ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది.
నేడు మహబూబ్నగర్లో రోడ్షో, కార్నర్ మీటింగ్
27న నాగర్కర్నూల్లో పర్యటన
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వ మహబూబ్నగర్లోని 14 స్థానాల్లో రెండింటిలోనే మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. మహబూబ్నగర్ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే భారాస గెలిచింది. మిగతా ఐదు స్థానాలు హస్తం పార్టీ ఖాతాలోకి చేరాయి. ఈ సారి రెండు లోక్సభ స్థానాల పరిధిలో భారాస అభ్యర్థులకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే గత సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో భాజపా అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికలను భారాస ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలపైన దృష్టి పెట్టింది. మహబూబ్నగర్లో సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి టిక్కెట్ కేటాయించగా, నాగర్కర్నూల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ను బరిలో నిలిపింది. ఈ అభ్యర్థుల ప్రచారానికి కేసీఆర్ స్వయంగా వస్తుండటంతో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మహబూబ్నగర్లో రోడ్ షో ఏర్పాటు చేశారు. మెట్టుగడ్డ, బస్టాండ్ మీదుగా క్లాక్టవర్ వరకు రోడ్డు షో నిర్వహించి అక్కడే కార్నర్ మీటింగ్కు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. 27న నాగర్కర్నూల్లో రోడ్డు షో, కార్నర్ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ రెండుచోట్ల కేసీఆర్ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేసి పాలమూరులో సత్తా చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
- భారాస అధినేత రెండు రోజుల పర్యటనలో ప్రధానంగా ప్రాజెక్టులపైనే ప్రసంగాల్లో ప్రస్తావించే అవకాశాలున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆయనపై ప్రధానంగా విమర్శలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. భాజపా కూడా గట్టి పోటీ ఇస్తుండటంతో ఆ పార్టీ అభ్యర్థులపైనా విమర్శలు చేసే అవకాశాలున్నాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
నాలుగోసారి కలిసి వచ్చేనా..: మహబూబ్నగర్ లోక్సభ స్థానంపై కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. వరసగా గత మూడుసార్లు ఈ స్థానాన్ని భారాస కైవసం చేసుకుంది. 2009లో అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మహబూబ్నగర్ ఎంపీగానే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. 2014లో భారాస నుంచి ఎంపీగా జితేందర్రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో మన్నె శ్రీనివాస్రెడ్డిని బరిలో నిలుపగా 78వేల మోజార్టీతో గెలిచారు. నాలుగోసారి కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బాధ్యతలను తమపై వేసుకుని ప్రచారం చేస్తున్నారు. నాగర్కర్నూల్లో 2019లో మొదటిసారి భారాస గెలుపొందింది. ఇక్కడి నుంచి పోతుగంటి రాములు గెలిచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాములు భాజపాలోకి వెళ్లి తన కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకోవడంతో స్థానిక రాజకీయ పరిణామాలు మారాయి. బీఎస్పీకి రాజీనామా చేసి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ గులాబీ గూటికి చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఈ స్థానాన్ని రెండో సారి నిలబెట్టుకోవాలని పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కేసీఆర్ రెండు రోజుల బస్సుయాత్ర పర్యటనలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి. సాయంత్రం రోడ్ షో, కార్నర్ మీటింగ్లు ఉండటంతో మిగతా సమయాల్లో నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేసి అభ్యర్థుల విజయానికి కావాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద గుడ్డు ఇచ్చిన భాజపాకు కర్రు కాల్చి వాత పెట్టాలి: రేవంత్రెడ్డి
[ 04-05-2024]
గజ్వేల్ నుంచి కేడీ వచ్చినా.. దిల్లీ నుంచి మోదీ వచ్చినా పాలమూరులో కాంగ్రెస్ను ఓడించలేరని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
భాజపాతోనే దేశాభివృద్ధి
[ 04-05-2024]
భాజపాతోనే దేశాభివృద్ధి చెందుతుందని జహీరాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అన్నారు. -
వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు పట్టివేత
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాజోలి శివారులోని సుంకేసుల డ్యామ్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.1.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
వడ్డేపల్లిలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
[ 04-05-2024]
జిల్లాలో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు 45.6 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికం కాగా, శనివారం ఏకంగా వడ్డేపల్లిలో 46.0 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రెండు వాహనాలు ఢీ.. ఇద్దరు యువకులు మృతి
[ 04-05-2024]
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తాండ్ర బస్ స్టేషన్లో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. -
తాగునీటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి
[ 04-05-2024]
గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో అందేలా చూడాలని మిషన్ భగీరథ గ్రిడ్ ఎస్ఈ జగన్మోహన్ అన్నారు. -
మోసపూరిత మాటలు చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది
[ 04-05-2024]
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల నిజానికి, వందరోజుల అబద్ధానికి జరుగుతున్న ఈ ఎన్నికల యుధ్ధంలో భారాస విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
[ 04-05-2024]
మండలంలోని పచ్చర్ల గ్రామంలో పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటనపై శనివారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. -
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్పర్సన్ సరిత అన్నారు. -
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో జరగనున్న జన జాతర సభ భద్రత ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ సంతోష్... -
కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం
[ 04-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం కాంగ్రెస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు దస్తగిరి ఆధ్వర్యంలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి... -
పాలమూరుకు అగ్రనేతలు
[ 04-05-2024]
పాలమూరులో ఎన్నికల ప్రచారానికి ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు రానున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. -
పీఎంశ్రీకి మరో 46 పాఠశాలలు
[ 04-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) యోజనను గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. -
పులులకు ఆవాసం.. గ్రామస్థులకు పునరావాసం
[ 04-05-2024]
ఆక్రమణలు, అభివృద్ధి పేర నానాటికి కుంచించుకు పోతున్న అటవీ ప్రాంతంతో అడవికి రారాజైన పెద్దపులుల ఉనికికి భంగం కలుగుతోంది. నల్లమలలో -
ఉత్తర భారతంలో భాజపాకు సగం సీట్లే
[ 04-05-2024]
ఉత్తర భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో భాజపాకు సగం సీట్లు కూడా రావడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. -
పురపాలిక.. మేల్కోవాలిక!
[ 04-05-2024]
మహబూబ్నగర్ పురపాలక సంఘ భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పిల్లర్లు, సజ్జలు, గోడలు, మెట్లు పెచ్చులు ఊడుతున్నాయి. -
విలక్షణ పోరు.. ఇక్కడి తీరు
[ 04-05-2024]
నాగర్కర్నూలు లోక్సభ నియోజకవర్గం 1967లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు 14సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 15వ సారి ఎన్నిక జరుగుతోంది. -
మళ్లీ మోసపోవద్దు
[ 04-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు నమ్మి మోసిపోయినట్లుగా ఇపుడు మళ్లీ బుట్టలోపడొద్దని మహబూబ్నగర్ లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
భాజపాతోనే భారత్ వికాసం : భరత్ ప్రసాద్
[ 04-05-2024]
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మోదీ విజన్తోనే సాధ్యమని నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానం భాజపా అభ్యర్థి భరత్ ప్రసాద్ పేర్కొన్నారు. -
ప్రవీణ్కుమార్ ప్రచారంలో ఉద్రిక్తత
[ 04-05-2024]
నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో చేపట్టిన భారాస ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ లోక్సభ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. -
మోదీ హయాంలో దేశం 30 ఏళ్ల వెనుకబాటు
[ 04-05-2024]
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల పాలనలో దేశాన్ని ముప్పై ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. -
ప్రజాపాలన కాంగ్రెస్తోనే సాధ్యం
[ 04-05-2024]
రాష్ట్రంలో ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటే జిల్లా ప్రజలు ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి తెలిపారు. -
మంచినీటికి ముప్పుతిప్పలు
[ 04-05-2024]
జిల్లా కేంద్రమైన వనపర్తిలో తాగునీటి సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. పురపాలక సంఘంలోని పలు కాలనీలకు రామన్పాడు తాగునీటిని పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు. -
ఓటుకు తప్పని దూరాభారం
[ 04-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా, కొన్ని తండాలవాసులు ఓటేయడానికి దూరం వెళ్లాల్సివస్తోంది. -
రేపటి నీట్కు 11 కేంద్రాలు
[ 04-05-2024]
వైద్యవిద్య కోర్సులో ప్రవేశాల కోసం ఈ నెల 5న నిర్వహించే నీట్కు ఉమ్మడి పాలమూరులో 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఊరట
[ 04-05-2024]
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థులకు ఈనెల 24 నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?