ఓట్ల బాట
గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది.
ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం చర్యలు
ఉమ్మడి జిల్లాలో రూ.190 కోట్లతో పనులు
గోనెగండ్ల మండలం అల్వాల నుంచి సి.బెళగల్ వరకు వేసిన మట్టి రోడ్డు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : గుంతలు పడ్డాయి.. ప్రయాణానికి ‘దారి’ చూపండని ఐదేళ్లుగా పల్లె జనం విన్నవించినా పట్టించుకోలేదు.. తీరా ఎన్నికల వేళ ‘ఓట్ల’ దారి చూస్తోంది జగన్ సర్కారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 39 రహదారులను (256 కి.మీ.) ఎన్నికలకు ముందు హడావుడిగా నిర్మిస్తోంది. ఆయా ప్రాంతాల్లో త్వరితగతిన పనులు పూర్తి చేయాలంటూ పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లపై కొందరు వైకాపా నేతలు ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా నాణ్యత గాలికొదిలేశారు. తూతూమంత్రంగా పనులు చేసి అయ్యిందనిపిస్తున్నారు.
ఐదేళ్లు గుంతల్లో వదిలేశారు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. గుంతలు తేలి ప్రయాణించలేని పరిస్థితి. ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. గ్రామీణ రహదారులు మరింత అస్తవ్యస్తంగా మారాయి. పలువురు వాహనదారులు అదుపు తప్పి మృతి చెందిన ఘటనలూ ఉన్నాయి. ఐదేళ్లపాటు కళ్లు మూసుకున్న వైకాపా ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న వేళ గ్రామీణ ఓటర్లకు గాలం వేసేందుకు చర్యలు చేపట్టింది. ‘‘హై ఇంపాక్ట్ రోడ్లు’’ పేరుతో గతేడాది రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వానికి అనుకూలమైన ఓ ప్రైవేటు సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి నివేదికలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ‘నాబార్డు‘ నిధులు మంజూరు చేసింది.
మంత్రి నియోజకవర్గానికి ప్రాధాన్యం
- మంత్రి బుగ్గన ప్రాతినిథ్యం వహిస్తున్న డోన్ నియోజకవర్గంలో రూ.27 కోట్ల వ్యయంతో 5 రహదారులు, ఆళ్లగడ్డ పరిధిలో రూ.26.53 కోట్లతో 6, కోడుమూరులో రూ.25.63 కోట్లతో 4, ఆలూరులో రూ.21.70 కోట్లతో 4, నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో రూ.22.78 కోట్లతో 5 రహదారుల పనులు మంజూరయ్యాయి. డోన్ నియోజకవర్గంలో రెండు రహదారులు పూర్తయినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు.
- పత్తికొండ నియోజకవర్గంలో రూ.8.10 కోట్లతో 15 కి.మీ. రహదారిని కేవలం మూడు నెలల్లో పూర్తి చేశారు. ఈ పనుల్లో నాణ్యత కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడి ఉన్న కొందరు రహదారి పనులను తక్కువ ధర (లెస్)కు టెండర్లు దక్కించుకున్నారు.
- బనగానపల్లిలో ఒక్క రహదారికి రూ.18.50 కోట్లు, శ్రీశైలంలో రూ.17.98 కోట్లతో 5 రహదారులు, పాణ్యంలో రూ.7.56 కోట్లతో మూడు, ఎమ్మిగనూరులో రూ.7.32 కోట్లతో 7, నంద్యాలలో రూ.5.85 కోట్లతో 3 రోడ్లు, పత్తికొండలో (మద్దికెర-ఆలూరు వరకు 15 కి.మీ) రూ.8.15 కోట్లతో మంజూరైన రహదారిని గత నెలలోనే హడావుడిగా పూర్తి చేశారు.
అటు ఓట్లు.. ఇటు కమీషన్లు
ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం ద్వారా ఓట్లు రాబట్టుకోవడంతోపాటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలకు పర్సంటేజీలు అప్పజెప్పేందుకు అవకాశం ఉంటుందనే ప్రణాళికతో గ్రామీణ రహదారులు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రూ.190 కోట్లతో 256 కి.మీ. వరకు 39 రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోడ్లకు సంబంధించి గతేడాది అక్టోబరు 16న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ ఏడాది జనవరిలో టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఒప్పందాలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రెండు నెలల కిందట కొన్ని రహదారుల నిర్మాణం ప్రారంభం కాగా.. అధిక శాతం పనులు ఇంకా జరగలేదు.
ఎన్నికల వేళ.. హడావుడి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని ‘పాలకుర్తి నుంచి మెరుగుదొడ్డి వరకు 12 కి.మీల రహదారికి రూ.4.50 కోట్లతో రహదారి పనులను ఆఘమేఘాలతో చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో రూ.11.85 కోట్ల వ్యయంతో కేజీ రోడ్డు నుంచి కోల్లబావాపురం వయా పూడిచెర్ల, పూడూరు వరకు 14.70 కి.మీల మేర పనులు జరుగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాగే వేగంగా చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీర్లను కొందరు అధికార వైకాపా నేతలు పురమాయిస్తుండటం గమనార్హం. పనులు హడావుడిగా చేస్తుండటంతో నాణ్యత ప్రమాణాలు కానరావడం లేదు. ఫలితంగా ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అహోబిలంలో ఘనంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
[ 18-05-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. -
నిలిచిన విద్యుత్తు సరఫరా
[ 18-05-2024]
వ్యవసాయం: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజులుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
వైభవంగా వాసవి దేవి జయంతి పూజలు
[ 18-05-2024]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని నగరేశ్వర స్వామి ఆలయంలో వాసవి దేవి జయంతి పూజలు శనివారం వైభవంగా జరిగాయి. -
బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు చోరి
[ 18-05-2024]
మండలంలోని కొటేకల్కు చెందిన ఇబ్రహీం బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.5లక్షలు దొంగలించారు. -
శుకనంపై చిరుత దాడి
[ 18-05-2024]
సున్నిపెంటలోని వెస్ట్రన్ కాలనీలో ఓ ఇంటి ఆవరణలో పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. -
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. -
పత్తి విత్తనం.. నకిలీ పెత్తనం
[ 18-05-2024]
ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తోంది.. ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.. నేల బాగా నానడంతో రైతులు దుక్కులు దున్నుతున్నారు.. విత్తన సేకరణలో నిమగ్నమయ్యారు. -
కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
[ 18-05-2024]
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. -
అవసరం 46,98,726 వచ్చింది 5,40,752
[ 18-05-2024]
నెల రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి.. మొదటి రోజే విద్యార్థులందరికీ పుస్తకాలిస్తామని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. -
అందని బియ్యం..పేదల ఆగ్రహం
[ 18-05-2024]
హొళగుంద మండల పరిధిలోని గజ్జహళ్లిలో 17 రోజులైనా రేషన్ బియ్యం ఇవ్వలేదని గ్రామ సచివాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. రామలింగ, శేఖర్, మంజు, మల్లమ్మ మాట్లాడుతూ 50 కుటుంబాలకు బియ్యం అందలేదన్నారు. -
ఇసుకను తోడేస్తున్నారా? ఫోన్ చేయండి
[ 18-05-2024]
తుంగభద్ర నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ‘‘మా రీచ్లపై కన్నేయండి’’ శీర్షికన ‘ఈనాడు’లో శుక్రవారం కథనం ప్రచురితమైంది.. గనులు, భూగర్భశాఖ అధికారులు స్పందించారు. -
రాబోయే ఐదు రోజులు తేలికపాటి వర్షాలు
[ 18-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఐదు రోజుల్లో చిరు జల్లుల నుంచి తేలికపాటి వర్ష సూచన ఉందని శుక్రవారం బనవాసి ఫారం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త అశోక్కుమార్ తెలిపారు. -
మోహినీ రూపంలో జ్వాలా నృసింహుడు
[ 18-05-2024]
అహోబిలం జ్వాలా నృసింహస్వామి మోహినీ అలంకృతులై భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో స్వామికి మోహినీ అలంకారం చేశారు. -
చంద్రబాబును కలిసిన టీజీ భరత్
[ 18-05-2024]
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ శుక్రవారం హైదరాబాద్లో తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. -
శ్రీమఠంలో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
[ 18-05-2024]
రాఘవేంద్రస్వామి దర్శనార్థం కర్నూలు అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి జి.భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులతో శుక్రవారం మంత్రాలయం వచ్చారు. -
పెద్దాస్పత్రిలో పిచ్చికుక్క స్వైరవిహారం
[ 18-05-2024]
కర్నూలు నగరంలోని సర్వజన వైద్యశాలలో పిచ్చికుక్క శుక్రవారం ఉదయం స్వైరవిహారం చేసింది. దీంతో రోగులు పరుగులు తీశారు. -
బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
[ 18-05-2024]
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్