logo

ప్రచారం ప్రారంభించిన కావలి వైకాపా ఎమ్మెల్యే

కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు.

Published : 28 Mar 2024 10:20 IST

కావలి: కావలి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, రానున్న ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ప్రచారం ప్రారంభించారు. గురువారం ఉదయం కావలి గ్రామీణ మండలం నందమ్మపురం నుంచి ఈ ప్రచారం ప్రారంభించారు. అంతకుముందు కావలి పట్టణంలోని పాతూరు శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు శశికుమార్‌ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాతూరు నాయకులు  జనిగర్ల మహేంద్ర యాదవ్‌, ఈతముక్కల చందు, తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని