logo

ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు.

Updated : 04 May 2024 17:01 IST

రాజోలి: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు. శనివారం గద్వాల నియోజకవర్గంలోని పూడూరు, ఎర్రవెల్లి గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవిని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఆదివారం నిర్వహించనున్న సీఎం సభకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని