మత్స్య సంపదకు అలివి వల
కృష్ణానదిలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాలకు చెందిన కొందరు కోస్తా, బిహార్ ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించి నిషేధిత అలివి వలలతో వేట కొనసాగిస్తున్నారు.
కృష్ణానదిలో దందా
నిషేధిత వలలతో వేట
పడవలో తరలిస్తున్న అలివి వలలు
నందికొట్కూరు, కొత్తపల్లి, న్యూస్టుడే: కృష్ణానదిలో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాలకు చెందిన కొందరు కోస్తా, బిహార్ ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించి నిషేధిత అలివి వలలతో వేట కొనసాగిస్తున్నారు. చేప పిల్లలను ఎండు చేపలుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మత్స్య కార్మికుల పొట్టు కొడుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. మామూళ్లు తీసుకుని అక్రమ వేటకు సహకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
ఈ ఏడాది నెల రోజుల ముందునుంచే
నదిలో మత్స్య సంపదను పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చించి చేపల పిల్లలు విడుదల చేస్తోంది. అవి అర కిలో బరువు పెరిగిన తర్వాత తీర ప్రాంతంలో లైసెన్సు ఉన్న మత్స్య కార్మికులు పట్టుకోవడానికి అనుమతి ఉంది. కొందరు దళారులు విశాఖపట్నం, ఝార్ఖండ్ నుంచి కూలీలను తీసుకొచ్చి దందా చేస్తున్నారు. సిద్ధేశ్వరం, జానాలగూడెం, బలపాలతిప్ప సరిహద్దు ప్రాంతంలో కూలీలు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. ఏటా డిసెంబరు దందా కొనసాగేది.. ఈ ఏడాది నవంబరులో ప్రారంభించారు.
స్థానిక మత్స్యకారులపై దౌర్జన్యం
నియోజకవర్గంలోని నందికొట్కూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి, జూపాడుబంగ్లా మండలాల పరిధిలో సుమారు 1200 మత్స్యకారుల కుటుంబాలు కృష్ణానదిని నమ్మకుని జీవనం సాగిస్తున్నాయి. వారంతా అలివి వలలతో వేట వద్దని ఆందోళన వ్యక్తం చేస్తున్నా ఆయా మండలాల్లోని పెత్తందార్లు వారిపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. రాజకీయ నాయకుల అండతో వారి నోరు మూయించి అక్రమ దందా సాగిస్తున్నారు.
రాత్రి వేళ తరలింపు
చేపలు ఆరబెడుతున్న మత్స్యకారులు
అలివి వలలకు చిన్న పాటి రంధ్రాలు ఉండటంతో పిల్లలు వలలో పడతాయి. పిల్ల చేపలు ఎండబెట్టి రూ.80 కిలోల చొప్పున చెన్నై, తెలంగాణ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. కాస్త పెద్దగా ఉన్న వాటిని కిలో (హోల్సేల్) రూ.60 నుంచి రూ.65 అమ్మేస్తున్నారు. ప్రత్యేక వాహనాల్లో విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళ అక్రమ రవాణా చేస్తే ఎవరూ అడ్డుకోవద్దన్న ఉద్దేశంతో పోలీసులకూ డబ్బులు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
చనిపోతున్నారా.. చంపేస్తున్నారా?
మృతి చెందిన జొన్నకూటి శ్రీను (38)
నందికొట్కూరు, న్యూస్టుడే : నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు ఠాణా పరిధిలోని జంగంపాడు సమీపంలో కృష్ణానదిలో సోమవారం మృతదేహం బయటపడింది. చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వలకు అది తలగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బయటకు తీయించారు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నానికి చెందిన జొన్నకూటి శ్రీను (38)గా గుర్తించారు. అలివి వలతో చేపలు పట్టేందుకు స్థానిక వ్యాపారులు అతడిని ఇక్కడికి రప్పించినట్లు తెలుస్తోంది. వారం రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. గోదావరి జిల్లాల నుంచి ఒక్కో వ్యక్తికి రూ.లక్ష వరకు అడ్వాన్సు చెల్లించి పలువురిని ఇక్కడికి తీసుకొచ్చారు. వారంతా వ్యాపారుల కనుసన్నల్లో నిషేధిత అలివి వలలతో చేపల వేట సాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శాతనకోట వద్ద ఉంటున్న ముగ్గురు జాలర్లు అదృశ్యమయ్యారు. వారు స్వగ్రామానికి వెళ్తామని వ్యాపారి వద్ద మొరపెట్టుకున్నా ఆయన స్పందించలేదని.. అంతలోనే ఒకరు నదిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తోంది. మిగిలిన ఇద్దరు ఎక్కడ ఉన్నారో తేలాల్సి ఉంది. వేటకు నిరాకరించినందుకు చంపి నదిలో పడేశారా? లేక ఆయనే మునిగి చనిపోయాడా అన్నది తేలాల్సి ఉంది. ఇటీవల జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద, కొత్తపల్లి మండలం జానాలగూడెం వద్ద లభ్యమైన మృతదేహాలు కూడా జాలర్లవే కావడం కలకలం రేపుతోంది. కృష్ణానదిలో లభ్యమైన మృతదేహాల మిస్టరీని పోలీసులు ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్ల ‘దారి’ద్ర్యం
[ 27-04-2024]
జగన్ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది. గత జూన్ నుంచి డిసెంబరు వరకు కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీస్తున్నాయి.. -
సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన
[ 27-04-2024]
రాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సుశ్శమీంద్ర తీర్థుల మధ్యారాధన సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం స్వామివారి బృందావనానికి నిర్మాల్యం, పంచామృతాభిషేకం నిర్వహించి అలంకరించారు. -
28, 29 తేదీల్లో చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో ఈనెల 28, 29 తేదీల్లో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్ తెలిపారు. -
అనుమానాలున్నా ఆమోదముద్ర
[ 27-04-2024]
అభ్యర్థుల నామపత్రాల పరిశీలనలో ‘అధికార’ పెత్తనం కొనసాగింది. అధికార పార్టీ నేతలకు చెందిన నామపత్రాలపై పలు అనుమానాలున్నా అధికారులు ఆమోదముద్ర వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఇంతులు ఎటో గెలుపు అటే
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య తేలింది. ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పురుష ఓటర్లు 10,13,771, మహిళలు 10,40,435, ఇతరులు 318 కలిపి 20,54,524 మంది ఓటర్లు ఉన్నారు. -
అరాచక పాలన అంతమే లక్ష్యం
[ 27-04-2024]
జగన్ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. నగరంలోని తెదేపా కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ చింతా సురేష్ బాబు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎంపీ డా.సంజీవ్కుమార్, కర్నూలు పార్లమెంట్ తెదేపా ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్తో కలిసి ఎన్డీఏ ఛార్జిషీటును తిక్కారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. -
నామినేషన్ల పరిశీలన పూర్తి
[ 27-04-2024]
కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ స్థానానికి సంబంధించి 20 నామినేషన్లను ఆమోదించారు. -
నేతలకు కాసుల పంట.. రైతులకు కడుపు మంట
[ 27-04-2024]
‘‘వ్యవసాయ పంటల మార్కెటింగ్లో కీలకపాత్ర వహించే ఏఎంసీలు (వ్యవసాయ మార్కెట్ యార్డులు) జగన్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. అన్నదాతలకు కనీస సేవలందించలేదు. తెదేపా హయాంలో కళకళలాడిన ఏఎంసీలు ప్రస్తుతం శాఖాపరమైన కార్యకలాపాలతో సరిపెట్టుకుంటున్నాయి. -
రక్షక భటులను దగా చేసిన జగన్
[ 27-04-2024]
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు మొత్తం చెల్లిస్తాం. వారంతపు సెలవు అమలు చేస్తాం. వారికి అండగా ఉంటాం. -
ఇసుకాసురుల దారిదోపిడీ
[ 27-04-2024]
అధికార పార్టీ నేతల అండదండలతో ఇసుకను తోడేస్తున్నారు. వందల మెట్రిక్ టన్నుల లోడుతో లారీలను తిప్పుతుండటంతో.. రహదారులు రూపుకోల్పోతున్నాయి. తారు చెదిరి.. వాహనదారులను బెదిరిస్తున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో ప్రతిభ
[ 27-04-2024]
జేఈఈ మెయిన్స్లో శ్రీచైతన్య కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించారని కళాశాల ఏజీఎం మురళీకృష్ణ, డీన్లు సరళ, బాలాజీ శుక్రవారం తెలిపారు. -
ఓ ప్రజాప్రతినిధి.. ఇదీ దారుల దుస్థితి
[ 27-04-2024]
ఆ దారులు నరకానికి నకళ్లు.. ప్రయాణం సాగించాలంటే సాహసమే.. రాళ్ల దారిలో వెళ్లాలంటే ఒళ్లు హూనమే.. కిందపడితే రక్తధారలే.. తరుచూ ప్రమాదాలతో భయపెడుతున్నాయి. ఐదేళ్లు నిధుల మాటే లేదు. ప్రజాప్రతినిధులు భూమి పూజలతో సరిపెడుతున్నారే తప్ప.. పనులు మాత్రం ముందుకు సాగటం లేదు. -
ఆలస్యమైతే.. బుగ్గిపాలే
[ 27-04-2024]
ఎండ తీవ్రత, గ్యాస్ లీకేజీలతో అగ్ని ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో ప్రమాదాలు జరిగితే నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి అగ్నిమాపక వాహనం రావాల్సిందే. -
జగనొచ్చారు.. పరిశోధన ప్రాణం తీశారు
[ 27-04-2024]
రాష్ట్రంలో వ్యవసాయ విధానాలు మార్చబోతున్నాం.. తన హయాంలోనే రైతులకు ఎనలేని మేలు జరుగుతున్నట్లు పదేపదే చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతులకు అత్యంత ఉపయుక్తమైన వ్యవసాయ పరిశోధనలపై ఉక్కుపాదం మోపారు. -
ఎత్తిపోతలను ఎండబెట్టిన కాటసాని
[ 27-04-2024]
జుర్రేరు వాగుపై 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హయాంలో దద్దణాల చెరువును నిర్మించారు. వర్షాకాలంలో ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షానికి వరద వచ్చి చెరువులో చేరుతోంది. -
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి
[ 27-04-2024]
తెదేపాను గెలిపిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. మండలంలోని సాంబవరంలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.