అందని బిల్లులు.. అయోమయంలో రైతులు
జహీరాబాద్ ప్రాంతంలోని చెరకు రైతులకు బిల్లుల కోసం ఈ ఏడాదీ ఎదురుచూపులు తప్పటం లేదు. సీజన్ ముగిసి రెండు, మూడు నెలలు కావస్తోంది. కొందరికి ఇంకా పంట విక్రయానికి సంబంధించిన డబ్బు అందలేదు. ఏప్రిల్ 22న నిర్వహించిన ప్రత్యేక....
న్యూస్టుడే, జహీరాబాద్
గడువు దాటినా విడుదల చేయని చక్కెర మిల్లు యాజమాన్యం
జహీరాబాద్ ప్రాంతంలోని చెరకు రైతులకు బిల్లుల కోసం ఈ ఏడాదీ ఎదురుచూపులు తప్పటం లేదు. సీజన్ ముగిసి రెండు, మూడు నెలలు కావస్తోంది. కొందరికి ఇంకా పంట విక్రయానికి సంబంధించిన డబ్బు అందలేదు. ఏప్రిల్ 22న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మే 15లోపు మొత్తం చెల్లిస్తామని మిల్లు యాజమాన్యం ప్రకటించింది. ఆ గడువు దాటి ఐదు రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు. రూ.10.76 కోట్ల బకాయిలు ఉండగా, శుక్రవారం నాటికి కేవలం రూ.కోటి మాత్రమే చెల్లించింది.
అప్పులు తీర్చలేక...
ఇంతవరకు చేతికి బిల్లులు అందక పోవడంతో పంట పెట్టుబడులకోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. వడ్డీల భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారం పదిరోజుల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతోంది. పెట్టుబడుల కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
ఏటా ఇదే తంతు
జహీరాబాద్ సమీపంలోని ట్రైడెంట్ కర్మాగారం పరిధిలోని రైతులకు ఏటా బిల్లుల సమస్య వెంటాడుతూనే ఉంది. గానుగ ప్రారంభంలో సకాలంలో చెల్లిస్తున్న యాజమాన్యం, చివరి విడతల్లో చెరకు విక్రయించిన రైతులకు చెల్లింపుల్లో జాప్యం చేస్తోంది. నిబంధనల ప్రకారం కర్మాగారానికి చెరకు అందించిన 15 రోజుల్లో డబ్బు చెల్లించాలి. దాదాపు మూడు నెలల క్రితం సరఫరా చేసిన వారికి నేటికీ అందలేదు. 2021-22 గానుగ సీజన్కు సంబంధించి ట్రైడెంట్లో 2021 డిసెంబరు 10 నుంచి 2022 మార్చి 9 వరకు గానుగాడించారు. 2151 మంది రైతులకు చెందిన 2.07 లక్షల టన్నుల చెరకును యాజమాన్యం కొనుగోలు చేసింది. మొత్తం రూ. 63.76 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1800 మందికి దాదాపు రూ.54 కోట్లు చెల్లించినట్లు చక్కెర శాఖ అధికారుల రికార్డులను బట్టితెలుస్తోంది. యాజమాన్యం సకాలంలో డబ్బు ఇవ్వడం లేదని పలువురు రైతులు మంత్రి హరీశ్రావుకు విన్నవించారు. మంత్రి ఆదేశాల మేరకు సీడీసీ ఛైర్మన్ ఉమాకాంత్పాటిల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 22న జహీరాబాద్లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బకాయిలను మే 15వ తేదీ నాటికి చెల్లిస్తామని ట్రైడెంట్ అధికారులు ప్రకటించినా ఆచరణలో నెరవేరలేదు.
ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం
రాజశేఖర్, చక్కెర శాఖ జిల్లా సహాయ కమిషనర్
రైతులకు బిల్లులు ఇప్పించేందుకు నిరంతరం కర్మాగారం యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. అవసరమైతే చట్టపరంగా తీసుకోవాల్పిన చర్యలపై సమాలోచన చేస్తున్నాం. ఇప్పటికే యాజమాన్యానికి తాఖీదులు జారీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434