రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
జన జాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ
బంగ్లా రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలకాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈనాడు, మహబూబ్నగర్ : భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. చిన్న సైజ్ పుస్తకాన్ని తీసుకొచ్చి సభలో చూపుతూ దాని గురించి వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ నడిగడ్డ, బంగ్లా రాజకీయాలపై విమర్శలు గుప్పించారు. పొద్దున చేరో పార్టీలో ఉంటారు.. రాత్రి అయిన తర్వాత ఇద్దరూ ఒక్కటై ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడగొట్టారన్నారు. అదే బంగ్లా రాజకీయం ఇప్పటికీ ఈ ప్రాంతంలో నడుస్తోందన్నారు. ఈ రాజకీయాలకు శాశ్వతంగా ముగింపు పలికి నడిగడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పాలన్నారు. 70 ఏళ్ల తర్వాత మన పాలమూరుకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిందన్నారు. మన ప్రాంతంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి కాంగ్రెస్కి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ని ఓడించాలని బంగ్లా వాళ్లు అంటున్నారు. డీకే అరుణను జడ్పీటీసీ, ఎమ్మెల్యే, మంత్రిని చేసింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.. భరతసింహారెడ్డి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని దందాలు చేసి రూ.కోట్లు సంపాదించలేదా? అన్నారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ని ఓడించాలని బంగ్లా మనుషులు కుట్రలు చేస్తున్నారని వాటిని ప్రజలు తిప్పి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తేనే నడిగడ్డ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. కృష్ణా, తుంగభద్ర మధ్యలో ఉండే నడిగడ్డ పౌరుషానికి, ఇచ్చిన మాట నిలబెట్టడానికి పెట్టింది పేరని మాట ఇస్తే తల తెగినా.. కిందపడ్డా నిలబెట్టుకునే బిడ్డలు ఈ ప్రాంత ప్రజలన్నారు. నాగర్కర్నూల్ నుంచి మల్లు రవి, మహబూబ్నగర్ నుంచి వంశీచంద్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పదేళ్లలో భారాస ప్రభుత్వం పాలమూరులో కృష్ణా నది నుంచి చుక్క మంచినీరు కూడా ఇవ్వలేదన్నారు. శ్రీశైలం, జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్తోపాటు ఇటీవల ప్రారంభించిన నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యాయన్నారు. భారాసకు బుద్ధి చెప్పడానికి నాగర్కర్నూల్ నుంచి మల్లు రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ, జాతీయ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఎంపీ అభ్యర్థి మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, తూడి మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి
నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని గెలిపించాలని కోరుతున్న రాహుల్గాంధీ, వేదికపై భట్టివిక్రమార్క, దీపాదాస్మున్షీ, సీఎం రేవంత్రెడ్డి, రోహిత్చౌదరి, జూపల్లి కృష్ణారావు, తిరుపతయ్య, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి
ఎన్నికలు చరిత్రాత్మకం కావాలి: మంత్రి జూపల్లి
ఇటిక్యాల, మానవపాడు, న్యూస్టుడే: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబ రుణం తీర్చుకునే అవకాశం ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయని, ప్రజలు ఆలోచించి కాంగ్రెస్కి ఓటు వేయాలన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసి, దేశాన్ని సంఘటితం చేస్తూ దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. సోనియా కుటుంబం త్యాగాల కుటుంబమని అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలలో రాహుల్ గాంధిని ప్రధానమంత్రిగా చేస్తే దేశంలో ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఎంపీ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ... ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో ఆరుగ్యారంటీలతో పాటు కేంద్రంలోని ఐదు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. గుడికి వెళ్లినట్లుగానే ఈ నెల 13న పోలింగ్ కేంద్రానికి వెళ్లి హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్దికి కృషి చేస్తానన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా పనిచేస్తోందన్నారు. భారాస పార్టీ నేతలు మతిభ్రమించి పార్టీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నడిగడ్డ ప్రజల పౌరుషాన్ని పార్లమెంటు ఎన్నికలలో చూపించి ఎంపీ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మందకొడిగా ధాన్యం సేకరణ
[ 18-05-2024]
పాలమూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ మందకొడిగా సాగుతోంది. యాసంగిలో మహబూబ్నగర్లో 1.11 లక్షలు, నాగర్కర్నూల్-1.09 లక్షలు, నారాయణపేట-1.15 లక్షలు, వనపర్తి-91 వేలు, జోగులాంబ గద్వాల-50వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. -
రుణమాఫీపై ఆశలు
[ 18-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఆర్టీసీకి పోటెత్తారు
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు సొంతూళ్లకు ఓటేసేందుకు పోటెత్తారు. ఈనెల 13న లోక్సభ ఎన్నికలు జరగడంతో పట్టణాలు, నగరాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు స్వగ్రామాలకు తరలొచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. -
వేసవిలో ముంచెత్తుతున్న వర్షాలు
[ 18-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. గట్టు మండలకేంద్రంలో అత్యధికంగా 10.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
నిఘా నేత్రాలు అరకొర!
[ 18-05-2024]
రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగలు తమ వాటం ప్రదర్శిస్తుంటారు. నిత్యం వేలాది మందితో కిటకిటలాడే మహబూబ్నగర్ బస్టాండు ఇందుకు వేదిక అవుతోంది. నెలలో రెండు నుంచి నాలుగు వరకు దొంగతనాలు జరుగుతున్నాయి. మహాలక్ష్మి టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన సంగతి విధితమే. -
వేధింపుల నివారణకు ప్రత్యేక కమిటీలు
[ 18-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక కమిషనర్లు విధిగా వేధింపులను నియంత్రించేందుకు కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 19 పురపాలికల్లో కమిటీల ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించారు. -
ఈ-శ్రమ్ సద్వినియోగం చేసుకోండి
[ 18-05-2024]
అసంఘటిత కార్మికులు ఈ-శ్రమ్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.ఆర్.సునీత సూచించారు. శుక్రవారం వనపర్తి కోర్టు ఆవరణలో అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్పై ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. -
పంటల ప్రణాళిక ఖరారు
[ 18-05-2024]
జిల్లాలో వానాకాలం పంటల ప్రణాళికను వ్యవసాయశాఖ ఖరారు చేసింది. అన్ని రకాల పంటలు కలిపి 2,45,953 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనాలు తయారు చేశారు. కేవలం వర్షాధారంగానే కాకుండా చెరువులు, బావులు, బోర్ల ఆధారంగా వానాకాలం పంటలను రైతులు సాగు చేస్తారు. -
సాంకేతిక విద్య.. భవితకు భరోసా
[ 18-05-2024]
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలంటే వారికి సాంకేతిక విద్య అవసరం. దీనికోసం ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరానికి ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. -
ఇంట్లో కుక్కుంది.. పెంపకంలో లెక్కుంది
[ 18-05-2024]
వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ పెంపుడు కుక్క ఆ ఇంట్లో చిన్నారిని తీవ్రంగా గాయపరిచి, చంపేసింది. ప్రేమకు ప్రతిరూపాలుగా భావించే పెంపుడు జంతువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన తెలియజేస్తోంది. ఇంట్లో పెంచే పప్పీలు, పెద్దజాతి కుక్కల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం. -
పిల్లలూ కథలు చదివేద్దామా.!
[ 18-05-2024]
వేసవి సెలవుల్లో విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్, సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా వారిలో పఠనాశక్తి పెంచే దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఎన్సీఈఆర్టీ సహకారంతో రూమ్ టూ రీడ్ సంస్థ ‘లిటరసీ క్లౌడ్’ మాధ్యమం ద్వారా ఇంటి వద్దనే ప్రాథమిక స్థాయి విద్యార్థులు కథలు చదువుకునేలా ఏర్పాటు చేసింది. -
పోలింగ్ సిబ్బందికి చెల్లింపుల్లో వ్యత్యాసం
[ 18-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి పారితోషికం చెల్లింపుల్లో వ్యత్యాసం ఉండటంతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
సెలవులు పూర్తయ్యేసరికి బడులకు వసతులు:ఏసీ
[ 18-05-2024]
వేసవి సెలవులు పూర్తయ్యేలోపు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పనులను పూర్తి చేయాలని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ సూచించారు. చిన్నపొర్ల పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీల పనులను శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. -
మరమ్మతులకు ఇదే తరుణం!
[ 18-05-2024]
ఒకప్పుడు కరవు కాటకాలకు, వలసలకు పాలమూరు జిల్లా చిరునామాగా ఉండేది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి అప్పట్లో మంజూరైనదే భీమా ప్రాజెక్టు. మొదటిదశ కింద మక్తల్ నియోజకవర్గంలో 1998లో రెండు జలాశయాలు నిర్మించతలపెట్టారు. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇప్పటికే అందిస్తున్న ఐదు రకాల వైద్యసేవలతోపాటు మరో ఏడు కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు వైద్య,ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి