భారీగా గోవా మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
జిల్లాకు గోవా మద్యం భారీగా తరలి వస్తోంది.. ఈక్రమంలో పలుచోట్ల విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెబ్ అధికారుల అదుపులోకి తీసుకొని. వారి నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక సెబ్
నెల్లూరు (నేర విభాగం), న్యూస్టుడే: జిల్లాకు గోవా మద్యం భారీగా తరలి వస్తోంది.. ఈక్రమంలో పలుచోట్ల విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెబ్ అధికారుల అదుపులోకి తీసుకొని. వారి నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక సెబ్ నెల్లూరు-1 స్టేషన్లో జేడీ శ్రీలక్ష్మి వివరాలు వెల్లడించారు.. నవాబుపేట బంగ్లాతోటకు చెందిన వినోద్కుమార్ పొరుగు రాష్ట్రాల మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. గతంలో తెలంగాణ మద్యం అమ్ముతుండగా సెబ్ అధికారులు అరెస్టు చేసినా మార్పు రాలేదు. వినోద్కుమార్ తన స్నేహితుడు నవాబుపేట శ్రీదేవి రైస్మిల్లు ప్రాంతానికి చెందిన పాత నేరస్థుడు గంగరాజుతో కలిసి 624 గోవా మద్యం సీసాలు కొనుగోలు చేశాడు. ఒక సీసా రూ.45 చొప్పున కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో రూ.110 చొప్పున పలువురికి అమ్మాడు. 18న వినోద్కుమార్ కారులో పెద్ద ఎత్తున గోవా మద్యాన్ని ఆత్మకూరుకు తరలిస్తున్నాడని ఎస్పీ సీహెచ్ విజయరావు, సెబ్ జేడీ శ్రీలక్ష్మికి సమాచారం అందింది. సెబ్ ఏఈఎస్ ఎస్.కృష్ణకిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ వి.వెంకటేశ్వర రావు, డీటీఎఫ్ సిబ్బంది పొట్టేపాలెం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. 326 గోవా మద్యం సీసాలను, కారును స్వాధీనం చేసుకున్నారు. వినోద్కుమార్ను విచారించగా ఆత్మకూరులోని గంగరాజు ద్వారా గోవా మద్యం విక్రయించేందుకు వెళుతున్నాడని, అతని సమాచారంతో ఆత్మకూరు సెబ్ ఇన్స్పెక్టర్ నయనతార గంగరాజును రవితేజ కల్యాణ మండపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 78 మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో నెల్లూరు-1, 2, ఆత్మకూరు ఇన్స్పెక్టర్లు కేపీ కిషోర్, వెంకటేశ్వర రావు, బి.నయనతార, డీటీఎఫ్ ఎస్సై ప్రభాకర్ రావు, ఎస్సై శకుంతలా దేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం