logo

అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలన

అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూళించ వచ్చని జిల్లా ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ అధికారి పాపారావు అన్నారు.

Published : 02 Dec 2022 03:25 IST

ర్యాలీలో పాల్గొన్న వైద్యాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: అవగాహనతోనే ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూళించ వచ్చని జిల్లా ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ అధికారి పాపారావు అన్నారు. ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూళన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణ నుంచి వైద్యాధికారులు, ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఉద్యోగులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఐవీ వ్యాధి నియంత్రణను తెలియజేస్తూ ఫ్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిడ్స్‌ నియంత్రణకు జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు వినోద్‌, చిన్ననాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని