ఏదీ.. ఆధునిక వధశాల..?
భువనగిరి పట్టణంలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్న అధునాతన జంతు వధశాల ప్రతిపాదన అటకెక్కింది. నూతన కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో 1.20 ఎకరాల భూమిని ప్రభుత్వం 18 నెలల క్రితం కేటాయించింది.
యాదగిరిగుట్టలో అటకెక్కిన ప్రతిపాదన
భువనగిరి పట్టణం, న్యూస్టుడే
మార్కెట్లో మాంసం విక్రయాలు
భువనగిరి పట్టణంలో ప్రయోగాత్మకంగా నిర్మించాలనుకున్న అధునాతన జంతు వధశాల ప్రతిపాదన అటకెక్కింది. నూతన కలెక్టరేట్ భవన సముదాయం సమీపంలో 1.20 ఎకరాల భూమిని ప్రభుత్వం 18 నెలల క్రితం కేటాయించింది. రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. నిర్మాణానికి అయ్యే నిధులను పురపాలక సంఘం, పశుసంవర్ధకశాఖ, జిల్లా పాలనాధికారి నిధులను సమకూర్చాలని అప్పట్లో నిర్ణయించారు. పనులు ప్రారంభమయ్యే లోపు ప్రతిపాదన అటకెక్కడం గమనార్హం.
సదుపాయాలు ఇవే..
అధునాతన వధశాల నిర్మాణంతో సదుపాయాలు సమకూరనున్నాయి. శాస్త్రీయ పద్ధతిలో, జీవ కారుణ్య నియమానుసారంగా గొర్రెలు, మేకలు వధిస్తారు. ఒక వధశాల నిర్మాణంతో పొరుగు జిల్లాలతో పాటు, శివారు పట్టణాలకు నాణ్యమైన మాంసం అందించే వీలుంది. స్లాటర్ హౌజ్, రేయిలింగ్ హ్యాంగ్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాణాలు ఉంటాయి. పూర్తిస్థాయిలో పరిశుభ్రతను పాటించేందుకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. ఇందులో పనిచేసే వారు చేతికి తొడుగులు, మాస్క్లు, ప్రత్యేక దుస్తులు ధరించి తమ విధులు నిర్వహిస్తారు.
అధికారుల అధ్యయనం ఇలా...
భువనగిరి పట్టణంలో కొనసాగుతున్న మాంసం విక్రయాలపై గతంలో జాతీయ మాంసం నాణ్యత ప్రమాణాల సంస్థ అధికారులు పర్యటించి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తమ నివేదికల్లో పేర్కొన్నారు. మాంసం మార్కెట్లపై పర్యవేక్షణ, నియంత్ర లేకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు తమ అధ్యయనంలో తేల్చారు. మాంసాన్ని నిల్వచేసి రెండు రోజుల వరకు విక్రయిస్తుండటంతో కుళ్లిపోయి అనారోగ్యానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యుడి అనుమతి లేకుండానే జంతువులను వధిస్తున్నట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం.
ప్రస్తుత పరిస్థితి..
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిబంధలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు కొనసాగుతున్నాయి. స్థానిక సంస్థలు, సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు కలుషిత మాంసం భుజిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని అత్యధిక మున్సిపాలిటీల్లో నైజాం హయాంలో నిర్మించిన వధశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ సాకు చూపి వ్యాపారులు ఇళ్ల వద్దే మేకలు, గొర్రెలను, ఇతర జీవాలను వధించి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. మున్సిపాలిటీల్లో మటన్, చికెన్, బీఫ్, ఫిష్ మార్కెట్లు ఉండాలన్న నిబంధన ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు.
* ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిని వివరణ కోరగా ఆధునిక వధశాల ప్రతిపాదన ప్రస్తుతం లేదన్నారు. మాంసం విక్రయాలపై పర్యవేక్షణ పెంచి చర్యలు చేపడతామని వివరణ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కసరత్తు షురూ..!
[ 27-04-2024]
నల్గొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో.. ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికలతో పాటూ ఈ ఎన్నిక గెలుపుపైనా దృష్టి సారించాయి. -
ఇంటింటికీ పోల్ చిట్టీలు..!
[ 27-04-2024]
ఓటు వేసేందుకు ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఓటర్లందరికీ ప్రత్యేకంగా పోల్ చిట్టీలు పంపిణీ చేస్తోంది. -
పురంపై సైబర్ ఉచ్చు..!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో రాకేశ్ అనే వ్యాపారికి ఈ నెల 21న సాయంత్రం సెల్ నంబరు 63054 68441 నుంచి ఫోన్ కాల్ వచ్చింది. -
మామిడీలా
[ 27-04-2024]
మామిడి.. భారతదేశపు పండుగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఎగుమతుల్లోనూ అగ్రస్థానంలో ఉంది. ఇది నిన్నామొన్నటి మాట. -
ఆదరించండి.. అభివృద్ధి చేస్తాడు: రాజగోపాల్రెడ్డి
[ 27-04-2024]
రాబోయే నాలుగేళ్లలో డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేసి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తానని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
పద తమ్ముడూ.. పార్టీ మారుదాం!
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీల క్యాడర్ స్వరూపం మారిపోతోంది. రాజకీయ సమీకరణాలూ శరవేగంగా మారుతున్నాయి. -
సమగ్ర సమాచార మార్గదర్శి
[ 27-04-2024]
ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక రకాల చర్యలు చేపడుతోంది. -
‘గుర్తు’ తెచ్చుకుందాం..రండి
[ 27-04-2024]
రాజకీయ పార్టీల ఉనికిని చాటేది వాటి గుర్తులే. గుర్తుల ఆధారంగానే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించడమే కాకుండా ఓటర్లు ఓటు వేస్తుంటారు. -
ప్రజల మనిషి ధర్మభిక్షం
[ 27-04-2024]
మునుగోడు మండలం ఊకొండిలో కల్లుగీత వృత్తి పని చేసుకునే ధర్మభిక్షం కుటుంబం సూర్యాపేటకు వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. -
ఈతకెళ్లి తండ్రీతనయుల మృతి
[ 27-04-2024]
నీటి ప్రమాదాల నుంచి తప్పించుకునేలా తన ఇద్దరు కుమారులకు ఈత నేర్పాలని భావించిన ఆ తండ్రి. -
అవార్డుల ఉపాధ్యాయుడు ఆదె..!
[ 27-04-2024]
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రెండు దశాబ్దాల నుంచి చిన్నారులకు విద్యాబోధన అందించటమే కాకుండా సమాజంలో విద్యాభివృద్ధికి తనవంతు తోడ్పాటు అందిస్తున్నారు ఆదె సత్యనారాయణ. -
వీడని మిస్టరీ..!
[ 27-04-2024]
ఈ నెల 18 నుంచి కనిపించకుండా పోయిన సూర్యాపేట మండలం యల్కారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు వడ్డె ఎల్లయ్య కేసు మిస్టరీ వీడటం లేదు. -
చివరికి మొగి పురుగు దాడి
[ 27-04-2024]
ఈ సీజన్లో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా గోదావరి జలాలు ఆలస్యంగా విడుదల కావడంతో తుంగతుర్తి నియోజకవర్గంలో 40 శాతం వరి సాగు జనవరి మాసంలో చేపట్టారు. -
వేతనాలు రాక టీఏల ఇబ్బందులు
[ 27-04-2024]
గ్రామీణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి పనులను చూపిస్తూ విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయకుల ( టెక్నికల్ అసిస్టెంట్లు)కు రెండు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
బరిలో..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్లలో భాగంగా శుక్రవారం జరిగిన నామపత్రాల పరిశీలన కార్యక్రమంలో నల్గొండ లోక్సభ పరిధిలో 25 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగా లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?