సంస్కృతిని ప్రతిబింబించేలా.. ఔన్నత్యాన్ని చాటేలా..
బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను రూపొందించి తమ ఇంటి దేవతగా కొలుస్తారు. కూడళ్లలో సామూహికంగా ఆడిపాడి సంబరాలు నిర్వహిస్తారు.
పాటల సీడీ ఆవిష్కరణలో..
బతుకమ్మ.. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మను రూపొందించి తమ ఇంటి దేవతగా కొలుస్తారు. కూడళ్లలో సామూహికంగా ఆడిపాడి సంబరాలు నిర్వహిస్తారు. తెలంగాణలో విశిష్ట స్థానం ఉన్న బతుకమ్మపై ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు పాటలు రాసి బాణీ కట్టగా, కొంతమంది పరిశోధనలు చేశారు. మరికొందరు లఘుచిత్రాలు తీసి ఔన్నత్యాన్ని చాటడం విశేషం.
విశేషాలు తెలిసేలా..
చేర్యాల: చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన తాటికొండ విష్ణుమూర్తి బతుకమ్మపై పరిశోధన చేసి విశేషాలను, ఔన్నత్యాన్ని చాటే తీరు, పూర్వవైభవం తీసుకురావాలంటే ఏం చేయాలన్న అంశాలతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు కాగా, తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకలపై పుస్తకంలో వివరించారు. ప్రత్యేకంగా పాటలపై పరిశోధన చేశారు. ఈ పండగకు, జీవన విధానానికి ఉన్న అనుబంధాన్ని క్షుణ్నంగా విపులీకరించారు. గ్రామీణ మహిళలు పాడుకునే పాటల్లోని అలంకారాలు, సామెతలు, జాతీయాలు, నుడికారాలు, వర్ణాలను పుస్తకంలో పొందుపర్చారు.
పాట.. బాణీ కట్టి..
జహీరాబాద్ అర్బన్: ‘బతుకమ్మ పండగ వేళ అంతా మేలుకున్నరే.. వాకిట్లో కళ్లపి చల్లి ముగ్గులేసిరే’ ఆంటూ పూల పండగ ప్రాధాన్యాన్ని వివరిస్తూ జహీరాబాద్కు చెందిన ప్రముఖ గజల్ గాయని డా.స్వరూపారెడ్డి వీడియో ఆల్బమ్ను రూపొందించారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల ఆత్మీయత, తీరొక్క పూలతో తయారు చేసే బతుకమ్మ విశేషాలను వివరిస్తూ పాటను రూపొందించారు. దీన్ని ఇటీవల మంత్రి హరీశ్రావు ఆవిష్కరించగా.. యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. మంచి ఆదరణ వస్తోంది. ఇకపై ఏటా బతుకమ్మ వేడుకలపై పాటల వీడియో చిత్రీకరించనున్నట్లు స్వరూపారాణి చెప్పారు.
చిత్రీకరించి..
హుస్నాబాద్ గ్రామీణం: పూల పండగ విశిష్టతను చాటిచెప్పేలా హుస్నాబాద్ మండలం తోటపల్లికి చెందిన అమూల్య విశేష కృషి చేస్తున్నారు. ఈమె మంచి గాయకురాలు కావడంతో.. బతుకమ్మ పండగ కోసం ఓ పాట పాడింది. దీనికి సంబంధించి స్వగ్రామంలో పాటను గ్రామస్థులతో కలిసి చిత్రీకరించి యూట్యూబ్లో పొందుపర్చారు. దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కన్నపేటకు సంబంధించిన దాసరి కృష్ణ లఘు చిత్రాన్ని నిర్మించారు. పండగకు సంబంధించిన ఈయన తీసిన ఫొటోలకు బహుమతులు లభించాయి.
రచనలు చేస్తూ..
బొంరాస్పేట: బొంరాస్పేట మండలం రేగడిమైలారానికి చెందిన అంజిలప్ప ఎంఏ తెలుగు పూర్తిచేశారు. ఈయనకు కళలపై ఉన్న ఆసక్తితో అటు దిశగా అడుగేసి ప్రశంసలు అందుకుంటున్నారు. 2018 నుంచి బతుకమ్మ పాటలు రాస్తూ చిత్రీకరిస్తున్నారు. వాటిని యూట్యూబ్, సామాజిక మాద్యమాల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు 13 పాటలు పండగ విశిష్టతను చాటేలా స్థానిక కళాకారులతో కలిసి వాటి వీడియోలను చిత్రీకరించారు. అంజిలప్ప స్వయంగా సంగీతాన్ని జోడించి ఉత్సాహపరిచేలా రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమితానందం.. షా ఆగమనం
[ 26-04-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆగమనంతో సిద్దిపేట కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. లోక్సభ ఎన్నికల వేళ కాషాయ దళంలో నయాజోష్ కనిపించింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
మెతుకుసీమ గులాబీ జెండా అడ్డా...
[ 26-04-2024]
మెతుకుసీమ గులాబీ జెండాకు అడ్డా అని... ఈ ఎన్నికల్లోనూ మరోసారి జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. -
వెల్లువెత్తిన నామపత్రాలు
[ 26-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి వెల్లువలా నామపత్రాలు దాఖలయ్యాయి. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు సమర్పించారు. -
బీసీ బిడ్డను ఆశీర్వదించండి
[ 26-04-2024]
అన్ని వర్గాలను కలుపు కొనిపోయే బీసీ బిడ్డగా తనను ఆశీర్వదించాలని మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు కోరారు. గురువారం కౌడిపల్లి, కంచన్పల్లి, పాంపల్లి, వెల్దుర్తి, మాసాయిపేటలో రోడ్డుషో, సభ నిర్వహించారు. -
ఫలితం లేదు..
[ 26-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు కొంతమేర ఊరటనిచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాలేదు. గత నాలుగేళ్ల నుంచి ఫలితాల్లో జిల్లా చివరి స్థానంలో నిలుస్తుండగా.. -
నిఘా నీడ.. పక్కా పర్యవేక్షణ
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
పంచాయతీ నుంచి లోక్సభకు..
[ 26-04-2024]
ఎం.బాగారెడ్డి.. మెతుకుసీమ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో అపజయం ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృత్యువాత
[ 26-04-2024]
ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలో జరిగింది. -
జహీరాబాద్కు 69.. మెదక్కు 90
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాయకుల ఉత్సాహం.. వలసలకు ప్రోత్సాహం
[ 26-04-2024]
ఎన్నికల్లో పైచేయి సాధించాలని ప్రధాన పార్టీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ప్రజల్లో పరపతి ఉన్న నియోజకవర్గం, మండల స్థాయి నేతలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. -
ప్రైవేటు రుణాలతో ఆర్థిక ఇబ్బందులు
[ 26-04-2024]
హుస్నాబాద్ ప్రాంతంలో ప్రైవేటుగా సూక్ష్మ రుణాలు (మైక్రో ఫైనాన్స్) మళ్లీ మొదలయ్యాయి. పేదల అవసరాలను ఆసరా చేసుకుని రుణాలు ఇస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
సామాజిక మాధ్యమంలో బయటపడిన వరుడి గుట్టు.. ఒకరోజు ముందు ఆగిన పెళ్లి
[ 26-04-2024]
పెళ్లి నిశ్చయమైన యువకుడికి మరో మహిళతో సంబంధం ఉందని తెలుసుకున్న వధువు బంధువులు పెళ్లికి ఒకరోజు ముందు వరుడిని నిలదీసిన ఘటన శివ్వంపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం