ప్రజాభాగస్వామ్యం.. పర్యావరణహితం
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి.
పచ్చదనంపై మరింత అవగాహన అవశ్యం
సీనియర్ శాస్త్రవేత్త సుధాకర్రెడ్డి
న్యూస్టుడే, సిద్దిపేట
‘పర్యావరణం బాగుంటే.. సమస్త జీవజాతుల మనుగడ సాఫీగా సాగుతుంది. ఇందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు ప్రజాభాగస్వామ్యం పెరగాలి. గ్రామస్థాయి నుంచే చైతన్యం, అవగాహన పెరగాలి. తద్వారా వాతావరణంలో సమతుల్యత సాధ్యం’ అని ఇస్రో అనుబంధ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్) సీనియర్ శాస్త్రవేత్త చింతల సుధాకర్రెడ్డి తెలిపారు. సిద్దిపేట స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించగా వివిధ అంశాలపై మాట్లాడారు. ఒకప్పుడు ఇదే కళాశాలలో చదివి ప్రస్తుతం శాస్త్రవేత్తగా విద్యార్థులకు మార్గదర్శనం చేయడం గొప్ప అనుభూతిని ఇస్తోందన్నారు. ప్రకృతిహితాన్ని కాంక్షిస్తూ అందరూ సమష్టిగా ముందడుగు వేయాలని సూచించారు.
అటవీ శాఖను అప్రమత్తం చేస్తున్నాం..
పదేళ్ల కిందటితో పోలిస్తే అడవుల్లో పచ్చదనం క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాలు ఈ దిశగా అడుగేయం శుభపరిణామం. అటవీశాఖతో పాటు ప్రజలు మొక్కల సంరక్షణ క్రతువులో పాలుపంచుకోవడం విశేషం. అటవీ సంపద, విస్తీర్ణాన్ని సంరక్షించుకోవాలి. ఇందుకు ఇస్రో సాంకేతికత దోహదపడుతుంది. వాతావరణంలో వచ్చే మార్పులను సులువుగా తెలుసుకునే వెసులుబాటు మాకు ఉంది. దీనిపై కేంద్రానికి నివేదిస్తుంటాం. అడవుల్లో మంటలు, కార్చిచ్చు వంటివి సంభవిస్తే ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియాకు సమాచారం చేరవేస్తాం. వారు అటవీ శాఖను అప్రమత్తం చేస్తుంటారు.
నిరంతర పరిశ్రమతోనే ఎదిగా..
నిరంతర పరిశ్రమతో ఆసక్తి ఉన్న విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగవవచ్చు. భవిష్యత్తు అంతా పరిశోధన రంగంపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలు అనేకం ఉన్నాయి. ప్రతి విద్యార్థి ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. మేం చదువుకునే సమయంలో వనరులు తక్కువే. సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. శాస్త్రీయత, నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తూ ముందడుగు వేస్తే శాస్త్రవేత్తగా ఎదగవచ్చు. ఇందుకు సరైన మార్గదర్శనం ఉండాలి. సంకల్పం గొప్పదైతే లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
స్వస్థలం ఇక్కడే..
మా స్వస్థలం చేర్యాల మండలం ముస్త్యాల. 1991-94 వరకు సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ చదివా. ఉస్మానియాలో ఎమ్మెస్సీ (వృక్షశాస్త్రం), కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ పూర్తి చేశా. పరిశోధనలంటే ఆసక్తి. అలా 2001 నుంచి శాస్త్రవేత్తగా స్థిరపడ్డా. ప్రపంచంలో టాప్-2 శాతం శాస్త్రవేత్తల్లో ఒకరిగా నాలుగేళ్లుగా కొనసాగుతున్నా. సిద్దిపేట కళాశాలలో నేర్చుకున్న అంశాలు ఈ స్థాయిలో నిలిచేందుకు దోహదం చేశాయి. అడవులు, పర్యావరణం, జీవవైవిధ్యం సంబంధిత అంశాలపై ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మా బృందం విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తుంటాం. పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తుంటాం.
అసమతుల్యతకు కారణాలు..
వాతావరణంలో అసమతుల్యతకు అడవుల్లో చెట్ల నరికివేత, నగరీకరణ, కాలుష్యం కారణాలు. సమతుల్యతకు నిరంతరాయంగా శ్రమించాలి. 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్ ద్వారా సమతుల్యతపై పలు దేశాలు దృష్టి సారించాయి. విభిన్న జాతుల మొక్కలు, వృక్ష, జంతు జాతుల రక్షణతో జీవవైవిధ్యం సాధ్యమవుతుంది. వాటి మనుగడకు ఇబ్బంది కలిగించే చర్యలకు ఉపక్రమించొద్దు. హాని కలిగించే ప్లాస్టిక్ వంటి ఉత్పత్తుల వినియోగం తగ్గించాలి. జిల్లాలో వివిధ నీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం ద్వారా భవిష్యత్తులో మేలు చేకూరనుంది. ఒకప్పుడు కరవు, కాటకాలు ఎదుర్కొన్న ఈ ప్రాంతంలో నీటివనరుల లభ్యత పెరగడం పర్యావరణానికి మేలు చేసేది. నీళ్ల ద్వారా వివిధ పక్షి, జంతు జాతులు, మత్స్య సంపద వృద్ధి చెందుతుంది. హరితం పెరుగుతుంది. జీవనోపాధి మెరుగవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభివృద్ధికి భరోసా.. గెలుపునకు దిశానిర్దేశం
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా సురేష్షెట్కార్ను లక్ష మెజారిటీతో గెలిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
‘రాజీనామాలతో కొత్త నాటకం’
[ 27-04-2024]
రాజీనామాల పేరుతో మాజీ మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. ఇద్దరూ రాజీనామాలు చేసేవారు కాదు, పనిచేసే వారు కాదని విమర్శించారు. -
సగం కట్టి.. వదిలిపెట్టి
[ 27-04-2024]
నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్ పురపాలికలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఏడాదిగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పురపాలికల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణానికి గత ప్రభుత్వం పూనుకుంది. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
[ 27-04-2024]
విధుల నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం తగదని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ అన్నారు. శుక్రవారం ఆయన పెద్దశంకరంపేట పీహెచ్సీని సందర్శించారు. ఆస్పత్రి నిర్వహణ తీరు, ప్రసూతి వివరాలను పరిశీలించారు. -
విద్యార్థి అధ్యయనం.. విజ్ఞాన కౌశలం
[ 27-04-2024]
విద్యార్థిలో దాగిన విజ్ఞాన తృష్ణను వెలికితీసి.. నూతన ఆవిష్కరణలకు కళాశాల విద్యా శాఖ కృషి చేస్తోంది. వారి కృషి ఫలితంగా ఏటా నిర్వహిస్తున్న ‘జిజ్ఞాస’ పోటీల్లో పలువురు ప్రతిభ చాటుతున్నారు. -
పరిశీలిస్తారు.. నివేదిస్తారు..
[ 27-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న ప్రాధాన్యం మనందరికీ తెలిసిందే. ఎవరికీ ఎక్కువ ఓట్లు పడితే వారే పాలకపక్షాలుగా గద్దెనెక్కవచ్చు. నిర్ణీత వ్యవధిలో నిర్వహించే ఎన్నికల ప్రక్రియ సాఫీగా సాగాలి. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. స్వేచ్ఛాయుతంగా ఓటు వేసేందుకు సకల సౌకర్యాలు కల్పించిన ఎన్నికల సంఘం.. ఓటర్లకు పోల్ చీటీలు పంపిణీ చేస్తోంది. -
ఉల్లంఘనులకు ముకుతాడు
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థుల నామపత్రాల స్వీకరణ గడువు ముగిసింది. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. -
భారాస అక్రమాలు బయటపడుతున్నాయి
[ 27-04-2024]
బీసీ బిడ్డ నీలం మధుకు సీఎం రేవంత్రెడ్డి టిక్కెట్ ఇచ్చారని.. ఇక గెలిపించుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, పార్టీ కార్యాలయంలో సమావేశం శుక్రవారం జరిగాయి. -
రాజీనామా పత్రం రాసి పెట్టుకో హరీశ్రావు: పొన్నం
[ 27-04-2024]
వచ్చే ఆగస్టు 15 నాటికి తమ పార్టీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతుందని, మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ముందుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రం రాసి పెట్టుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
53 ఆమోదం.. ఒకటి తిరస్కరణ
[ 27-04-2024]
మెదక్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లలో ఒక అభ్యర్థి నామపత్రాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మొత్తం 54 మంది అభ్యర్థులు 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!