logo

అక్రమ కేసులపై జనసేన ఆందోళన

చిందేపల్లిలో జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఆదోనిలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గురువారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

Published : 31 Mar 2023 02:12 IST

ఆదోనిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న జనసేన నాయకులు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: చిందేపల్లిలో జనసేన నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఆదోనిలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట గురువారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జనసేన నాయకులు తాహెర్‌వలి, రేణువర్మ, మహేష్‌, పులిరాజ, రాజశేఖర్‌ మాట్లాడారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం చిందేపల్లిలో జనసేన నాయకులు చేపట్టిన దీక్షలను భగ్నం చేసి, అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీక్షలు చేస్తున్న వారి సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వకుండా, దర్మార్గంగా వ్యవరించడం దారుణమన్నారు. వైకాపా ప్రభుత్వం ప్రైవేట్‌ కంపెనీకి మద్దతు పలకడం సిగ్గుచేటన్నారు. రహదారి సమస్య పరిష్కరించాలని డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని