logo

ఇష్టంతో చదివితే కొలువులు

ఇష్టంతో చదివితే కొలువులు సులువుగా వస్తాయని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ తెలిపారు.

Published : 27 Apr 2024 13:13 IST

కొడవలూరు: ఇష్టంతో చదివితే కొలువులు సులువుగా వస్తాయని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ డాక్టర్ పి.గుణశేఖర్ తెలిపారు. కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెంలో కళాశాల ప్రాంగణ ఎంపికలో కొలువులు సాధించిన విద్యార్థులకు జాయినింగ్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీవీఎస్ కంపెనీలో 21 మంది 2.1 లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యారన్నారు. క్యాపిటల్ వయా ఇండోర్ కంపెనీకి మరో ఎనిమిది మంది 3.5 లక్షల వార్షిక వేతనంతో  ఎంపికయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వి.అనిల్ కుమార్, ఏవో గిరి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని