‘చేదోడు’.. జగన్ చెడుగుడు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు.
ఇచ్చినట్లే ఇచ్చి అనర్హత వేటు
ఇష్టారాజ్యంగా లబ్ధిదారుల ఎంపిక
నమ్మించారు
‘‘ పాదయాత్ర పేరిట ఊరూరా తిరిగారు.. బీసీలను బాగు చేస్తానని ప్రగల్భాలు పలికారు.. వెన్నెముక వర్గాలని నమ్మించారు... వెనుకబడిన 21-60 ఏళ్ల వయసున్న వారు ఆర్థికంగా ఎదిగేందుకు ‘చేదోడు’ పథకాన్ని తీసుకొస్తామని జగన్ హామీలు కురిపించారు. ’’
వంచించారు
గద్దెనెక్కిన జగన్.. అధికారం చేపట్టగానే తొలి దెబ్బ వేశారు. బీసీ ఎదుగుదలకు అత్యంత కీలకమైన కార్పొరేషన్లను ఛిద్రం చేశారు. వృత్తిదారులను కుంగదీశారు. స్వయం ఉపాధి మాటే మరిచారు.. రాయితీ రుణాలకు పాతరేశారు. ఐదేళ్లుగా బీసీలను అడుగడుగునా వంచిస్తున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉంటారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వారిని వెన్నువిరిచారు. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న బీసీ కార్పొరేషన్, బీసీ కులాల కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చేశారు. బీసీలు శాశ్వతంగా పేదరికం నుంచి బయటపడేసేందుకు రాయితీ రుణాలు ఇతోధికంగా సాయపడేవి. గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా... స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలిచ్చి, వారికి దన్నుగా నిలిచేది. వీటిని వినియోగించుకుని వేల బీసీ కుటుంబాలు ఆర్థికాభివృద్ధిని సాధించి పేదరికాన్ని జయించాయి. ఆర్థిక సాయంపై జగన్ దెబ్బ కొట్టారు. అండ లేకుండా చేశారు.
న్యూస్టుడే, కర్నూలు సంక్షేమం
సగానికి సగం టోకరా
ఉమ్మడి జిల్లాలో 80 శాతం పేదలు నాయీబ్రాహ్మణులు, రజక కులాల్లో ఉన్నారు. కర్నూలులో జిల్లాలో 13,979 మంది రజకులకు, 9,878 మంది నాయీ బ్రాహ్మణులకే ఆర్థికసాయం అందజేశారు. నంద్యాలలో 24,999 మంది రజకులు, 11,661 మంది నాయీబ్రాహ్మణులకే పథకం కింద లబ్ధి పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది మహిళలకు దర్జీపని కుటీర పరిశ్రమగా ఉంది. వారెవ్వరికీ ఈ పథకం వర్తించలేదు. కర్నూలు జిల్లాలో 25,957 మంది, నంద్యాల జిల్లాలో 15,008 మంది మాత్రమే ఈ పథకం కింద ప్రయోజనం పొందారు. దుకాణాలు లేవనే కారణంతో వేలాది దరఖాస్తులను పథకం ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. టైలరింగ్ వృత్తి పేరుతో దరఖాస్తులు తీసుకుని దుకాణాలు లేవనే పేరుతో తిరస్కరించడంపై ఆ వర్గం ప్రభుత్వంపై గుర్రుగా ఉంది.
నిధులు లేని పదవులు మాకెందుకు
జిల్లా నుంచి వాల్మీకి, కుర్ణి, వీరశైవ, బెస్త కులాలకు ఛైర్మన్ పదవులు దక్కగా..వివిధ బీసీ కులాల నుంచి సమారు 30 మందికి డైరెక్టర్ పోస్టులు దక్కాయి. వీరు తమ కులాలకు సంబంధించిన పేద వర్గాలకు రుణాలు ఇప్పించుకోలేని పరిస్థితి. నిధులు లేని పదవులు మాకెందుకంటూ పలువురు ఛైర్మన్లు, డైరెక్టర్లు పేర్కొనడం గమనార్హం.
ఏటేటా తగ్గించి.. నిధులు మిగుల్చుకొని
‘జగనన్న చేదోడు’ పథకాన్ని 2020లో ప్రారంభించారు. ఏటా రూ.10 వేల సాయం చేస్తామని చెప్పిన జగన్ ఆ తర్వాత సంవత్సరానికి 2021లో ఎలాంటి సాయాన్ని అందించలేదు. ఇదే సమయంలో ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చిన జగన్.. 2019 నుంచి 2024 వరకు కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇచ్చారు. ఒక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.41,39,40,000లను ఇవ్వకుండా ప్రభుత్వం వంచించింది.
- తొలి ఏడాది కర్నూలులో 12,191 మంది, నంద్యాలలో 24,540 మందిని పథకానికి ఎంపిక చేశారు. 2021లో సాయం అందించకపోగా 2022లో లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. కర్నూలులో 11,222, నంద్యాలలో 22,701 మందిని తగ్గించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో ఏడాది 2,800 మందిని తప్పించి రూ.2.80 కోట్లను ప్రభుత్వం మిగిల్చింది.
అండగా నిలిచిన తెదేపా
తెదేపా ప్రభుత్వ హయంలో బీసీల కోసం 2014-19 మధ్య ఆదరణ పథకం అమలు చేశారు. బీసీ ఉప కులాల కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని తెచ్చారు. కులవృత్తిని బట్టి వారికి పరికరాలను అందజేశారు. స్వయంఉపాధిలో భాగంగా వడ్డెరలకు పలుగు, పార, చేపలు పట్టే వారికి వలలు, యాదవులకు ప్లాస్టిక్ పాల డ్రమ్ములు, నాయీబ్రాహ్మణులకు సెలూన్ పరికరాలు ఇలా వృత్తుల ఆదారంగా పంపిణీ చేశారు. దీంతో ఆయా వర్గాల వారు స్వయంఉపాధితో ముందడుగు వేసి కుటుంబాలను పోషించుకున్నారు. రూ.వేలల్లో వ్యయం చేసే పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని రద్దు చేసి కేవలం రెండు కులాలకు మాత్రమే చేదోడు పథకాన్ని అమలు చేసి ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకొంది. ఆర్థిక సంవత్సరం ఈ మొత్తం కూడా ఇవ్వలేదు. లబ్ధిదారులను కుదిస్తూ పథకాన్ని కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందరికీ అన్నారు.. కొందరికే పరిమితం
‘జగనన్న చేదోడు’ పథకాన్ని 2020లో ప్రారంభించారు. రజకులు, నాయీబ్రాహ్మణులు, కుట్టు వృత్తిదారులకు ‘జగనన్న చేదోడు’ తెచ్చారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున నాలుగేళ్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దుకాణాలు పెట్టుకుని కులవృత్తి చేస్తున్న రజకులు, నాయీబ్రాహ్మణులకే ఆర్థికసాయం వర్తింపజేశారు. దర్జీ వృత్తి చేసుకుంటున్న అన్ని కులాల వారికి ఈ పథకాన్ని వర్తింపజేసి బీసీల్లోని బెస్త, ఈడిగ, గౌడ, వడ్డెర, యాదవలను తప్పించారు. దీంతో బీసీల్లోని 113 కులాల్లో కేవలం రెండింటికే పథకం ద్వారా ప్రయోజనం కలిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3.5 లక్షల బీసీ కుటుంబాలు ఉండగా కేవలం రెండు కులాల వారికే పరిమితం చేయడంతో సుమారు రూ.2 లక్షల కుటుంబాలు పథకాన్ని అందుకోలేకపోయాయి.
జల్లెడ పట్టి.. కోత పెట్టారు
కొత్తగా 2020లో పథకం అమలు చేసినప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నాయీబ్రాహ్మణులు, రజకులు, దర్జీలు దరఖాస్తులు చేసుకున్నారు. ఒక ఏడాది సాయం అందితే ఐదేళ్ల వరకు ఇబ్బంది ఉండదని అనుకున్నారు. కానీ రెండో విడతలోనే చాలా మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. విద్యుత్తు బిల్లు 200 యూనిట్లు దాటిందని, నాలుగు చక్రాల వాహనం ఉందని, వార్షిక ఆదాయం పెరిగిందని లబ్ధిదారుల జాబితాను కుదించారు. ఇదే సమయంలో లబ్ధిదారుల పేరు మీదనే దుకాణాలు ఉండాలనే కొత్త నిబంధనను రెండో విడత నుంచే తెచ్చారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నాయీబ్రాహ్మణులు, రజకుల దుకాణాలు ఇతరుల పేర్ల మీద ఉండటంతో చాలా మంది పథకానికి దూరమయ్యారు. చాలా మంది దుకాణాలకు డోర్ నంబర్లు లేకపోవడంతో అర్హుల జాబితాలో లేకుండా పోయారు. ఇదే సమయంలో ఇతరుల దుకాణాలను అద్దెకు తీసుకుని నడుపుతున్న చాలామందికి కూడా ప్రభుత్వ సాయం అందలేదు. మరో వైపు ఉమ్మడి జిల్లాలోని 930 గ్రామ పంచాయతీల్లో క్షౌర వృత్తికి సంబంధించి ప్రత్యేకంగా దుకాణాలు అంటూ ఉండవు. ఇదే సమయంలో రజకులు, దర్జీలకు కూడా గ్రామాల్లో ప్రత్యేకంగా దుకాణాలు అంటూ ఉండవు. దుకాణాలు లేవనే పేరుతో చాలా మంది గ్రామీణులను అర్హుల జాబితా నుంచి తొలగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఐసీయూలో ఆరోగ్యశ్రీ
[ 03-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు తిప్పలు తప్పడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన సొమ్ము గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. -
జగన్ కుట్ర ఎండలో పండుటాకుల విలవిల
[ 03-05-2024]
నడవలేనివారు.. మంచానికే పరిమితమైనవారు.. దివ్యాంగులకు ఇంటివద్ద సొమ్ము పంపిణీ చేయాలని ఆదేశాలున్నా సుమారు 50 శాతం సచివాలయ సిబ్బంది గ్రామ, వార్డు సచివాలయాల్లో కూర్చొని పంపిణీ చేయడం గమనార్హం. -
ఉమ్మడి జిల్లా ఓటర్లు 34,48,38211
[ 03-05-2024]
ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. అందులో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576 మంది ఉన్నారు. -
విపణి వేదికపై విఫల పాలన
[ 03-05-2024]
అన్నదాతకు అండగా నిలిచి వారికి.. వారికి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేశారు. యార్డుల్లో చేపట్టిన పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. -
జగన్ పాలనలో రైతుల పరిస్థితి దారుణం
[ 03-05-2024]
తెదేపా ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో జనరంజకంగా ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పేర్కొన్నారు. ఆలూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
ప్రచార భేరి
[ 03-05-2024]
ఆదోనిలోని 8, 9 వార్డుల్లో ఆదోని నియోజకవర్గ భాజపా అభ్యర్థి డా.పార్థసారథి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన బాధ్యుడు మల్లప్ప, తెదేపా, ఎమ్మార్పీఎస్, నాయకులు పాల్గొన్నారు. -
జగన్ ఆరాచకం.. తెలుగు గంగకు శోకం
[ 03-05-2024]
నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టుపై ప్రస్తుత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం రైతులకు శాపంగా పరిణమించింది. అయిదేళ్లలో జగనన్న ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎటువంటి శ్రద్ధ చూపకపోవడంతో తాగు, సాగునీటికి కష్టాలేర్పడ్డాయి. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 03-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నంద్యాల తెదేపా ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, శ్రీశైలం నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. -
సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదు
[ 03-05-2024]
ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని ధ్వజమెత్తారు. -
స్వచ్ఛందంగా తెదేపాలోకి చేరికలు: బీసీ
[ 03-05-2024]
ప్రజలు అభివృద్ధిని కోరి స్వచ్ఛందంగా తెదేపాలోకి వస్తున్నారని తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సంజామల మండలం కానాలకు చెందిన 60 కుటుంబాలు, ఆకుమళ్లకు చెందిన మైనార్టీ నాయకులు పార్టీలో చేరారు. -
తెదేపాలో చేరిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు
[ 03-05-2024]
నంద్యాలకు చెందిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఐఎంఏ యాక్షన్ కమిటీ ఛైర్మన్ డా.గుర్రాల రవికృష్ణ వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
కోట్ల, కేఈ కుటుంబాలతోనే అభివృద్ధి
[ 03-05-2024]
డోన్ నియోజకవర్గంలో కోట్ల, కేఈ కుటుంబాల పాలనలోనే అభివృద్ధి జరిగిందని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పేర్కొన్నారు. -
5వ తేదీన నీట్
[ 03-05-2024]
వైద్య కళాశాలల్లో ప్రవేశాలకుగాను 5వ తేదీన ఎన్టీఏ ఆధ్వర్యంలో ‘నీట్’ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?