అతివలకు సాయం.. అంతంతమాత్రం
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది.
ఉనికి కోల్పోతున్న మహిళా సంఘాలు
ఖాతాలకు చేరని సొమ్ము
గతంలో ఓ వెలుగు వెలిగిన పొదుపు సంఘాలు, గ్రామైక్య సంఘాలు ప్రస్తుత వైకాపా పాలనలో నిర్వీర్యమవుతున్నాయి. వైకాపా ప్రభుత్వం చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన లేకుండా పోతోంది. డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయటంతో పాటు వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు కావటంలేదనేది బహిరంగ రహస్యమే. సున్నా వడ్డీకే రుణాలు అనే మాట అసలే అమలుకు నోచుకోవడం లేదు.
ఇదీ పరిస్థితి..
పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ ఖాతాలో జమైనట్లు జాబితాలో ఉన్నా.. ఆ మొత్తం అందడం లేదు. పత్తికొండలోని పొదుపు సంఘానికి రూ.16,059 సున్నావడ్డీ జమైనట్లు చూపుతున్నా.. ఒక్క పైసా కూడా జమకాలేదు. మరో గూపునకు సంబంధించి రూ.12,500 చూపుతున్నా.. పొదుపు ఖాతాలో జమకాలేదు. ఓ గ్రూపునకు సంబంధించిన మహిళలు గతంలో రూ.8లక్షలు రుణం తీసుకుంటే రూ.28వేలు సున్నా వడ్డీ జమైంది. ఆ తర్వాత రూ.10లక్షలు రుణం తీసుకున్న అదే సంఘానికి రూ.10వేలు మాత్రం జమైందని సభ్యులు తెలిపారు.
పశ్చిమాన పచ్చి అబద్ధం
పశ్చిమ ప్రాంతంలో ప్రజలు ఏటా వలసబాట పడుతున్నారు. వలసల నివారణకు సీఎం ప్రత్యేక చొరవతో ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(ఆడా)ని ఏర్పాటు చేశారు. మహిళల జీవనోపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినా అమలుకాలేదు... ఉపాధి లేక మహిళలు వలసబాట పట్టక తప్పడం లేదు.
లక్ష్యం: ఆడా కింద 19 మండలాల్లో 10,159 మంది మహిళల జీవనోపాధుల అభివృద్ధికి రూ.60.49 కోట్లు ఖర్చు చేయాలి.
అమలు: మహిళల జీవనోపాధుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళిక కార్యరూపం దాల్చలేదు.
చేయూతకు ఎదురు చూస్తున్నా
- మీసాల మంగమ్మ, దేగలహాలు (చిప్పగిరి)
చిప్పగిరి, న్యూస్టుడే: చేయూత పథకం సరిగా అందడం లేదు. మూడు విడతలుగా ఏడాదికి రూ.18,750 వచ్చింది. నాలుగో విడత నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. గ్రామ సచివాలయంలో అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. మా గ్రామంలో 45 ఏళ్లు దాటిన చాలా మందికి చేయూత డబ్బు రాలేదు. ప్రభుత్వం ఎన్నికల పేరుతో రూ.18,750 ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఇది మహిళలను నమ్మించి మోసం చేయడమే. ఉత్తుత్తి బటన్ నొక్కి ఎందుకు మోసం చేయాలి. రాష్ట్ర ఖజానలో డబ్బులు లేవు. మహిళలకు చివరి విడతకు అప్పులు దొరకలేదని చెబితే.. బ్యాంకుల చూట్టు తిరిగే బాధలు తప్పేవి.
అర్హత ఉన్నా.. రాలేదు
- ఆదిలక్ష్మి, తుగ్గలి
తుగ్గలి, న్యూస్టుడే: వైఎస్ఆర్ చేయూత సొమ్ము రాలేదు. పథకానికి సచివాలయంలో దరఖాస్తుతో పాటు అన్ని పత్రాలు అందజేశా. ఐదేళ్ల వైకాపా పాలనలో చేయూత సొమ్ము నేటికీ తీసుకోలేదు. పొదుపు సంఘాలకు ఇచ్చే వైఎస్ఆర్ ఆసరా సొమ్ము సీఎం బటన్ నొక్కిన తరువాత పొదుపు ఖాతాలకు వెంటనే జమ కావడం లేదు ఆలస్యం అవుతోంది. సొమ్ము ఎప్పుడు పడుతుందా అని బ్యాంకుల చుట్టూ మహిళలు, పొదుపు సంఘాల సభ్యులు తిరుగుతున్నాం.
అసలే జమకాలేదు
- మల్లమ్మ, అరేకల్, (ఆదోని)
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: చేయూత డబ్బులు పడలేదు. 40 రోజుల కిందట డబ్బులు వస్తాయన్నారు. ఇప్పటి వరకు రాలేదు. ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి బటన్ నొక్కినా.. చాలా మందికి అందని పరిస్థితి. క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు అర్హులకు అందడం లేదు. ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు ఇచ్చారు, స్థలం చూపించలేదు. పలుసార్లు విన్నవించినా స్పందించడం లేదు. ప్రజాప్రతినిధులకు సైతం సమస్య వివరించాం.. పరిష్కారం మాత్రం లభించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే గ్రామాల అభివృద్ధి
[ 01-05-2024]
గ్రామాలు అభివృద్ధి తెదేపా తోనే సాధ్యమని తెదేపా మండల నాయకులు కృష్ణ యాదవ్, వెంకటేశ్వర్లు, నౌనే పాటి చౌదరి, ఎంపీటీసీలు నరసన్న, రహింతుల్లాలు అన్నారు. -
పోలీస్ స్టేషన్లో రూ.5.6లక్షలు కాజేసిన హోంగార్డు
[ 01-05-2024]
ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన పోలీసు హోంగార్డు తాను పనిచేస్తోన్న పోలీస్స్టేషన్లోనే రూ.5.6లక్షలు కాజేశాడు. -
తెదేపాలో చేరికలు
[ 01-05-2024]
కోసిగి మండలం జంపాపురం గ్రామానికి చెందిన వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. -
తెదేపా విజయానికి కలిసికట్టుగా పని చేయాలి
[ 01-05-2024]
ఆలూరు నియోజకవర్గంలో తెదేపా పార్టీ విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేయాలని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
ఎన్నికల అధికారులకు శిక్షణ తరగతులు
[ 01-05-2024]
ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సిల్వర్ జూబ్లీ హాల్ నందు ఆదోని-146 నియోజకవర్గానికి సంబంధించిన పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. -
వైభవంగా బంగారమ్మ ఉత్సవాలు
[ 01-05-2024]
దౌల్తాపురం గ్రామంలో బంగారమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉదయాన్నే బంగారమ్మ అమ్మవారిని పూలతో అందంగా అలంకరించారు. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 01-05-2024]
తెదేపాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. -
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి
[ 01-05-2024]
సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ. శ్యాంబాబు అన్నారు. -
సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
గోనెగండ్ల లో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో, హమాలీ పంచాయతీ, కేవీసీఎస్ కార్మికులు మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
రైతాంగాన్ని ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలం
[ 01-05-2024]
తీవ్ర వర్షాభావం కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మిగనూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. -
మంత్రాలయంలో తెదేపా ఎన్నికల ప్రచారం
[ 01-05-2024]
మంత్రాలయంలోని ఓల్డ్టౌన్లో ఉమ్మడి తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.రాఘవేంద్ర రెడ్డి సోదరుడు ఎన్.రఘునాథ్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మా నాన్నను గెలిపించండి..
[ 01-05-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి బుడ్డా రాజశేఖర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఆయన కుమార్తె బుడ్డా మేఘనారెడ్డి కోరారు. -
పింఛను‘దారి’ల కన్నీటి ప్రయాణం
[ 01-05-2024]
గ్రామీణ ప్రాంతాల్లో 1.40 లక్షల మంది పింఛనుదారులు ఉండగా తొంభై వేల మంది మండల కేంద్రం/ పట్టణానికి వెళ్లాల్సిందే. -
విజయోత్సవ ర్యాలీకి వస్తా
[ 01-05-2024]
సాధారణ ఎన్నికల అనంతరం నందికొట్కూరుకు మళ్లీ వస్తానని, విజయోత్సవ ర్యాలీ చేసుకుందామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. -
ప్రయాణ ప్రాంగణం పాలకుల నిర్లక్ష్యం
[ 01-05-2024]
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక.. ప్రజారవాణా సంస్థగా పేరు మార్చారు. ప్రయాణ ప్రాంగణాల్లో సమస్యలు తిష్టవేశాయి. తాగేందుకు నీరు లేదు.. ఫ్యానులు తిరగవు.. మరుగుదొడ్లు మూసివేసి ఉంటున్నాయి -
జగన్ జమానాలో ‘కూలి’న బతుకులు
[ 01-05-2024]
ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంది.. జగన్ మాత్రం వారిపై కక్ష కట్టారు.. ఇసుక కొరత తీసుకొచ్చారు.. నిర్మాణ రంగం నిలిచిపోయింది.. -
అంకితభావంతో పనిచేయండి
[ 01-05-2024]
‘‘పార్టీ విజయానికి అంకితభావంతో పనిచేసేవారిని గుర్తించి అందలం ఎక్కిస్తాం. ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రాగానే పార్టీకి సేవలందించినవారికి సముచిత స్థానం ఇస్తాం’’ అని తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. -
అన్నదాత ఆకలి తీరేనా!
[ 01-05-2024]
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు రాయితీ భోజనంలో సర్కస్ ఫీట్లు తప్పడం లేదు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రాయితీ భోజనం పెట్టాలనే సంకల్పంతో గత తెదేపా ప్రభుత్వం ఇస్కాన్ సహకారంతో మార్కెట్ యార్డుల్లో భోజన సేవలు అందుబాటులోకి తెచ్చింది. -
ఊరికి దూరం.. అసౌకర్యాల భారం
[ 01-05-2024]
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో ఉన్న రైల్వేస్టేషన్లలో సౌకర్యాలు కరవయ్యాయి. -
తెదేపా జెండా ఎగరేద్దాం
[ 01-05-2024]
ఆదోని పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి ఎన్డీయే పార్టీల నాయకులతో నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు -
పర్యాటకం.. జగన్నాటకం
[ 01-05-2024]
నల్లమల్ల.. ఎర్రమల్ల కొండల ప్రాంతం.. నిత్యం శివనామస్మరణ.. నెమలి హొయలు పలికే ‘జల’తరంగాలు.. ఆదిమానవుడు నడిచిన నేల.. పర్యాటక పరంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వ తీరుతో నిస్తేజంగా మారింది. -
కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయండి
[ 01-05-2024]
తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం సమష్టిగా కృషిచేయాలని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి కోరారు. -
దద్దణాలను ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని: బీసీ
[ 01-05-2024]
దద్దణాల చెరువును ఎండబెట్టిన అసమర్థ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అని బనగానపల్లి తెదేపా నేత బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్తో ఇంగ్లీష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
-
నీ డెబ్యూ నాటికి నేనింకా చెడ్డీలతోనే ఉండుంటా: మిశ్రాతో రోహిత్
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’