రేవంత్రెడ్డి.. మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి.. స్వల్ప కాలంలోనే మూడు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 2006లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. పదవీకాలం పూర్తి కాకుండానే 2007లో ఉమ్మడి పార్టీల మద్దతుతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి పోటీగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత తెదేపాలో చేరారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా కొడంగల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో తెదేపాకు రాజీనామా చేసి 2018లో కాంగ్రెస్లో చేరారు. అదే ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.
న్యూస్టుడే, బొంరాస్పేట
వేలికి సిరా.. ఓటుకు పక్కా
ఓటరు వేలి మీద సిరా చుక్క పడిందంటే ఓటేసినట్లే లెక్క. ఎన్నికల్లో అక్రమాలను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సిరాను వినియోగిస్తోంది. పోలింగ్ బూత్లో ఓటేయగానే ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలిపై సిరా చుక్క వేస్తారు. చర్మంపై పూసిన ఈ సిరాను త్వరగా తొలగించడానికి సాధ్యపడదు. సిరా పూయగానే 15-30 సెకన్లలో పొడిబారుతుంది. కొన్ని రోజుల వరకు అలాగే ఉంటుంది. మెల్లిమెల్లిగా చెదిరిపోతుంది. ఇందులో సిరా 10 శాతం, 14-18 శాతం సిల్వర్ నైట్రేట్ మిళితమై ఉంటుంది. సిల్వర్ నైట్రేట్తో సూర్యరశ్మి తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్, హైదరాబాద్లోని ఓ ప్రయోగశాలలో దీన్ని తయారు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం వద్ద ఈ సిరా ఉత్పత్తికి 1962లోనే ఆయా సంస్థలు హక్కులు పొందాయి. 1976 నుంచి మరో 28 దేశాలకు దీన్ని పంపిణీ చేస్తుండటం గమనార్హం.
న్యూస్టుడే, పెద్దశంకరంపేట
అందరూ సమానమే..!
ఎన్నికల హడావుడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అధికారులు పోలింగ్కు సర్వం సిద్ధం చేస్తుంటారు. వీరిలో పోలీసులే కీలకం. ఓ వైపు ఎన్నికల్లో అమ్రాలు జరగకుండా చూసుకోవడమే కాకుండా, ప్రముఖుల సభలు, సమావేశాలకు భద్రత కల్పించడం వీరి బాధ్యతే. ఇక పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలిందే. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తిస్తుంటారు. అయితే వారు మాత్రం లోపలికి వెళ్లకూడదు. యూనిఫాంలో ఉన్నా లేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు ఎన్నికల అధికారి ఆదేశిస్తే తప్ప అనుమతి ఉండదు.
- అభ్యర్థి, ప్రముఖులు ఓటేసేందుకు వచ్చినా భద్రత సిబ్బంది మాత్రం ద్వారం బయటే ఆగాలి.
- అభ్యర్థికి జడ్ ఫ్లస్ కేటగిరి రక్షణ ఉన్నా వారిని సైతం కేంద్రంలోకి అనుమతించరు. మఫ్టీలో ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరినే అనుమతిస్తారు.
- రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల కేబినెట్ మంత్రులకు ఉండే భద్రతా సిబ్బంది సైతం లోపలికి వెళ్లకూడదు.
- కేవలం ఎన్నికల సంఘం ఆదేశాలను మాత్రమే అమలు చేయాలి. ఎన్నికల సంఘం ఆజ్ఞా పత్రం ఉంటనే లోపలికి అనుమతిస్తారు.
- ఎలాంటి మాటలు, సైగలు చేసినా నేరంగా పరిగణిస్తారు.
న్యూస్టుడే, చేగుంట
ప్రచారానికి, సభకు వస్తే మాకేంటి...
ప్రధాన పార్టీల ప్రచారం, జాతీయ స్థాయి నేతలు సభలకు జనసమీకరణకు ప్రస్తుతం అభ్యర్థులకు, నాయకులకు తలకు మించిన భారమే అవుతోంది. భారీ సభలకు అంతే మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. అభ్యర్థి వెంట ప్రచారానికి తిరిగే వారికి సైతం సాయంత్రానికి ముట్టజెప్పాల్సిందే. గతంలో పార్టీలకు అంకితభావంతో పని చేసే నాయకులు ఉండేవారు. ఒకే పార్టీలో ఉంటూ నేతల వెంట తిరిగేవారు. అవసరమైతే సొంతంగా ఖర్చు పెట్టి నాయకులను గెలిపించుకునే వారు. సుదూర ప్రాంతాల్లో సభలు జరిగినా అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చేవారు. కానీ ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రచారానికి, సభకు వెళ్తే నాకొచ్చేదేమిటి అంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో పాటు ఖర్చులు పెరిగిపోయాయి. పురపాలికల్లో, గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేయడానికి కనీసం నేత వెంట 50 మంది ఉండాల్సిందే. వారికి రోజుకు ఎంతోకొంత చెల్లించక తప్పడం లేదు.
న్యూస్టుడే, పెద్దశంకరంపేట, పాపన్నపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..