నిత్యం చదువు.. జీవితాన్ని గెలువు
పుస్తకం, పత్రిక, మ్యాగిజైన్ ఏదో ఒకటి ప్రతిరోజూ విద్యార్థులు అరగంటసేపు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంవత్సర క్యాలెండర్లో స్పష్టం చేసింది.
న్యూస్టుడే- నారాయణపేట టౌన్, అచ్చంపేట, కోస్గి : పుస్తకం, పత్రిక, మ్యాగిజైన్ ఏదో ఒకటి ప్రతిరోజూ విద్యార్థులు అరగంటసేపు చదవాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యాసంవత్సర క్యాలెండర్లో స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆ లెక్కన ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 3,58,807 మంది విద్యార్థులు కొత్త పాఠకులుగా రూపుదిద్దుకుంటారు. పఠనం వికాసానికి ఎంతగానో దోహదపడుతుందనేది ప్రభుత్వ ఉద్దేశం. .పుస్తకాలు చదివి తమను తాము ఎలా దిద్దుకున్నారో ఉమ్మడి జిల్లాలోని పలువురు పాఠకులు విద్యార్థులకు వివరిస్తున్నారు.
తెలుసుకో...
* పుల్లని పచ్చి నిమ్మకాయ ముక్క అని చదవగానే నిమ్మకాయ లేకపోయినా నోట్లోంచి లాలాజలం ఊరుతుంది. ఆ భావనే శరీరంలో మార్పులను ప్రేరేపిస్తుంది.. అలాగే ‘అనగనగా ఒక రోజు... తెల్లవారు జామున నిద్ర లేచి.. సూర్యోదయం సమయంలో....‘ ఇలా చదవుతుంటే సూర్యోదయం దృశ్యాన్ని తెర మీద చూస్తున్నట్టు అనుభూతి కలగకమానదు..నిత్య పఠనం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతటి మార్పులు వస్తాయో దీన్ని బట్టి తెలుస్తుంది... కొత్త విషయం నేర్చుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి.
* స్వామి వివేకానంద, డా.బీఆర్ అంబేడ్కర్ వంటి వ్యక్తులు అధిక సమయం గ్రంథాలయాల్లో గడిపారు. పుస్తకాలు మామూలు వ్యక్తులను అసమాన్యులుగా తీర్చిదిద్దినట్లు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి.
* చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం చెప్పారంటే పఠనం ఎంతగొప్పదో అర్ధమవుతుంది.
13 ఏళ్ల వరకు బడి అంటే తెలియదు
మాది బల్మూరు మండలం నర్సాయిపల్లి తండాలో నిరుపేద గిరిజన కుటుంబం. చిన్నతనంలో పాఠశాలకు పంపించకుండా పశువుల కాపరిగా పెట్టారు. 13 ఏళ్ల వయసు వరకు బడి ముఖం చూడలేదు. లింగాలలోని ఒక హోటల్లో పనిచేస్తున్న సమయంలో ఓ వ్యక్తి భోజనం చేసేందుకు వచ్చి పేపరు చదువుతుండటం నాలో ఆసక్తిని పెంచింది. పాఠశాలబాట పట్టాను ఉదయం, సాయంత్రం హోటల్లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటూనే చదువుపై దృష్టి పెట్టి విద్యావంతుడిగా ఎదిగాను. పాఠశాలలో పుస్తకాలతో పాటు దినపత్రికలు చదవడం అలవాటు చేసుకున్నా. అక్కడి నుంచి మొదలైన పురోగతి ఎంఏ (ఆంగ్లం), బీఎడ్ పూర్తి చేసి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చేలా చేసింది. ఇప్పటికీ క్రమం తప్పకుండా పుస్తకాలు రోజూ చదువుతున్నా.. పుస్తకాలు చదివితే ఎన్నో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఆర్.కృష్ణ, ఉపాధ్యాయుడు, అచ్చంపేట
పఠనంతో దృక్పథం మారింది
పుస్తకాలు చదవకముందు ఆలోచన ఓ పరిమితిలో ఉండేది. కొత్త కొత్తవి చదువుతుంటే పరిధి విస్తరించింది. ఎన్నోలోపాలను సవరించుకుని ముందుకెళ్లడానికి పుస్తకాలు మార్గం చూపాయి మాతృభాషపై మంచి పట్టు వచ్చింది. తెలుగు పండితుడిగా, రచయితగా నిలదొక్కుకున్నాను. ఖాళీదొరికితే ఏదో ఒకటి చదవడమే నా పని. రోజూ ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నానన్న ఆనందం అనిర్వచనీయం.
కె.గౌరీశంకర్రావు, ఉపాధ్యాయుడు, మహబూబ్నగర్
చదవకుండా బయటకు వెళ్లను
కాలేజీ రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదటం అలవాటైంది. అది క్రమంగా ఇతర రచయితల పుస్తకాలు చదివేలా చేసింది.. రోజూ ఉదయం విధిగా ఏదోఒకటి చదివి బయటకు వెళ్తాను. సమయం లేకపోతే రాత్రి గంటపాటు చదువుతాను. ఆదివారం పుస్తక పఠనానికి అధిక సమయం కేటాయిస్తాను. జీవిత చరిత్రలు, నవలలు, సమాజం, వ్యాపారం తదితర పుస్తకాలను చదవటంతో చాలా మార్పు వచ్చింది.
సత్య యాదవ్, నారాయణపేట.
మానవ విలువలు నేర్పాయి
పుస్తకాలు విలువలను నేర్పుతాయి. తోటి వారిపట్ల ప్రేమ, ఆప్యాయత, ఆపేక్ష పెంపొందించుకునే విధానం నేర్పుతాయి. ఇంటర్ వరకు బలాదూర్గా తిరిగాను. ఆ తర్వాత ప్రేమ కథలు, నవలలు చదివేవాడిని. కొన్నాళ్ల తర్వాత ‘పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా’ పుస్తకం చదివాను. మొదట అర్థం కాకపోవడంతో మూడు సార్లు చదివాను. మనం ఎలా ఉండాలి అన్నది తెలిసింది. నాలో చాలా మార్పులు వచ్చాయి. మానవ సంబంధాలను పెంపొందించుకున్నాను. యుధ్ధన పూడి సులోచన రచించిన జీవన తరంగాలు, నవీన్ రచించిన అంపశయ్య, గోపిచంద్ అసమర్థుడి జీవనయాత్ర దృక్పథాన్ని మార్చాయి.
సుదర్శన్రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు, కోస్గి
విద్యార్థులు స్వతంత్ర పాఠకులుగా మారాలి
విద్యార్థులు ప్రతి రోజూ చదవడం, అవగాహన చేసుకోవడం, అనర్గళంగా మాట్లాడటం నేర్చుకోవాలి. అందుకు నిత్యం స్వతంత్ర పాఠకునిగా మారాలి. విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరంలో అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు 30 నిమిషాలు చదివేలా ప్రణాళిక రూపొందించింది. ఇందువల్ల సెల్ఫోను, టీవీలకు దూరంగా ఉండగలుగుతారు. ఇదే తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన పుస్తకాలు, వారికి జీవితంలో ఉపయోగపడే, వారికి ఆసక్తి ఉన్న పుస్తకాలను కొనుగోలు చేసి అందించాలి. ఇంట్లో చిన్న గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలి.
ఈడీ మధుసూధన్రెడ్డి, రాష్ట్ర రిసోర్స్ గ్రూప్ సభ్యులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్