ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ !
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కొన్ని కేంద్రాల్లో ‘మాస్ కాపీయింగ్’ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వనపర్తి, న్యూస్టుడే
వనపర్తిలోని ఓ ప్రైవేటు పరీక్ష కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న డీఐఈవో జాకిర్హుస్సేన్
ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో కొన్ని కేంద్రాల్లో ‘మాస్ కాపీయింగ్’ జరుగుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు జూనియరు కళాశాలల్లో కలిపి మొత్తం 26 పరీక్ష కేంద్రాలున్నాయి. వీటిలో మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియరు కళాశాలలూ ఉన్నాయి. వీటిలో అక్కడి విద్యార్థులే కాకుండా సమీప గురుకులాలు, కేజీబీవీల వారూ పరీక్షలు రాస్తున్నారు. ఇలాంటి కొన్ని కేంద్రాల్లో కాపీయింగ్ జోరుగా సాగుతున్నట్టు సమాచారం అందింది. పరీక్ష జరిగే సబ్జెక్టు మినహా మిగతా అధ్యాపకుల్ని ఇన్విజిలేటర్లుగా నియమిస్తారు. కొన్ని చోట్ల ఎస్జీటీలనూ పరీక్షల పర్యవేక్షకులగా వేశారు. జిల్లాలోని శ్రీరంగాపురం, ఖిల్లాగణపురం, పాన్గల్, వీపనగండ్లల్లోని జూనియర్ కళాశాలలు ‘సెల్్్ఫ సెంటర్లు’గా ఉన్నాయి. వీటిలో అక్కడి విద్యార్థులే పరీక్షలు రాస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫలితాల శాతం దిగజారకుండా కొందరు అధ్యాపకులు తమ వంతుగా కాపీయింగ్ను ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో రెండు, నాలుగు మార్కుల ప్రశ్నల సమాధానాలను కాపీ చేస్తున్నారని తెలిసింది. ఈ విషయమై డీఐఈవో జాకిర్హుస్సేన్ను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. ‘సెల్ఫ్ సెంటర్ల’పై ప్రత్యేక దృష్టి పెట్టామని, స్క్వాడ్లూ తనిఖీలు చేస్తున్నాయని చెప్పారు. అయినా మరోసారి ఆయా కేంద్రాలకు స్క్వాడ్లను పంపి, తనిఖీ చేసి, కాపీయింగ్ జరగకుండా చూస్తామని చెప్పారు.
304 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం మొదటి సంవత్సరం గణితశాస్త్రం-1, రాజకీయశాస్త్రం-1, వృక్షశాస్త్రం-1 పరీక్షలు జరిగాయి. మొత్తం 304 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ కోర్సు విద్యార్థులు 6016 మందికి గాను 5776 మంది హాజరవగా, 240 మంది గైర్హాజరయ్యారు. వృత్తివిద్యాకోర్సు విద్యార్థులు 1192 మందికి గాను 1128 మంది హాజరవగా, 64 మంది రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.