్లో చూపుతానని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. -
కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం: శైలజ టీచర్
[ 20-05-2024]
దేశంలో కమ్యూనిస్టులతోనే సామాజిక న్యాయం సాధ్యమైందని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే శైలజ టీచర్ అన్నారు. -
మెలికలు తిరుగుతూ.. మెరికలుగా మారుతూ..
[ 20-05-2024]
జిమ్నాస్టిక్స్లో ప్రావీణ్యం సాధించాలంటే ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియానికి రావాల్సిందే. సాధన చేసే క్రీడాకారులపై ఆర్థిక భారం ఉండదు. సాధన కేంద్రమైన జిమ్నాజియం ఏర్పాటు రూ.కోట్ల ఖర్చుతో కూడుకున్నది. -
రాములోరికి పసిడి పుష్పార్చన
[ 20-05-2024]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మూలవిరాట్కు అర్చకులు సుప్రభాతం పలికి ఆరాధించారు. -
‘భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం’
[ 20-05-2024]
భాజపాతో ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఆరోపించారు. సీపీఐఎంఎల్ మాస్లైన్ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఆదివారం వైరాలోని అమరవీరుల నగర్లో నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల