‘భాజపాతోనే దేశాభివృద్ధి’
దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.
భాజపాలో చేరిన ఆర్యవైశ్యులతో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు, జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా అధికారంలో ఉండాలని, ప్రధాని మోదీతోనే సాధ్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. సిద్దిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు, చీకోటి ప్రవీణ్ సమక్షంలో బుధవారం భాజపాలో చేరారు. వారు మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, దేశ రక్షణ కోసం నిధులు కేటాయింపు, అంతర్గత భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. పరిశ్రమలు, రహదారుల ఆధునికీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, వైద్యం, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు సాధించిందని గుర్తు చేశారు. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠను మోదీ ఇనుమడింపజేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు కల్పించి అందరికీ సమన్యాయం చేస్తున్న ఘనత భాజపాకే దక్కుతుందని తెలిపారు. అనంతరం రఘునందన్రావు విలేకరులతో మాట్లాడారు. దుబ్బాక నియోజకవర్గంలో భారాస డబ్బులు పంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు. పోలీసులతో కలిసి డబ్బులు పంచి గెలిచినందుకు సిగ్గుపడాలన్నారు. పోలీసుల విచారణలో రాధాకిషన్రావు... భారాస నేతలు డబ్బులు పంచి ఎన్నికల్లో గెలుపొందారని చెప్పారు కదా అన్నారు. కేసీఆర్ ఎంపీగా ఉండి పార్లమెంటుకు హాజరు కాలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సచివాలయానికి వెళ్లలేదన్నారు. వెంకట్రామిరెడ్డి కేసీఆర్, హరీశ్రావులకు బినామీ అని ఆరోపించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి విభీషణ్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విద్యాసాగర్, నాయకులు పాల్గొన్నారు.
వర్గల్, న్యూస్టుడే: భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే భూములు లాక్కుంటారని భాజపా అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. బుధవారం వర్గల్ మండల కేంద్రంలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. నెరవేరని హామీలిచ్చి రేవంత్రెడ్డి గద్దెనెక్కారని విమర్శించారు. నాయకులు బాల్రెడ్డి, నందన్గౌడ్, టేకులపల్లి రాంరెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానాకాలం సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
ఓ వైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగా... మరోవైపు అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..ఇబ్బంది పెడుతూ..
[ 19-05-2024]
అభివృద్ధికి మారుపేరుగా నిలిచే జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నాయి. మెదక్-ఎల్కతుర్తి 134 కి.మీ.ల 765డీజీ జాతీయ రహదారిని రూ.1,461 కోట్ల నిధులతో చేపట్టారు. -
చెరువు మట్టి.. పొలానికి పుష్టి
[ 19-05-2024]
రసాయన ఎరువుల వినియోగం రోజురోజుకు పెరుగడంతో భూసారం తగ్గడమే కాకుండా చీడపీడల ఉద్ధృతితో పాటు పంట దిగుబడుల్లో తేడా ఏర్పడుతోంది. -
లెక్కలు తేలుస్తారు
[ 19-05-2024]
సంఘాలు.. సంస్థలు.. కార్యాలయాలు ఎక్కడైనా లెక్కలే కీలకం. వీటిలో తేడా వస్తే నమ్మకానికి తావుండదు. అందుకే ఇవి పక్కాగా ఉండాలి. -
సీఎం ముఖచిత్రంతో..రాత పుస్తకాలు
[ 19-05-2024]
సర్కారు బడుల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మధ్యాహ్న భోజనం, ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, -
తొలకరికే తొందరొద్దు
[ 19-05-2024]
తొలకరి వర్షాలకే రైతులు తొందరపడి ఎలాంటి విత్తనాలు విత్తొద్దు.. భూమిలో 60 శాతానికి పైగా తేమ ఉన్నప్పుడే విత్తాలి.. ఖరీఫ్ సీజన్కు అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాం -
4 రోజులు.. రూ.4.29 కోట్లు
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికలు.. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అత్యధికులు స్వస్థలాలకు రాకపోకలు సాగించారు. -
సైబర్ నేరస్థులకు ‘మ్యూల్’ ఖాతాలు
[ 19-05-2024]
సైబర్ నేరస్థుల కోసం ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న ముఠా గుట్టును తూర్పు మండలం టాస్క్ఫోర్స్, సైబర్ పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు రట్టు చేశాయి. అయిదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. -
వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి
[ 19-05-2024]
భారాస ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని భాజపా నేత రఘునందన్రావు రాష్ట్ర డీజీపీని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. -
అటు.. ఇటు ఓటేశారు!
[ 19-05-2024]
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే వజ్రాయుధం. దేశాన్ని పాలించేందుకు సమర్థ నేతలను ఎన్నుకునేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
పఠనాసక్తికి బాసట
[ 19-05-2024]
విద్యార్థులు సెలవులు రాగానే చరవాణులకు, టీవీలకు అతుక్కుపోతుంటారు. కేవలం పాఠశాలలు కొనసాగుతున్నప్పుడే చదువుపై దృష్టిపెడుతున్నారు. -
హామీలు అమలు చేయకుంటే రోడ్డెక్కుతాం: భారాస
[ 19-05-2024]
ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేదంటే రోడ్డెక్కుతామని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. -
అన్నదాతల ఆందోళన
[ 19-05-2024]
పట్టణంలోని ఏఎంసీ ఆవరణలో నిర్వహిస్తున్న పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించిన రైతులు లారీల సమస్య కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..