logo

ప్రజల నమ్మకంతోనే గెలిచా: బుగ్గన

కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

Published : 23 Apr 2024 04:09 IST

ఆర్వో మహేశ్వరరెడ్డికి నామినేషన్‌పత్రాలు అందిస్తున్న వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

డోన్‌, డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: కార్యకర్తల త్యాగం.. ప్రజల నమ్మకం వల్లే రెండు సార్లు గెలిచా.. వారిపై నమ్మకంతోనే మూడోసారి బరిలో నిలిచానని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. నామినేషన్‌ వేసేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు నంద్యాల ఎంపీ పోచా  బ్రహ్మానందరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి తారకరామానగర్‌, ఇందిరానగర్‌, పాతబస్టాండు వరకు  ర్యాలీతో వచ్చారు.  స్థానిక ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన అప్పటికే సిద్ధం చేసుకున్న నామినేషన్‌పత్రాలను ఆర్వో మహేశ్వరరెడ్డికి అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని