నగరడోణ.. కల తీరేనా
పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం.
ఐదేళ్లుగా నిధుల మాటే లేదు
రైతులకు సాగునీరు అందేనా?
ప్రాజెక్టు కోసం చేపట్టిన కరకట్ట నిర్మాణం
ఆలూరు గ్రామీణ, చిప్పగిరి, న్యూస్టుడే: పశ్చిమ ప్రాంతం కరువును పారదోలేందుకు నగరడోణ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, ఆలూరు, హాలహర్వి మండలాల్లో సాగునీరు అందించటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టు ద్వారా 0.104 టీఎంసీ సామర్థ్యంతో జలాశయం నిర్మించ తలపెట్టారు. చేసిన పనులకు కూడా నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారు పనులు నిలిపేశారు.
తండ్రి చేపట్టినా.. తనయుడు మొండిచేయి
నిర్దేశించిన స్థలంలో పెరిగిన ముళ్లకంప
నగరడోణ జలాశయం పరిధిలో ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు, హాలహర్వి, చిప్పగిరి మండలాల్లోని 4,632 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని భావించారు. 2008 అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.11.58 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి, పనులు దక్కించుకున్న గుత్తేదారు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం 2021లో రూ.53.82 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించింది. కరకట్ట 2.752 కి.మీ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందులో 40 శాతం పనులు మాత్రమే జరిగాయి. చేసిన పనులకు సైతం బిల్లులు చెల్లించక పోవడంతో పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.
చెదురుతున్న కరకట్ట
పనులు చేసినా.. నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు కరకట్ట పనులు నిలిపేశారు. దీంతో వర్షా కాలంలో కురిసిన వర్షాలకు కరకట్టపై నుంచి నీరుపారి కోతలకు గురవుతుంది. కట్టపై పిచ్చిమొక్కలు సైతం మొలిచాయి. ఇది ఇలాగే కొనసాగితే పనులు పూర్తయ్యే నాటికి కట్ట మరింత బలహీనమయ్యే ప్రమాదం లేకపోలేదు.
పెరిగిన నిర్మాణ వ్యయం
ప్రాజెక్టు నిర్మాణం 2008లో రూ.11.58 కోట్లతో చేపట్టేందుకు శ్రీకారం చుట్టగా.. దీనిపై పెద్దగా దృష్టిసారించకపోవడంతో అదికాస్త వెనుకబడి పోయింది. 2009లో తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత మరికొంత ప్రాజెక్టు వ్యయం పెంచారు. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించారు. 2021లో ప్రాజెక్టు వ్యయం ఐదు రెట్లు పెంచి రీ టెండర్ పిలిచారు. ఆ సమయంలో మంత్రి, ఆదోని ఎమ్మెల్యే మరోసారి ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత కలలకు రెక్కలు తొడుగుతాం
[ 04-05-2024]
ఈసారి ఎన్నికల్లో 40 లక్షల మంది తొలిసారి ఓటేయబోతున్నారు.. ‘యువ’ తీర్పుతోనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. కూటమి అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి.. -
పార్కు స్థలాల్లో నేతల పాగా
[ 04-05-2024]
వారంతా నాలుగో తరగతి ఉద్యోగులు. సొంతిళ్లు నిర్మించుకోవాలని కలలుగన్నారు.. జట్టు కట్టారు.. పైసా పైసా పొదుపు చేసి స్థలం కొనుగోలు చేశారు.. -
పొలం గట్టున జగన్ కనికట్టు
[ 04-05-2024]
అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు.. విత్తు నుంచి మొదలు విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. గద్దెనెక్కారు.. ‘ కర్షక’ పథకాలకు కోత పెట్టారు.. -
జగనాసుర ‘చట్టం’
[ 04-05-2024]
ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం-2023పై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చట్టంపై న్యాయవాదులు సుదీర్ఘకాలం పోరాటం చేసి హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చినా రాష్ట్రప్రభుత్వం -
తాగునీరందిస్తేనే ఓటేస్తాం.. లేదంటే వేయం
[ 04-05-2024]
మాకు తాగునీరందిస్తేనే ఓటేస్తాం..లేదంటే వేయమని పెద్దకడబూరు మండలం జాలవాడి గ్రామస్థులు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరుడి కుమారుడు ప్రదీప్రెడ్డిని నిలదీశారు. -
కుళాయిలు కావాలని వైకాపా నాయకుడి నిలదీత
[ 04-05-2024]
మా కాలనీకి తాగునీటి కుళాయిలు కావాలని ప్రచారానికి వచ్చిన వైకాపా మండల ఇన్ఛార్జి మురళీమోహన్రెడ్డి, ఎంపీపీ ఈరన్న, నాడిగేని నాగరాజులను మహిళలు నిలదీశారు. -
మల్లన్న సాక్షిగా ఉత్తుత్తి శంకుస్థాపనలు
[ 04-05-2024]
శ్రీశైలంలో శాశ్వత అభివృద్ధి పనులకు వైకాపా తన అయిదేళ్ల పాలనలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. రివర్స్ పాలన చేస్తున్న నేపథ్యంలో భక్తులకు కష్టాల్నే మిగిల్చింది. -
జగన్ జమానా.. దక్కని న్యాయం.. ఆగని దుఃఖం
[ 04-05-2024]
శ్రీశైలం జలాశయం నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారు. -
సూపర్ సేవలకు ‘ప్రైవేటు’కు రండి
[ 04-05-2024]
సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తామంటూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఏకంగా ప్రచార పత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
పొంగుతున్న గోవా మద్యం
[ 04-05-2024]
ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ, కర్ణాటకతోపాటు సదూరంలో ఉన్న గోవా నుంచి సైతం జిల్లాకు మద్యం భారీగా రవాణా జరుగుతోంది. -
విధుల నుంచి 45 మంది తొలగింపు
[ 04-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 63 మందిపై చర్యలు తీసుకోగా..
తాజా వార్తలు (Latest News)
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం