నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు
ఈ ఏడాది తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా నదిలో నీటి వినియోగం పెరిగింది. మిషన్ భగీరథ ద్వారా మరో రెండు నెలల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది.
పాత బోర్లకు మరమ్మతులు
నాగర్కర్నూల్, న్యూస్టుడే : ఈ ఏడాది తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కృష్ణా నదిలో నీటి వినియోగం పెరిగింది. మిషన్ భగీరథ ద్వారా మరో రెండు నెలల వరకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. గ్రామాల్లోని పాత బోరు బావులు, మోటార్లు మరమ్మతులు చేసే ప్రక్రియ మొదలైంది. నీటి ఎద్దడి అధిగమించేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధులు సైతం మంజూరయ్యాయి. వాటితో గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ‘న్యూస్టుడే’ ముఖాముఖిలో మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్రావు వెల్లడించారు.
ప్రశ్న : వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఎద్దడి నివారణకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు.?
జవాబు : కృష్ణానదిలో ఉన్న నీటి నిల్వను బట్టి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అవుతోంది. ప్రత్యామ్నాయంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న నీటి వనరులను గుర్తించాం. 61 చేతి పంపులు, సింగిల్ ఫేజ్ మోటార్లు 565, త్రీఫేజ్ మోటార్లు 335, చిన్న పైపులైన్ల మరమ్మతులు 217 చోట్ల ఉన్నట్లుగా గుర్తించాం. పైపులైన్ల మరమ్మతులు చాలా వరకు పూర్తి చేశాం. బోరుబావుల్లో ఉన్న మోటార్లు, చేతిపంపుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. పదిహేను రోజుల్లో పూర్తవుతాయి.
ప్ర : తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు ఏమైనా మంజూరయ్యాయా?
జ : వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యేల అభివృద్ధి నిధుల నుంచి రూ.5 కోట్లు వచ్చాయి. వాటితో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ.3.95 కోట్లు జిల్లాకు వచ్చాయి. వాటితో మరమ్మతు పనులు చేపట్టాం. వీటితో పాటు గ్రామ పంచాయతీల్లో ఎస్ఎఫ్సీ, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొన్ని నిధులను వాడుకోవాలని ఆదేశాలు వచ్చాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారులకు సూచనలు చేశాం.
ప్ర : కృష్ణానదిలో తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లున్నాయా, అవి ఎప్పట్టి వరకు వచ్చే అవకాశం ఉంది.
జవాబు: కృష్ణానదిలో తాగునీటి అసవరాలకు సరపడ నీళ్లు ప్రస్తుతం ఉన్నాయి. కాని ఆంద్రప్రదేశ్ వైపున సాగునీటికి నీటిని వదులుతున్నారు. దింతో ఇక్కడ తాగునీటికి కొంత ఇబ్బంది వస్తూంది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలతో మరో 45 రోజుల నుంచి 60 రోజుల వరకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉందని చెపుతున్నారు. ఎంతవరకు నీళ్లు పూర్తి స్థాయిలో వస్తాయనేది కచ్చితంగా చెప్పలేం.
ప్ర : గ్రామాల్లో పాత బోరుబావులకు మరమ్మతులు చేయటం లేదు. మరమ్మతుల పేరుతో నిధుల దుర్వినియోగాన్ని ఎలా నివారిస్తారు.?
జ : గ్రామాల్లోని ప్రత్యేకాధికారులతో పర్యవేక్షణ చేస్తాం. నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదు. ముందుగానే పాత బోరుబావులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎలాంటి సమస్య ఉంది? ఎంత ఖర్చవుతుందనేది అంచనా వేస్తున్నాం. వాటి ఆధారంగానే బిల్లుల చెల్లింపులు చేస్తాం.. నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో మరమ్మతులు చేయాల్సిన బోర్లు ఉంటే ఏఈల దృష్టికి తేవాలి.
ప్ర : నల్లమల్లలోని చెంచులకు మిషన్ భగీరథ నీటి సరఫరా కావడం లేదు. ప్రత్యామ్నాయంగా తాగునీరు ఎలా అందిస్తారు.?
జ : నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచులకు తాగునీరు అందించేందుకు ఐటీడీఏతో కలిసి పనిచేస్తున్నాం. అక్కడ 14 చెంచు పెంటలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. ఈర్లపెంట, అప్పాపూర్పెంట, మేడిమాల్కల పెంటలో బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో అక్కడ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. మిగతా చెంచు పెంటల్లో సోలార్ ద్వారా మోటార్లు పనిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులతోనూ సమీక్షిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం