భవితకు... పాలిటెక్నిక్
పాలిటెక్నిక్ కోర్సుల వైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. తక్కువ సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు విద్యార్థులకు దోహదపడుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 30న ప్రవేశ పరీక్ష
యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
నల్గొండ టౌన్, న్యూస్టుడే: పాలిటెక్నిక్ కోర్సుల వైపు యువత ఆసక్తి కనబరుస్తోంది. తక్కువ సమయంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. పదోతరగతి పూర్తయిన తర్వాత పాలిసెట్తో మూడు, నాలుగేళ్లలో మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్ఛు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అభ్యసించవచ్ఛు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్ఛు ఇంజినీరింగ్ విద్యలో రెండో సంవత్సరం నుంచే ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. పాలిటెక్నిక్ కోర్సును ఎంచుకుని భవిష్యత్తులో రాణించవచ్చని విద్యార్థులు భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈనెల 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సుమారు 10వేల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు.
పరీక్ష నిర్వహణ ఇలా
పాలిసెట్ పరీక్షకు రెండున్నర గంటల సమయం కేటాయిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు తొమ్మిది, పదోతరగతి పాఠ్యాంశాల నుంచే ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తారు. ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు ఆయా కళాశాలల్లో సీట్లు కేటాయిస్తారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించరు. ప్రతి కేంద్రంలో కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు.
ఉపాధి అవకాశాలు
పాలిటెక్నిక్ కోర్సుల ద్వారా విద్యార్థులకు ముఖ్యంగా ఇంజినీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రహదారి భవనాలశాఖ, ఆర్టీసీ, ట్రాన్స్కో, జెన్కో, డిస్కం, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, ఎన్టీపీసీ, ఇండియన్ ఆర్మీ, నేవీ తదితర శాఖలతో పాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పాలిటెక్నిక్ కళాశాలలు, సీట్లు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల.. 420
నాగార్జునసాగర్.. 120
సూర్యాపేట.. 180
తిరుమలగిరి 120
యాదగిరిగుట్ట 120
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
పి.జానకీదేవి, ప్రిన్సిపల్, నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
పాలిటెక్నిక్ విద్యకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా అన్ని కళాశాలల్లో సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సొంత జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తున్నాయి. ప్రైవేటు కంపెనీలు పాలిటెక్నిక్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల వైపు ఆసక్తి కనబరుస్తున్నాయి. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సులు చదివి ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరుబాట.. ఓటు మాట..!
[ 26-04-2024]
ఉమ్మడి జిల్లాలో భారాస అధినేత కేసీఆర్ ‘పోరుబాట - బస్సుయాత్ర’ రెండో రోజూ కొనసాగింది. గురువారం సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయల్దేరిన కేసీఆర్కు అర్వపల్లి, తిరుమలగిరి, దేవరుప్పల, జనగామ, ఆలేరు ప్రాంతాల్లో పూలతో స్వాగతం పలికారు. -
ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం: కలెక్టర్
[ 26-04-2024]
ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేసి చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యునికేషన్(సీబీసీ) ఆధ్వర్యంలో గురువారం నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువు గురువారంతో ముగిసింది. ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్సభ స్థానానికి 56 మంది అభ్యర్థులు 114 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. -
గిరి గీశారు అందరూ.. బరిలో నిలిచేది ఎందరో
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కి అఫిడవిట్లు సమర్పించారు. -
దేవరకొండ నుంచి 450 మంది పోటీ
[ 26-04-2024]
లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆయా శాసన సభ నియోజకవర్గాలు కలిసి ఉంటాయి. అక్కడి జనాభాను బట్టి ఐదు నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండొచ్చు. అలాంటిది లోక్సభ నియోజకవర్గానికి ఒకే శాసనసభ నియోజకవర్గం నుంచి 450 మంది పోటీ చేసి ఆకర్షించారు. -
జోజిలపాస్ను అధిరోహించిన దేవరకొండ వాసి
[ 26-04-2024]
అత్యంత ధైర్య సాహసాలతో.. ఎత్తయిన ప్రాంతం జోజీలపాస్కు చేరుకొని ఔరా అనిపించాడు నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి చెందిన అజీజ్. ఇతని తల్లిదండ్రులు అబ్దుల్ సలాం, ఖుర్షీద్భేగంలు. -
వేసవి శిబిరాలు.. నైపుణ్య కారకాలు!
[ 26-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయి. ఇక చిన్నారులు తమ స్నేహితులతో కలిసి ఆటలాడుతుంటే.. వారిలో క్రమశిక్షణకు తోడు నైపుణ్యాభివృద్ధి, సృజనకు మెరుగులుదిద్దాలని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. -
బంజరు భూముల్లో ఆడుకునేవాళ్లం
[ 26-04-2024]
వేసవి సెలవులొస్తే చాలు.. బాల్యమిత్రులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించేవాళ్లం. అప్పట్లో బంజరు భూములే మాకు క్రీడా మైదానాలు. ఆ భూములను మేమే స్వయంగా పిచ్చి మొక్కలు తొలగించి బాగు చేసుకునేవాళ్లం. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 26-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులకు హారతినిచ్చి కొలిచారు. -
యువకుడి బలవన్మరణం
[ 26-04-2024]
పురుగుమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని నాతాళ్లగూడెంలో గురువారం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు, నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయసు ఆరేళ్లలోపే. -
సీ విజిల్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు
[ 26-04-2024]
ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కింద సీవిజిల్ యాప్లో నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే అన్నారు. భువనగిరి గ్రామీణ పోలీస్పరిధిలోని రాయగిరిలో గురువారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. -
ఈవో ఉంటేనే తెరుస్తారా!
[ 26-04-2024]
యాదాద్రికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి అందించేందుకు కొండపైన ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్ మూణ్నాల ముచ్చటగానే మారింది. -
బీసీ గురుకులాల్లో 83.94 శాతం ఉత్తీర్ణత
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాల విద్యార్థులు ద్వితీయ సంవత్సరంలో 83.94శాతం ఉత్తీర్ణత సాధించారని బీసీ గురుకులాల రీజనల్ కోఆర్డినేటర్ షకీనా తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 70.15శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం