logo

క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్‌

కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్‌ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు.

Published : 06 May 2024 05:46 IST

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్‌ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. ఇటీవల జరిగిన రాజకీయ సభలో ఆయన పాల్గొన్నట్లు ఈనాడులో కథనం రావడంతో.. విచారణ చేపట్టిన అధికారుల నివేదికను ఉన్నతాధికారులకు పంపించారు. ఇతన్ని సస్పెండ్‌ చేస్తూ డ్వామా పీడీ ఆదేశాలిచ్చారు. గతంలో పలుకూరు క్షేత్ర సహాయకుడిపైనా ఇలాగే సస్పెన్షన్‌ వేటు పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని