ముందస్తుకు మస్తు స్పందన
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు.
నేటితో ఎర్లీబర్డ్ పథకానికి ముగియనున్న గడువు
నల్గొండలో ముందస్తు పన్ను చెల్లిస్తున్న ప్రజలు
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. నల్గొండ జిల్లా పరిధిలోని 8 పురపాలికల్లో నందికొండ మినహా మిగతా వాటిల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరారు.
నేటితో గడువు పూర్తి..
పురపాలికలకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఆస్తి పన్ను ముఖ్యమైనది. ఆ పన్ను బకాయిలు లేకుండా వసూలు చేయడం పుర యంత్రాంగానికి తలనొప్పిగా మారింది.ఏడాది చివరలో హడావుడి చేసి వసూలు చేయడం తప్ప ఇతర సమయాల్లో వసూళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీంతో పట్టణాల్లో పన్నుల బకాయిలు రూ.కోట్లల్లో పేరుకుపోతున్నాయి. గత ఏడాది వందశాతం వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించినా ఒక్కో మున్సిపాలిటీ 50 శాతం నుంచి 80శాతంలోపే రాబట్టాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ముందస్తుగా పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ కల్పించేలా ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై అధికారులు పెద్దగా ప్రచారం నిర్వహించారు. ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు ఈనెల 30తేదీ లోపు ముందస్తుగా 2024-25 కు సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించే వారికి మాత్రమే 5శాతం రాయితీ కల్పించడంతో ప్రజలు బారులు తీరుతున్నారు. ఇక మంగళవారం ఒక్క రోజే అవకాశం ఉండటంతో చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా పుర కార్యాలయాల వద్ద కౌంటర్ల సంఖ్య పెంచారు. ముందస్తు ప్రణాళిక ద్వారా సమకూరే ఆదాయంతో పట్టణాల్లో అభివృద్ధి పనులు ప్రారంభించే అవకాశముంది.
సద్వినియోగం చేసుకోవాలి:
ముసాబ్ అహ్మద్ సయ్యద్, కమిషనర్, నల్గొండ పురపాలిక
ఎర్లీ బర్డ్ పథకం సద్వినియోగం చేసుకోవాలి. మంగళవారం ఒక రోజే అవకాశం ఉంది. ముందస్తుగా చెల్లిస్తే ఆస్తి పన్నులో ఐదు శాతం రాయితీ లబ్ధిపొందే అవకాశం ఉంది. లక్ష జనాభా దాటిన పట్టణాల్లో నల్గొండ పురపాలిక మెరుగైన వసూలు రాబట్టింది. ఈ నెల 30 గడువు ముగియనుండటంతో పుర కార్యాలయం వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశాం. పట్టణ ప్రజలు స్పందించి మీ ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించి పురపాలిక అభివృద్ధికి సహకరించాలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నల్గొండ జిల్లాలో అనుమతులు.. సూర్యాపేట పరిధిలో తవ్వకాలు
[ 21-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై ఇప్పటివరకు ఒక విధాన నిర్ణయం తీసుకోలేదు. దీంతో కొన్నిచోట్ల పాత పద్ధతి ప్రకారం రీచ్ల నుంచి ఇసుక తరలింపునకు జిల్లా ఉన్నతాధికారులు అనుమతులు ఇస్తున్నారు. -
సభ్యత్వం పేరుతో వసూళ్లు
[ 21-05-2024]
వారందరూ పేద కుటుంబాల వారే. మత్స్య కార్మిక సంఘంలో పేరు నమోదు చేసుకుంటే మేలు జరుగుతుందన్న ఆశ వారిది. వారి ఆశను ఆసరాగా చేసుకుని కొందరు సభ్యత్వ నమోదు పేరిట వసూళ్లకు పాల్పడ్డారు. -
భారత్ను అగ్రస్థానంలో నిలిపిన మోదీ: ఈటల
[ 21-05-2024]
నిర్మాణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీదే అని మాజీ మంత్రి ఈటల రాజేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్లు అన్నారు. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి: ఆర్వో
[ 21-05-2024]
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపునకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. -
పునరావాసం లేదాయె.. కొలువు రాదాయె..!
[ 21-05-2024]
యాదాద్రి అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు (వైటీపీఎస్) నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన కొంతమంది నిర్వాసితులకు ఇప్పటి వరకు పరిహారం అందకపోవడంతో బతుకుదెరువు కోసం వారు కూలీలుగా జీవిస్తున్నారు. -
గెలుపుతో భారాసలో ధైర్యం నింపాలి: జగదీశ్రెడ్డి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపునకు.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ధైర్యం నింపేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి కోరారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సన్నాహక సమావేశంలో మాట్లాడారు. -
నకిలీ విత్తన విక్రేతలపై ఉక్కుపాదం
[ 21-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
[ 21-05-2024]
నేడు స్మార్ట్ఫోన్ వినియోగం పెరిగింది. డిజిటల్ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో సైబర్ మోసాలు జోరుగా సాగుతున్నాయి. అందరినీ బురిడీ కొట్టించేలా ఫోన్కాల్స్ చేయడం, -
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం: హరీశ్రావు
[ 21-05-2024]
ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులపై లాఠీఛార్జీలు జరిగాయని.. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. -
ప్రాణం తీసిన అనుమానం
[ 21-05-2024]
భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాదడంతో తీవ్ర గాయాలు కాగా ఆమెను చికిత్స కోసం తరలించగా అప్పటికే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..