‘అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా మోదీ పాలన’
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్, వేదికపై భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ, దళిత మోర్చా నాయకులు
మహబూబ్నగర్ గ్రామీణం, న్యూస్టుడే : బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని భాజపా దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికుమార్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన భాజపా దళిత మోర్చా నాయకుల సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ ఎస్సీలను రాజకీయ లబ్ధికి వాడుకున్నదే తప్పా అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలను ఆచరణలో ఆచరణలో పెట్టలేదని విమర్శించారు. పదేళ్ల క్రితం అధికారం చేపట్టిన మోదీ దేశంలోని అణగారిన దళితుల అభ్యున్నతికి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నారని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలతో సమానంగా దళితులకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అండగా నిలుస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. దళిత బిడ్డలు విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించేందుకు అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం పేరుతో రూ.20లక్షల ఆర్థికసాయం అందిస్తున్నారని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతి దళిత కుటుంబం భాజపా అభ్యర్థి విజయానికి అండగా నిలవాలని కోరారు. భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మాట్లాడుతూ అంబేడ్కర్ను ప్రతి పార్టీ దళితుల ఓట్ల కోసం వాడుకుందే తప్పా ఆయన ఆశయాల సాధనకు కృషిచేయలేదన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశంలో అన్ని కులాలు, మతాల వాళ్లు ఆర్థిక, సామాజికంగా ఎదిగేలా పనిచేస్తోందన్నారు. వికసిత్ భారత్ మోదీతోనే సాధ్యమని పేర్కొన్నారు. మోదీని మూడో సారి ప్రధానమంత్రిని చేయడం కోసం దళితమోర్చా ఆధ్వర్యంలో దళితుల ఓట్ల సాధనకు క్షేత్రస్థాయిలో శ్రమించాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఇంటింటికి వెళ్లి పేదల సంక్షేమం కోసం అమలు చేసిన పథకాలు వివరించాలని డీకే అరుణ కోరారు. సమావేశంలో దళితమోర్చా పార్లమెంట్ స్థానం ఇన్ఛార్జి విజయ్కుమార్, కార్యవర్గ సభ్యులు కొండయ్య, ఎడ్ల కృష్ణయ్య, భరత్భూషణ్, సాయిరాం, జిల్లా అధ్యక్షుడు కొంగలి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు శ్రీరాములు, పి.చెన్నయ్య, ఎం.రాము, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
[ 06-05-2024]
సీఎం రేవంత్రెడ్డి స్థాయి మరిచి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది: ఎమ్మెల్యే
[ 06-05-2024]
ఆరు గ్యారంటీల పేరుతో మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. -
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
[ 06-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. -
ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర
[ 06-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
[ 06-05-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత
[ 06-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. -
రేవంత్ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్ఎస్ ప్రవీణ్
[ 06-05-2024]
రాష్ట్రంలో రేవంత్ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్కర్నూల్ భారాస పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
[ 06-05-2024]
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. -
అంజన్నా! నీ భూమి కాపాడుకో
[ 06-05-2024]
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. -
బడి బాగుకు రూ.8.71 కోట్లు
[ 06-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
రూ.15వేల జీతగాడి ఇంట్లో రూ.25 కోట్లు.. ఎవరీ మంత్రి అలంఘీర్ ..?
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?