అంతర్జాలంలో శోధించి...తుపాకీతో తిరిగొచ్ఛి.
తుపాకీ కోసం రెండు నెలలపాటు అంతర్జాలంలో శోధించాడు. లైసెన్స్ లేకుండా దాన్ని తీసుకుని.. ప్రేమించిన యువతిని కడతేర్చాలని కక్షతో అన్వేషించాడు. ఎట్టకేలకు బిహార్లో దొరుకుతుందని గుర్తించాడు. 20 రోజులు అక్కడే ఉండి.. తుపాకీని సిద్ధం చేసుకున్నాడు. అదను చూసి యువతిని చంపి..
తాటిపర్తి కాల్పుల ఘటనలో ఒకరి అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న చౌడేశ్వరి
నెల్లూరు(నేర విభాగం), న్యూస్టుడే: తుపాకీ కోసం రెండు నెలలపాటు అంతర్జాలంలో శోధించాడు. లైసెన్స్ లేకుండా దాన్ని తీసుకుని.. ప్రేమించిన యువతిని కడతేర్చాలని కక్షతో అన్వేషించాడు. ఎట్టకేలకు బిహార్లో దొరుకుతుందని గుర్తించాడు. 20 రోజులు అక్కడే ఉండి.. తుపాకీని సిద్ధం చేసుకున్నాడు. అదను చూసి యువతిని చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు సురేష్రెడ్ఢి పొదలకూరు మండలం తాటిపర్తిలో జరిగిన తుపాకీ కాల్పుల కేసు దర్యాప్తులో పోలీసులు ముందడుగేశారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు నిర్వహించి.. తుపాకీ ఎలా తీసుకున్నాడనే విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఆయా వివరాలను గురువారం జిల్లా అదనపు ఎస్పీ చౌడేశ్వరి స్థానిక ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాటిపర్తికి చెందిన సురేష్రెడ్ఢి. కావ్యశ్రీని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి పెద్దలు అంగీకరించలేదు. మనస్తాపం చెందిన అతడు.. ఈ నెల 9న కావ్యశ్రీ ఇంటికి వెళ్లి తుపాకీతో ఆమెను చంపి.. తానూ షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత జిల్లాలో కాల్పుల సంఘటన కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా ఉత్తర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజే.. ఎస్పీ సీహెచ్ విజయరావు ఆదేశాలతో నాలుగు బృందాలు ఉత్తర భారతానికి వెళ్లాయి. ఎట్టకేలకు పట్నాలో అనధికారికంగా తుపాకీ తీసుకున్నట్లు గుర్తించారు.
పరారీలో మరొకరు
తుపాకీ కాల్పుల సంఘటనతో ఉలిక్కిపడిన జిల్లా పోలీసుశాఖ కేసును సీరియస్గా తీసుకుంది. సంఘటన జరిగిన వెంటనే నాలుగు బృందాలతో ప్రత్యేక దర్యాప్తు నిర్వహించింది. ఆ క్రమంలోనే తుపాకీని అనధికారికంగా విక్రయించిన ఇద్దరిలో ఒకరైన రమేష్కుమార్ను ఒక బృందం అదుపులోకి తీసుకుంది. ప్రధాన నిందితుడైన ఉమేష్కుమార్ పరారీలో ఉండగా.. అతడి కోసం మరో బృందం పని చేస్తోందని అదనపు ఎస్పీ చౌడేశ్వరి తెలిపారు. త్వరలో అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. సమావేశంలో సీసీఎస్ పోలీసులు పాల్గొన్నారు.
20 రోజులు అక్కడే మకాం..
రెండు నెలలపాటు తుపాకీ కోసం అంతర్జాలంలో అన్వేషించిన సురేష్రెడ్ఢి. బిహార్ రాష్ట్రం పట్నా పున్పున్ పోస్టు, కందాప్లో లభ్యవుతుందని తెలుసుకున్నాడు. 2021 అక్టోబరు, నవంబరు నెలలో అదే పనిలో ఉన్నాడు. డిసెంబర్లో అక్కడికి వెళ్లి.. కందాస్ గ్రామంలోని కారు డ్రైవర్ రమేష్కుమార్ను కలిశాడు. ఆపై అతడి సోదరుడు ఉమేష్కుమార్ను పరిచయం చేసుకున్నాడు. 20 రోజుల పాటు అక్కడే ఉండి.. స్థానికంగా తయారు చేసిన తుపాకీని వారిద్దరి నుంచి కొనుగోలు చేశాడు. జనవరిలో తుపాకీతో పాటు నెల్లూరుకు తిరిగొచ్చిన సురేష్రెడ్ఢి. సమయంలో కోసం ఎదురు చూశాడు. దాదాపు అయిదు నెలల తర్వాత కావ్యశ్రీని హత్య చేసి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్