తెరచుకోని పాఠం
మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు
ఇచ్చిన ట్యాబ్లలో మిసింగ్ ఎస్డీ కార్డ్ అనే మెసేజ్
నెల్లూరు మూలాపేటలోని రామయ్య బడి(మున్సిపల్ హైస్కూల్)లో 44 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులకు ట్యాబ్లు అందించారు. సాంకేతిక సమస్యలతో రోజూ పదుల సంఖ్యలో తెరుచుకోవడం లేదు. పనిచేయక.. ఎవరికి చూపించాలో తెలియక.. 20 ట్యాబ్లు పక్కన పెట్టేశారు.
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులకు, వారికి చదువు చెప్పే గురువులకు రాష్ట్ర ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి ట్యాబ్లు అందజేసింది. విద్యార్థులు యాప్లో పాఠాలు విని.. అందులోనే సమాధానాలు నమోదు చేయించాల్సి ఉండగా- ఉపాధ్యాయులు వారితో ఆ పని చేయించడంతో పాటు వారూ విని వారి వంతు చేయాల్సి ఉంది. ట్యాబ్ల ద్వారా విద్యాబోధన చేసేలా రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ బైజూస్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంత వరకు సరేలే అనుకున్నా.. ట్యాబ్లో తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షగా మారాయి. జిల్లాలో చాలా వరకు ట్యాబ్లు పనిచేయడం లేదు. ఆన్ చేయగానే ‘మిసింగ్ ఎస్డీ కార్డు ప్లీజ్. ఇన్సెర్ట్ బైజూస్ ఎస్డీ కార్డ్ ఇన్ టుది ఎస్డీ కార్డ్ స్లాట్ ఎర్రర్ 2002’ అనే సందేశం వస్తోంది. ఎస్డీ కార్డు తీసి.. తిరిగి స్లాట్లో పెట్టి.. ఆన్ చేసినా అదే పరిస్థితి ఎదురవుతోంది. లాగిన్ కాకపోవడం, నెట్ వర్క్ అందకపోవడం, లాక్ పడిపోవడం, దానికదే ఆఫ్ కావడం వంటి ఇబ్బందులతో విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దకు పరుగులు తీస్తుండగా- వారికీ పూర్తిస్థాయి అవగాహన లేక చేతులెత్తేస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో పదుల సంఖ్యలో ఈ తరహా సమస్యలు వస్తున్నాయని చెబుతున్నారు.
తల పట్టుకుంటున్న సిబ్బంది
ట్యాబ్లు అందించడం వరకే అన్నట్లు.. విద్యాశాఖ అంతటితో చేతులు దులుపుకొంది. సాంకేతికతపై పట్టులేక.. తలెత్తుతన్న సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఏమీ పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న వారికి చూపించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో పాఠశాలల్లో పదుల సంఖ్యలో పక్కన పెట్టేస్తున్నారు. తాజాగా బుధవారం రామయ్యబడిలో ట్యాబ్ సమస్యల పరిష్కారానికి వచ్చిన విద్యాశాఖ నియమించిన సాంకేతిక సిబ్బంది సైతం ఏమీపాలుపోక తలపట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 12వేలకుపైగా మరమ్మతులకు గురైనట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు సాంకేతిక సిబ్బంది బైజూస్ వారికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు లేదు.. దాంతో ఆ సంస్థ వాటిని గాలికి వదిలేసిందని వ్యాఖ్యానిస్తున్నారు.
సమస్య పరిష్కరిస్తాం
ట్యాబ్లలో సాంకేతిక సమస్యలు వస్తే.. వాటి గుర్తింపు సంఖ్య ద్వారా ఆన్లైన్(వెబెక్స్)లో రాష్ట్ర నిపుణులకు పంపి పరిష్కరిస్తున్నాం. మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం. జిల్లా వ్యాప్తంగానూ కొంత మందిని ఏర్పాటు చేశాం. వారికి చూపిస్తే పరిష్కరిస్తారు.
- పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇష్టంతో చదివితే కొలువులు
[ 27-04-2024]
ఇష్టంతో చదివితే కొలువులు సులువుగా వస్తాయని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ తెలిపారు. -
తెదేపా సూపర్ సిక్స్ పథకాలపై ప్రచారం
[ 27-04-2024]
దగదర్తిలోని పెద్దపుత్తేడు గ్రామం అరుంధతి వాడలో మండల తెదేపా నాయకుడు మాలేపాటి రవీంద్ర నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
[ 27-04-2024]
వైద్యసేవలు ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. హెల్త్ క్లినిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వైద్యసేవలను అందించేందుకు ఎంఎల్హెచ్పీలు సిబ్బందిని నియమించారు. -
ఉన్నత విద్య.. జగన్ మిథ్య
[ 27-04-2024]
విశ్వవిద్యాలయాలు ప్రగతిపథంలో నడవాలన్నా.. విద్యార్థులు చేరేందుకు పోటీపడాలన్నా.. పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలు అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలన్నా.. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ముగిసింది. శుక్రవారం నెల్లూరు పార్లమెంటు, ఎనిమిది నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నేడు తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన
[ 27-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.25కు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
ఓటుతో.. వైకాపాను తరిమికొడదాం
[ 27-04-2024]
‘ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా వైకాపా అరాచక పాలనకు చరమగీతం పాడాలి. ప్రజల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా పనిచేసే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా కాదు.. -
అధికారమే అండ.. ఆక్రమణలే అజెండా!
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి వనరులకు రక్షణ లేకుండా పోయింది. ఖాళీగా కనిపిస్తే చాలు.. అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. సాగునీటి కాలువలనే ఆలోచన లేకుండా కబ్జా చేస్తున్నారు. -
నిమ్మధరలు ఆశాజనకం
[ 27-04-2024]
పొదలకూరు నిమ్మ మార్కెట్లో శుక్రవారం 80 కిలోల నిమ్మకాయల బస్తా రూ.9500 పలికింది. రెండు రోజుల నుంచి నిమ్మ ధరల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. -
ఎన్నికల్లో అక్రమాలపై కఠినంగా వ్యవహరించండి
[ 27-04-2024]
ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్ టి దుధే పోలీసు అధికారులకు సూచించారు. -
జగనన్నా.. గొంతెండుతోందయ్యా!
[ 27-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు వట్టిపోతున్నాయి. దాహం తీర్చుకోవడానికి చుక్క నీరు దొరకడం లేదు. గొంతులు తడారిపోతున్నాయి. -
పట్టణాభివృద్ధిలో వైశ్యుల పాత్ర కీలకం: తెదేపా
[ 27-04-2024]
పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమైందని తెదేపా అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో తెదేపా ఎన్నికల కార్యాలయాన్ని ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణుగోపాల్ నేతృత్వంలో ప్రారంభించారు. -
బాలయ్యా.. మా గుండెల్లో నీవేనయ్యా!
[ 27-04-2024]
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుక్రవారం కావలి, గుడ్లూరులో పర్యటించారు. -
జగన్ సర్కార్ ఉత్తుత్తి సాయం
[ 27-04-2024]
మహిళలను ఆర్థికంగా లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం రుణాలు అందజేస్తామనీ, వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపడతామనే ఆశయం గాడి తప్పింది. -
వైకాపా పాలనలో కూలేందుకు సిద్ధం
[ 27-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ ప్రాంత ప్రజలకు అవస్థలు తప్పడం లేదు... పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి...
తాజా వార్తలు (Latest News)
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి