logo

ప్రతిభావంతులకు పురస్కారాలు

విశ్వసాయి విద్యాసంస్థల్లో చదివి  మెడికల్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఆదివారం ఆ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కస్తూర్బా కళాక్షేతరంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం చేశారు.

Published : 06 Feb 2023 02:19 IST

పురస్కారాలు అందుకున్న విద్యార్థులతో ఛైర్మన్‌ సత్యనారాయణ తదితరులు

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే : విశ్వసాయి విద్యాసంస్థల్లో చదివి  మెడికల్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఆదివారం ఆ విద్యా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కస్తూర్బా కళాక్షేతరంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకులు టి.వరప్రసాద్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. విలువలు, వ్యక్తిత్వం ముఖ్యమని ఉద్బోధించారు. జిల్లా వృత్తివిద్యాఖాధికారి మధుబాబు మాట్లాడుతూ చదువు, క్రీడలతో పాటు వృత్తివిద్యలో ప్రావీణ్యం సాధించాలని కోరారు. ఆ విద్యాసంస్థల ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ మాట్లాడుతూ చదువు ఉంటే ఎంతటి విజయాలనైనా సొంతం చేసుకోవచ్చన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు. డాక్టర్‌ వివేకానందరెడ్డి, విశ్వసాయి సంస్థల వైస్‌ఛైర్మన్‌ జి.కృష్ణమోహన్‌రావు, ఛైర్‌పర్సన్‌ ఎన్‌.రుక్మిణి, ప్రిన్సిపాళ్లు, పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని