logo

రాజకీయాలు సామాజిక సేవలో భాగం: గుత్తా

రాజకీయాలు సామాజిక సేవలో భాగం అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చిట్యాలలో పలు సామాజిక సంఘాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.

Published : 29 Sep 2023 05:40 IST

చిట్యాల: గౌడ సంఘం భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న మండలి ఛైర్మన్‌ గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి, ఎంపీ బడుగుల

చిట్యాల, న్యూస్‌టుడే: రాజకీయాలు సామాజిక సేవలో భాగం అని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చిట్యాలలో పలు సామాజిక సంఘాల భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా కొనసాగుతోందని, తలసరి ఆదాయంలో జాతీయ సగటుకన్నా మన రాష్ట్రం ముందంజËలో ఉందన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సీఎం బడుగు, బలహీన వర్గాలకు చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని, నకిరేకల్‌ నియోజకవర్గంలో అమలు చేస్తున్నానని పేర్కొన్నారు. గీత కార్మికులకు సంబంధించి ఈ ప్రాంతం వారిని చండూరు సర్కిల్‌లో చేర్చారని, వారిని నల్గొండకు పునరుద్ధరించాలని కోరుతూ గౌడ సంఘం మండలాధ్యక్షుడు కూనూరు సంజయ్‌దాస్‌ గౌడ్‌ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి, పుర ఛైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, ఎంపీపీ కొలను సునీత, పుర వైస్‌ ఎంపీపీ కూరెళ్ల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని