వంద రోజుల పఠనం
పుస్తకం మస్తిష్క నేస్తం అన్నారు పెద్దలు. బడిలో పాఠాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం
ప్రణాళికతో విద్యాశాఖ ముందుకు
పుస్తకాన్ని చదివిస్తున్న ప్రధానోపాధ్యాయుడు
ఆత్మకూరు, న్యూస్టుడే: పుస్తకం మస్తిష్క నేస్తం అన్నారు పెద్దలు. బడిలో పాఠాలతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడంతో పాటు వారిలో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘వంద రోజుల పఠనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 2022 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
జిల్లాలో 4369 ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పరిధిలో 7.20 లక్షల మంది విద్యార్ధులు చదువుతున్నారు. 3549 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో దాదాపు 1.30 లక్షల మంది ప్రీ ప్రైమరీ విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో పుస్తక పఠనాన్ని ప్రారంభించారు.
ఉద్దేశమిది : అంగన్వాడీ కేంద్రాల నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్ద్థుల్లో చదివే సామర్థ్యాన్ని పెంచడం, విద్యార్ద్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జ్ఞానార్జనకు ఇతర పుస్తకాలపై మక్కువ పెంచడం, గ్రంథాలయాలకు వెళ్లేలా ప్రోత్సాహించడం చేస్తారు.
ప్రయోజనాలివి : సాంకేతిక ప్రపంచంలో విద్యార్థుల్లో చదవటం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. వీరిపై టీవీలు, చరవాణుల ప్రభావం అధికంగా ఉంది. వంద రోజుల పఠనంతో ఇవన్నీ దూరమవుతాయి.
2వ తరగతి వరకు సంఖ్యాశాస్త్రం, దీనికి సంబంధించిన భావనలు, ప్రాథమిక అవగాహన, సామార్థ్యాలు అభివృద్ధి అవుతాయి. ● 3వ తరగతిలో ప్రవేశించే సమయానికి విద్యార్ద్థులు అర్థవంతంగా చదవటం, రాయడంలో మెరుగవుతారు.● మెరుగైన మార్గంలో పఠనం వల్ల అక్షరాస్యత, సంఖ్య జ్ఞానాన్ని సాధించటానికి తరగతి గదిలో పటిష్ఠ పునాది పడుతుంది.
కొత్త విషయాలు తెలుస్తాయి
- చాంద్బాషా, ఎనిమిదో తరగతి,ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల
పుస్తకాలు చదవటం ద్వారా కొత్త విషయాలు తెలుస్తాయి. చదివేకొద్ది ఆసక్తి పెరుగుతోంది. బాగా చదివే విద్యార్థు.ల మధ్య మంచి వాతావరణంలో పోటీ ఉంటుంది. అక్షర పరిజ్ఞానం ఉంటే అన్నింటా రాణించవచ్ఛు
చరవాణులకు దూరంగా ఉండేలా అవగాహన
- రంగారెడ్డి, డీఈఓ
విద్యార్థుల్లో చదవటం అనే అంశంపై ఆసక్తి పెంచేందుకే వంద రోజుల ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. విద్యార్థులు కొందరు చదవటంలో వెనకబడ్డారు. వీరిని ప్రోత్సాహించి వెలుగులోకి తీసుకొస్తాం. చరవాణులకు దూరంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం. బడిలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. పుస్తక పఠనంపై వారం వారం బాధ్యులుగా ఉన్న ఉపాధ్యాయుడి పర్యవేక్షణ ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం