logo

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. వడియారం గ్రామానికి చెందిన మాదరబోయిన సుగుణ

Published : 20 Jan 2022 01:28 IST

చేగుంట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మెదక్‌ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. వడియారం గ్రామానికి చెందిన మాదరబోయిన సుగుణ (50) భర్త సిద్ధిరాములు గతంలోనే మృతిచెందాడు. ఈ క్రమంలో ఆమె కూతురు శ్యామల మేడ్చల్‌లో రైల్వే శాఖలో పనిచేస్తూ అక్కడే ఉంటుండడంతో వడియారంలో సుగుణ ఒంటరిగా ఉంటున్నారు. కాగా బుధవారం ఉదయం సుగుణ తన ఇంటి శౌచాలయం వద్ద మృతిచెంది ఉండడం గమనించిన ఇరుగుపొరుగు వారు సమాచారాన్ని శ్యామలకు తెలియజేశారు. ఆమె వచ్చి చూసి, తల్లి మృతిపట్ల అనుమానం వ్యక్తం చేస్తూ స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని