logo

రెండు రేషన్‌ దుకాణాలు సీజ్‌: డీఎస్‌వో

మండలంలోని అమీనాబాద్‌లోని 6 నంబర్‌, రంగయ్యగూడెంలోని 22వ నంబర్‌ రేషన్‌ దుకాణాలను సీజ్‌ చేసినట్లు డీఎస్‌వో విజయలక్ష్మీ తెలిపారు.

Published : 22 Jan 2022 05:53 IST


అమీనాబాద్‌లోని రేషన్‌ దుకాణంలో రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు

అనంతగిరి, న్యూస్‌టుడే: మండలంలోని అమీనాబాద్‌లోని 6 నంబర్‌, రంగయ్యగూడెంలోని 22వ నంబర్‌ రేషన్‌ దుకాణాలను సీజ్‌ చేసినట్లు డీఎస్‌వో విజయలక్ష్మీ తెలిపారు. శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో అధికారులు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ రెండు దుకాణాలకు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న డీలర్‌ కోటయ్య 25.65 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలిందన్నారు. విచారణలో సన్నబియ్యాన్ని పక్కదారి పట్టించి ప్రజలకు దోడ్డు బియ్యం సరఫరా చేశాడని రుజువు కావడంతో సెక్షన్‌ 6ఏ ప్రకారం చర్యలు చేపట్టి అతన్ని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. రేషన్‌ బియ్యన్ని పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది పుల్లయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని