logo

అవకాశవాదులను ఓడించాలి: సీపీఎం

పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత అన్నారు.

Published : 05 May 2024 18:23 IST

భువనగిరి: పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశవాదులను ఓడించి ప్రజాస్వామ్య వాదులను గెలిపించాలని ఐద్వా ఉపాధ్యక్షురాలు కేఎన్ ఆశలత అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణ పరిధిలోని పగిడిపల్లిలో సీపీఎం అభ్యర్థి జహంగీర్ గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భాజపా 10 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలు అమలు కాకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. మహిళలలపై దాడులు జరుగుతున్నా, మహిళ క్రీడాకారులపై దాడులు జరుగుతున్నా, ఏ ఒక్క రోజు వారికి మద్దతుగా మాట్లాడలేదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కాసు మాధవి, వల్దాస్ అంజయ్య, బందెల ఎల్లయ్య, వనం రాజు, చింతల శివ, కల్లూరి నాగమణి, బోడ భాగ్య, మారన్న, మల్లేష్, అజయ్ బాబు, రెడ్డి మల్లేష్, కొత్త లక్ష్మయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని