logo

ఉరేసుకొని విశ్రాంత వైద్యుడి ఆత్మహత్య

కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన విశ్రాంత హోమియో వైద్యుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలోని సింహాద్రినగర్‌లో జరిగింది. పట్టణ ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోమియో వైద్యుడిగా పనిచేసిన సాంబమూ

Published : 22 May 2022 03:32 IST

కందుకూరు పట్టణం: కుటుంబ సమస్యలతో మనస్తాపం చెందిన విశ్రాంత హోమియో వైద్యుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం పట్టణంలోని సింహాద్రినగర్‌లో జరిగింది. పట్టణ ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోమియో వైద్యుడిగా పనిచేసిన సాంబమూర్తి (63) ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆయన భార్య అనారోగ్యం, ఇతర కారణాలతో మనస్తాపం చెంది, శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని