Telangana Elections: ఐదేళ్లు ఆడే సినిమా.. నేనే ఎమ్మెల్యే!
‘నేనే ఎమ్మెల్యే’ పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం ఓ రాజకీయ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వంద రోజులు (ఐదేళ్లు) నడిచే ఈ సినిమా (పాలన) తమను సంతోషంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ ప్రేక్షకులు (ఓటర్లు) ఎదురుచూసిన వేళ ఇది....
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేడే విడుదల
‘నేనే ఎమ్మెల్యే’ పేరుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం ఓ రాజకీయ చిత్రం విడుదలకు సిద్ధమైంది. వంద రోజులు (ఐదేళ్లు) నడిచే ఈ సినిమా (పాలన) తమను సంతోషంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ ప్రేక్షకులు (ఓటర్లు) ఎదురుచూసిన వేళ ఇది....
12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని.. దాదాపు 25 లక్షల మంది ప్రేక్షకులు (ఓటర్లు) తాము మెచ్చిన కథానాయకుడు (నియోజకవర్గ ఎమ్మెల్యే) ఎవరో ఈ రోజే తేల్చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ (పోలింగ్)ను సెన్సార్ బోర్డు (ఎన్నికల సంఘం) ఇప్పటికే పూర్తి చేసి సినిమా విడుదల (ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి)కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. వాస్తవంగా కథ (ఎన్నికల) కోసం ఆర్నెళ్ల నుంచే చిత్ర బృందాలు (రాజకీయ పార్టీలు) కుస్తీ పట్టాయి. ‘నేనే ఎమ్మెల్యే’ అనే ఒకే పేరు గల సినిమా (పాలన) కోసం కథా రచయితలు, దర్శక నిర్మాతలు (రాజకీయ పార్టీల అధినేతలు) పోటీపడ్డారు. కొన్నాళ్లు తలమునకలై ఎట్టకేలకు కథానాయకుడి (ఎమ్మెల్యే అభ్యర్థి) ని ఎంపిక చేశారు. ఒకే కథా (ఎన్నికలు) లక్ష్యంతో సినిమా (పాలన) కోసం పోటీపడిన హీరో (ఎమ్మెల్యే అభ్యర్థులు)లు 276 మంది. వీరిలో దర్శకనిర్మాతల (రాజకీయ పార్టీల అధినేతలు) ద్వారా కథ (ఎన్నిక) లోకి వచ్చిన వారు, సొంతంగా (స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు) కొందరున్నారు. ఒక్కొక్క చిత్ర బృందం (అధినాయకులు) గత నెలలోనే హీరో (అభ్యర్థి)తో అన్ని లోకేషన్ (నియోజకవర్గం) లలో కష్టపడి షూటింగ్ (ప్రచారం) చేశారు. చిత్రంలో నటీనటులు (పార్టీల ద్వితీయ శ్రేణి, కార్యకర్తలు) పాత్ర (పనితీరు) ను పండించారు. మొదటి నుంచి చివరి రోజు వరకు ప్రతి రోజూ షూటింగ్ (ప్రచార) వివరాలనూ పత్రికలు, ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలు కవర్ చేశాయి. ఆ మధ్యనే ప్రీ ట్రైలర్ (బహిరంగ సభ) లలో ప్రేక్షకులు (ఓటర్లు) ఆదరిస్తే రాబోయే సినిమా (పాలన) గురించి చెప్పేశారు. పాటల సీడీ (మేనిఫెస్టో బ్రోచర్లు) లు విడుదల చేశారు. సంగీత దర్శకులు (మేనిఫెస్టో రూపకర్తలు), గాయకులు (జానపద కళాకారులు) పాటలు ప్రేక్షకుల (ఓటర్ల)కు ఇంపు (ఆకర్షణ) గా రూపొందించి విన్పించారు. ఫైట్ మాస్టార్ల (సలహాదారులు) సూచనలతో ఫైట్లూ (రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు) బాగా వేశారు. సినిమా విడుదల (పోలింగ్ ఫలితాల) కు ముందే ప్రీ రిలీజ్ షో (సర్వే ఫలితాలు) తో ఎవరికి వారే సంతోషించారు. తమ వాడే హీరో (ఎమ్మెల్యే) అని భుజాలు ఎగరేశారు. ఎవరి సినిమా (పాలన), ఎవరి హీరో (ఎమ్మెల్యే అభ్యర్థి)కి ఎంతటి ప్రేక్షక (ఓటర్ల) ఆదరణ లభిస్తుందో ఆదివారం చూడాలి. అందులో కథా నాయకుడి (ఎమ్మెల్యే అభ్యర్థి) పాత్ర ఎంత ఉందో అర్థమవుతుంది. కథలో సంగీతం, పాటలు (పార్టీల మేనిఫెస్టోలు) ప్రేక్షకుల (ఓటర్లు) మదిని ఏ స్థాయిలో దోచుకున్నాయో.. తేలిపోనుంది. వంద రోజులు మంచి సినిమా (పాలన) చూసేందుకు ప్రేక్షకులు (ఓటర్లు) థియేటర్ల (నియోజకవర్గాలు) లో ఇప్పటికే టిక్కెట్లు (ఓట్లు) బుక్ (వేశారు) చేసుకున్నారు. ప్రేక్షకుల (ఓటర్ల) ఆదరణ పొందిన సినిమా (పాలన పార్టీ), హీరో (ఎమ్మెల్యే) మునుముందు శత దినోత్సవ (ఐదేళ్ల పాలన) వేడుకలు ప్రేక్షకుల (ఓటర్ల) మదని మెప్పించేలా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిద్దాం!!
న్యూస్టుడే, మేళ్లచెరువు, మిర్యాలగూడ పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సదస్సు
[ 04-05-2024]
భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని దీప్తి హోటల్లో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో మైనారిటీ సదస్సు నిర్వహించారు. -
పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలపై గళం వినిపిస్తా: చామల కిరణ్ కుమార్ రెడ్డి
[ 04-05-2024]
సీపీఐ మండల కౌన్సిల్ సభ్యులు, ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం భువనగిరి సాయి కన్వెన్షన్లో జరిగింది. -
భారాస అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 04-05-2024]
భువనగిరి పట్టణంలో జిల్లా భారాస పార్టీ కార్యాలయంలో పట్టణ బూత్ కమిటీల సమావేశం ఏర్పాటు చేశారు. -
పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాల కేటాయింపు
[ 04-05-2024]
రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2,141 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను కేటాయించారు. -
చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి
[ 04-05-2024]
కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు బస్టాండ్ ఏరియాలో ప్రచారం చేపట్టారు. -
అభివృద్ధి వివరిస్తూ.. నాయకులను విమర్శిస్తూ..!
[ 04-05-2024]
మునుగోడు నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. -
టెయిల్పాండ్ మట్టిపై అక్రమార్కుల కన్ను!
[ 04-05-2024]
మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో నుంచి ఇటుక బట్టీలు, పలు ప్రైవేట్ భూముల్లో నింపేందుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. -
నేత..ఆత్మీయత
[ 04-05-2024]
అభ్యర్థులు ఎన్నికల్లో గెలవాలంటే అన్ని వర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ తేదీ మరో పదిరోజుల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. -
మరో సందడి షురూ..!
[ 04-05-2024]
లోక్సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. -
పరిశ్రమల స్థాపనతో యువత, మహిళలకు ఉపాధి
[ 04-05-2024]
‘ లోక్సభ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమల స్థాపనకు అవకాశాలున్నా.. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన ఎంపీలు పట్టించుకోలేదు. -
హృదయాన్ని తాకిన అక్షరం
[ 04-05-2024]
మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఐతగోని రవి, మమత దంపతుల కుమార్తె ఆరుషి (18 నెలలు). వీరిది నిరుపేద కుటుంబం. -
కూటమి గెలుపునకు కృషి చేయాలి
[ 04-05-2024]
దేశంలో ఇండియా కూటమి గెలుపు కోసం మిత్రపక్షాలన్నీ కృషి చేయాలని సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి అన్నారు. -
భాజపాకు చోటివ్వొద్దు: బీవీ రాఘవులు
[ 04-05-2024]
లౌకికవాదానికి, అభివృద్ధి మార్గానికి పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో భాజపాకు చొటివ్వొద్దని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రజలను కోరారు. -
పుస్తకాలు వస్తున్నాయ్..!
[ 04-05-2024]
పాఠశాలలు తిరిగి తెరిచే నాటికి పాఠ్యపుస్తకాలు, సారూప్య దుస్తులు అందించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి: చామల
[ 04-05-2024]
ప్రత్యర్థులు తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు మానుకోవాలని భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. పట్టణ శివారులో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
నారసింహుడి సన్నిధిలో ఊంజల్ సేవోత్సవం
[ 04-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో స్వయంభువులైన పంచనారసింహులకు శుక్రవారం నిత్యపూజలతో పాటు అమ్మవారిని ఆరాధిస్తూ ప్రత్యేక క్రతువులను ఆలయ ఆచారంగా నిర్వహించారు. -
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వ ప్రయత్నం: మంత్రి ఉత్తమ్
[ 04-05-2024]
దేశ విచ్ఛిన్నానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మేళ్లచెరువు, దొండపాడు, చిలుకూరులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
భాజపా నేతను చెప్పుతో కొట్టిన డిప్యూటీ సీఎం.. అనకాపల్లిలో వైకాపా అరాచకం
-
సందేశ్ఖాలీ ఘటనలు.. భాజపా ముందస్తు కుట్రే: మమతా బెనర్జీ
-
జై షాకు బ్యాట్ పట్టుకోవడం తెలుసా..?: ఆప్ విమర్శలు