ఫొటోలు మార్చేసి... స్థలాలు కొట్టేశారు!
దివ్యాంగులకు వచ్చిన ఇంటి స్థలాలను వారికి తెలియకుండానే కొందరు కాజేశారు. కేటాయింపు కోసం అవసరమైన అన్ని పత్రాలను వారి నుంచి సేకరించిన వీరు... చివరకు స్థలాలు ఇచ్చారనే సమాచారం కూడా వారికి చేరకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు
దివ్యాంగులకు ఇవ్వాల్సిన పత్రాలను దగ్గరపెట్టుకొని దందా
పట్టాలొచ్చాయని లబ్ధిదారులకు తెలియకుండా జాగ్రత్తలు
ఈనాడు, సంగారెడ్డి
దివ్యాంగులకు వచ్చిన ఇంటి స్థలాలను వారికి తెలియకుండానే కొందరు కాజేశారు. కేటాయింపు కోసం అవసరమైన అన్ని పత్రాలను వారి నుంచి సేకరించిన వీరు... చివరకు స్థలాలు ఇచ్చారనే సమాచారం కూడా వారికి చేరకుండా జాగ్రత్త పడ్డారు. అధికారులు ఇచ్చిన నివేశన స్థలాల ధ్రువీకరణ పత్రాలను వారి వద్దే ఉంచుకొని దందాకు తెరలేపారు. తమకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికి వాటిని అందించారు. ఇవ్వలేనోళ్లకు అసలు విషయమే తెలియనివ్వలేదు. ధ్రువీకరణ పత్రాలపై ఫొటోలను తొలగించి... తమకు నచ్చిన వారికి అమ్మేసుకున్నారు. కంది మండల కేంద్రంలోని సర్వే సంఖ్య 615లో దివ్యాంగులకు కేటాయించిన ఇంటిస్థలాల్లో జరిగిన భారీ అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇక్కడ 2003లో 126 మందికి ఒక్కొక్కరికి 100గజాల చొప్పున అందించారు. చాలా మందికి తమకు స్థలం వచ్చిన విషయం కూడా తెలియకపోవడం జరిగిన మోసానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వంద గజాల స్థలం రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఉంటుంది. దాదాపు రూ.8-9 కోట్ల విలువైన స్థలాల విషయంలో అక్రమాలు జరిగినట్లు బాధితులు చెబుతున్నారు.
* నివేశన స్థల పత్రం నకలును చూపుతున్న ఈ మహిళ పేరు ఫర్జానా బేగం. కంది మండలంలోని సర్వే సంఖ్య 615లో 100 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ విషయం మొన్నటి వరకు ఆమెకు తెలియదు. తాను దరఖాస్తు చేసుకున్నా... అధికారులు ఇవ్వలేదని అనుకుంటూ వచ్చారు. తనకూ స్థలం ఇచ్చారని, తన ఫొటో తొలగించి వేరే వారి ఫొటో అతికించారని తెలుసుకొని ఆశ్చర్యపోవడం ఆమె వంతయింది. హైదరాబాద్కు చెందిన మహిళకు ఫర్జానాబేగం ధ్రువీకరణ పత్రం సాయంతో ఇంటిస్థలాన్ని ఒకరు విక్రయించారు. దివ్యాంగులకు ఇంటిస్థలాల పేరిట కొందరు సాగించిన దందాకు ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ.
అధికారుల నిర్లక్ష్య వైఖరి
దివ్యాంగుల కోసం అభివృద్ధి చేసిన లేఅవుట్లో భారీ అక్రమాలు జరిగాయంటూ ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు అందాయి. ముదిమాణిక్యం గ్రామానికి చెందిన మొగులయ్య ఇటీవల ప్రజావాణికి వచ్చి తన బాధను వివరించారు. పట్టా ధ్రువపత్రం ఉన్నా... తన స్థలాన్ని ఒక మహిళ ఇతరులకు అమ్మేసుకున్నారని ఉన్నతాధికారులకు తెలిపారు. కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన దివ్యాంగురాలు ఫర్జానా బేగం పేరిట వచ్చిన ధ్రువపత్రంలో ఆమె ఫొటోను తొలగించి... మరోమహిళ ఫొటో అతికించి స్థలాన్ని అమ్మేసుకున్న ఉదంతమూ అధికారుల దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు సమగ్ర విచారణ దిశగా అధికారులు దృష్టిసారించలేదు. కనీసం గతంలో ఎవరెవరికి వాస్తవంగా కేటాయించారు? ఇప్పుడు ఆయా స్థలాల్లో ఎవరుంటున్నారనే విషయం తేల్చినా అక్రమం బహిర్గతమవుతుంది. ఇదే విషయమై కంది మండల తహసీల్దారు విజయలక్ష్మిని అడగ్గా... కేటాయింపులకు సంబంధించిన దస్త్రం దొరకడం లేదని సమాధానమిచ్చారు. వెతికే పనిలో తమ సిబ్బంది నిమగ్నమయ్యారని వివరించారు.
అవసరమైన పత్రాలన్నీ అందించాం
- ముత్తంగి శివలీల, జుల్కల్, కంది మండలం
కందిలో దివ్యాంగుల కోసం లేఅవుట్ చేస్తున్నారని ఒక మహిళ మా వద్దకు వచ్చారు. ఇంటి స్థలం వస్తుందని నాతో చెప్పారు. దీంతో సదరంతో పాటు ఇతర ధ్రువపత్రాలు, నామమాత్ర రుసుం ఆమె చేతిలో పెట్టా. ఆ తర్వాత మాకు అక్కడి నుంచి ఎలాంటి సమాచారం లేదు. మా పేరుతో ఇంటిస్థలాలు వచ్చాయని చాలా మంది చెప్పారు. ఇదే విషయమై అధికారులను అడిగినా.. ఎవరూ పట్టించుకోలేదు. మా గ్రామంలో కొందరి పేర్లతో వచ్చిన ధ్రువీకరణ పత్రాలపై ఉన్న ఫొటోలు తీసేసి... వేరేవాళ్లకు మా స్థలాలు అమ్మినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం